342
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుమ్మల్లపల్లి గ్రామంలో సోయం మల్లయ్య ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలెండర్ లికై మంటలు చెలరేగాయి. దీనితో మంటలు వ్యాపించి ఇల్లు పూర్తిగా దగ్ధం అయింది. స్థానికులు గమనించి మంటలు ఆర్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. ఇల్లు దగ్ధం ఐన సంఘటనలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు భాదిత కుటుంబం విలపిస్తూ తెలిపింది. నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం తరపున చేయూత నివ్వాలని స్థానికులు కోరుతున్నారు.




Total views : 151364