Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Andhra Pradesh వైఎస్ఆర్సిపి నాయకుల్లో అసంతృప్తి సెగ…

వైఎస్ఆర్సిపి నాయకుల్లో అసంతృప్తి సెగ…

by Prakash
Press conference at Naveen Reddy's home

అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తనకు టికెట్ రాలేదన్న అసూయతో మూడు దపాలుగా ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చిన వైఎస్ఆర్సిపి పార్టీని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని దిక్కరించి మాట్లాడడం పై రాయదుర్గం నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి సెగ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సోదరుడు అంపారెడ్డి కుమారుడు నవీన్ రెడ్డి స్వగృహంలో విలేకరుల సమావేశంలో వెల్లడి.

వైసీపీ యువనేత నవీన్ కుమార్ రెడ్డి కామెంట్స్:-

కాపు రామచంద్రారెడ్డి టికెట్ నెపంతో జగన్మోహన్ రెడ్డి గొంతు కోశారు అనడం విడ్డూరం.

ఆత్మ సాక్షిగా ప్రమాణం చేసుకొని 2009 నుండి 2019 వరకు మూడు దపాలుగా వైయస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకే ఎమ్మెల్యేగా గుర్తింపు పొందలేదా ? అన్యాయమైన దుర్మార్గమైన సర్వే అంటావా ? మీరు చేసిన అవినీతి అక్రమాలు జగన్మోహన్ రెడ్డి మీతో చర్చించ లేదా ఇది వాస్తవం కాదా ?

గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో క్రియాశీలకంగా పని చేసిన పార్టీ నాయకులను నీ స్వలాభం కోసం అడ్డొస్తారని, పార్టీ కార్యక్రమాలకు దూరం చేయలేదా ?

నియోజకవర్గంలోని కనేకలు బొమ్మనహాలు మండలాల్లో కార్యకర్తలపై అక్రమ కేసులులో విరికించి హింసించలేదా ?

కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నావే ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో నీ వెంట ఎంతమంది ఉన్నారో చూసుకో!

రాయదుర్గం సబ్ రిజిస్టర్ ద్వారా తమకు డబ్బులు ఇవ్వమని అధికారులను హింసించలేదా తద్వారా ఆరు నెలలుగా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ప్రభుత్వ నిధి గండి కొట్టలేదా?

రామచంద్ర రెడ్డి ఇప్పటికైనా ప్రజా సుపారీలకు పాలన కోసం వైయస్సార్ లో ఉండి ఐక్యత కోసం పోరాడు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు మా ఇంట్లో ఉన్నాయని చెప్పుకోవడం కాదు జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధనాలు గుండెల్లో ఉండాలి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: