గుంటూరు జిల్లా కు చెందిన రామినేని మహేష్ బాబు(32) ఉద్యోగం నిమిత్తం 8 నెలల క్రితం నగరానికి వలస వచ్చీ రామచంద్రపురం LIG కాలనీ లో నివాసం ఉంటున్నాడు. నగరం లోని ఓ కంపెనీ లో సాప్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న మహేష్ బాబు. పని నిమిత్తం మియాపూర్ కు స్కూటీ పై వెళ్తున్న మహేష్ బాబు ను వెనుక నుండి అతి వేగంగా వచ్చి డీ కొట్టిన డీసీఎం వాహనం. తీవ్ర రక్తస్రావం అయిన మహేష్ బాబు ను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలింపు. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించిన వైద్యులు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలింపు. భార్య రత్నంబా ఇచ్చిన ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Road Accident
జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం ముగ్గురిని బలిగొంది. డివైడర్ను ఢీ కొట్టి కారు పల్టీలు కొట్టగా ముగ్గురు మృతి చెందారు. గద్వాల పట్టణం జమ్మిచేడు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అతివేగంతో కారు రోడ్ డివైడర్ను ఢీకొట్టడంతో కార్ పల్టికొట్టింది. కారులో ఉన్న ఆరుగురు లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గద్వాలలోని ఓ వైద్యుని కుమార్తె పుట్టిన రోజు వేడుకలకు హాజరై గద్వాల నుండి పెబ్బేరుకు వెళ్తుండగా జమ్మిచేడు సమీపంలో అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతులు నరేష్ పవన్ కుమార్, ఆంజనేయులు సంఘటన స్థలంలోనే మృతి చెందగా కారులో వున్న మరో ముగ్గురు గోవర్ధన్ నవీన్ మహబూబ్ లకు తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రకాశం జిల్లా.. త్రిపురాంతకం మండలం ఎల్లంపల్లి వద్ద.. రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం, కారు ఎదురెదురుగా వస్తూ ఢీకొనడంతో మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం 108లో త్రిపురాంతకం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దోర్నాల నుండి వినుకొండ వైపు కారు వెళ్తుండగా.. బొలెరో వాహనం కుంట వైపు అతివేగంతో వెళ్లడంతో.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందిన మహిళ పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెందిన షేక్ షమీగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని ఇంద్రనగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెబ్బెన మండలం లోని అన్నపూర్ణ హై స్కూల్ కు చెందిన స్కూల్ బస్ 30 మంది పిల్లలతో వెళ్తున్న క్రమంలో ఇంద్రనగర్ గ్రామంలో పది మంది పిల్లలను దింపి మరో 20 మంది పిల్లల్ని కొండపల్లి గ్రామంలో దింపాల్సి ఉండగా యూటర్న్ తీసుకుంటే లాంగ్ పడుతుందని డ్రైవర్ రాంగ్ రూట్ వెళ్లడంతో ఎదురుగా వస్తున్న లారీ, బస్సును ఢీ కొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులకు గాయాలుకాగా వారిలో కొంతమందిని కాగజ్ నగర్ ఆస్పత్రికి కొందరిని, మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు, బస్సు నడుపుతున్న డ్రైవర్ రెండు కాళ్లకు తీవ్ర గాయం కావడంతో చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ రాంగ్ రూట్లో రావడమే కారణమని స్థానికులు చెబుతున్నారు.
నెల్లూరు జిల్లా, గుడ్లూరు (మం) మాచర్ల వద్ద జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం. లారీని ఢీ కొట్టిన TSRTC బస్సు ఒకరు మృతి, 7గురి పరిస్థితి విషమం. మృతి చెందిన వ్యక్తి బస్ డ్రైవర్ వినోద్ గా గుర్తింపు. మిర్యాలగూడ నుండి తిరుపతి వెళ్తున్న TSRTC బస్సు. క్షతగాత్రులను కావలి ఏరియా వైద్యశాల లో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలింపు. ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్న పోలీసులు.
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ లో ఘోర ప్రమాదం జరిగింది. బాలానగర్ కూడలి వద్ద వేగంగా వస్తున్న డీసీఎం ఆటో, బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతులు మోతీ ఘనాపూర్ వాసులుగా గుర్తించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి శుక్రవారం సంత బాలానగర్ సెంటర్ లో నిర్వహిస్తారు. దీని కోసం చుట్టుపక్కల గ్రామాలు, తండాల నుంచి ప్రజలు వస్తుంటారు. అయితే సంతకు వచ్చిన కొందరు సరుకులు కొనుగోలు చేసి ఆటోలో తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వస్తున్న డీసీఎం ఆటో, బైకును ఢీకొట్టింది. అయితే అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో విషాదం నెలకొంది. గుర్తుతెలియని వాహనం ఢీకొని జహీర్ అనే వ్యక్తి మృతి చెందాడు. జహీర్ గ్రామంలోని సొసైటీలో క్రాప్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. పని నిమిత్తం కందుకూరు వెళ్లి బైక్ పై రాత్రి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి అక్కడికక్కడే చనిపోయాడు. రాత్రి 10 గంటల తర్వాత కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు జహీర్ కు ఫోన్ చేసిన స్పందించలేదు. వేంసూరు మండలం కందుకూరు గ్రామ శివారు రోడ్డు ప్రమాదానికి గురై జహీర్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో జహీర్ కుటుంబంలో, తుంబురు గ్రామంలో విషాదం నెలకొంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రోడ్డుపై వడ్లు ఆరబోసి ఉండటం తో వాటిని తప్పించే క్రమం లో ఎదురుగా వచ్చిన వాహనం జహీర్ ప్రయాణిస్తున్న బైక్ ను ఢీ కొట్టి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వేంసూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also..
అతివేగం యువకుని ప్రాణాలను బలిగొంది. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఎస్సై మాహేశ్వర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సంకెపల్లి గూడ గ్రామానికి చెందిన మల్లే రాఘవేందర్ గౌడ్(21) గురువారం రాత్రి 11 గంటల సమయంలో నాగరగూడా నుండి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. మార్గమధ్యంలో గ్రామ సమీపంలోని భారత్ గ్యాస్ గోదాం వద్ద బైక్ అతివేగం గా నడపటం వల్లన అదుపుతప్పి డివైడర్ ను ఢీకొంది. ప్రమాదంలో ఛాతీ భాగంపై బలమైన గాయాలు తగలడం వల్లన ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే షాద్నగర్ లోని ఏబీపీ హాస్పిటల్ కి తరలించగా అక్కడ వారు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోవాల్సిందిగా కోరారు. షాద్నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందినట్లు ప్రభుత్వ డాక్టర్లు తెలిపారు. యువకుడు చనిపోవడానికి కారణం ఛాతీ పైన బలంగా డివైడర్ తగలడం తో చనిపోయినట్లు తెలుస్తోంది. తండ్రి శ్రీశైలం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం మిట్టమీదీపల్లె గ్రామ సరిహద్దులోని జాతీయ రహదారిపై బైక్ ను కారు ఢీ కొన్న సంఘటన లో తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడు ఫణీంద్ర ఆరోగ్యం బాగాలేక పోతే మార్కాపురం ఆసుపత్రిలో చూపించుకోని తిరిగి కంభం కు పోతున్న క్రమంలో మిట్టమీద పల్లె గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్ను కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటన లో తండ్రి సొరకాయల బుజ్జి (35), కొడుకు ఫణీంద్ర (10) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు కంభం వాసులు గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ప్రమాదానికి గల కారణం కారు వేగంగా రావడమని తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో నూతన సంవత్సర సమయంలో వృద్ధ దంపతులకు గర్బ శోకం మిగిలింది. గుమ్మల్లదొడ్డి జంక్షన్ రోడ్ ప్రమాదం లో అచ్చుతాపురం గ్రామానికి చెందిన గోక ఏసురాజు (30), అనే యువకుడు దుర్మరణం పాలైనాడు. జాతీయ రహదారిపై ఇటీవల ప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ డ్రమ్ములను బలంగా ఢీ కొట్టాడు. నూతన సంవత్సర వేడుకలు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొత్త సంవత్సరం పూట కొడుకుని పోగొట్టుకున్న వృద్ధ దంపతులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Read Also..





Total views : 141079