ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తారక రామారావు నగర్ లో గ్రామ సంఘాల సహాయకులు సంఘ భవనం కోసం ఇచ్చిన భూమినీ జిల్లా కేంద్రానికి చెందిన హాసన్ అనే వ్యక్తీ కబ్జా చేసిన స్థలంలో ప్రహరీ గోడ నిర్మించడంతో VOA మహిళ సంఘాల సభ్యులు ఏకమై కబ్జాకు గురైన స్ధలంలో ఏర్పాటు చేసిన ప్రహరీ గోడను గడ్డ పారతో పగల కొట్టారు. రెండూ నెలల క్రితం స్థానిక జెడ్పీటీసీ, ఎంపీపీ VOA లకు కేటాయించిన స్థలంలో భూమీ పూజా చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నాయకులు, అధికారులు ఎన్నికల నీర్వహణలో తలమునకలై ఉండగా ఈ అవకాశాన్ని అదునుగా తీసుకొని హాసన్ అనే వ్యక్తి భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని VOA సంఘల మహిళలు పేర్కొన్నారు. ఇప్పటికైన సంభందిత అధికారులు స్పందించి, కబ్జా చేసిన హాసన్ పై చర్యలు తీసుకోవాలని VOA మహిళలు డిమాండ్ చేశారు.