Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh దాడులు చేయించేది… సానుభూతి ప్ర‌క‌టించి ధ‌ర్నాలు చేసేది ఎమ్మెల్యేనే

దాడులు చేయించేది… సానుభూతి ప్ర‌క‌టించి ధ‌ర్నాలు చేసేది ఎమ్మెల్యేనే

by Prakash
TDP in-charge GV Praveen Kumar Reddy

ప్రొద్దుటూరులో సామాన్యులు బంగారు, బ‌ట్ట‌లు కొన‌డానికి వ‌స్తే పోలీసులు త‌నిఖీలు చేసి అధారాల్లేవ‌ని డ‌బ్బులు సీజ్ చేయ‌డం వెనుక ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు ఉన్నాడ‌ని, ఆయ‌న‌కు తెలిసే ఇవన్నీ జ‌రుగుతున్నాయ‌ని ప్రొద్దుటూరు టిడిపి ఇంచార్జ్ జీవి ప్ర‌వీణ్ కుమార్ రెడ్డి విమ‌ర్శించారు. ఎన్నిక‌ల కోడ్ ఇంకా అమ‌లు కాక‌ముందే పోలీసులు దాడుల చేస్తూ పెద్ద ఎత్తున నగదు ప‌ట్టుకుని ఐటికీ అప్ప‌జెప్ప‌డం వ‌ల్ల ఇబ్బందులు త‌లెత్తుతున్నాయ‌న్నారు. ఈ దాడులు చేయించేది, ఆపై సానుభూతి ప్ర‌క‌టించి, ధ‌ర్నాలు చేసేది ఎమ్మెల్యేనే అంటూ ఆరోపించారు. పోలీసుల దాడుల వ్య‌వ‌హారంపై ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందులను తొల‌గించాల‌ని టిడిపి తో క‌ల‌సి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు రావాల‌ని ప్ర‌వీణ్ రెడ్డి స‌వాల్ విసిరారు. 30 మ‌ద్యం బాటిళ్లు ప‌ట్టుకుంటే ఎక్సైజ్ స్టేష‌న్ కు వెళ్ళి ఎస్ఐని నిల‌దీసిన ఎమ్మెల్యే 14 ల‌క్ష‌ల న‌గ‌దు కూతురు పెళ్ళి న‌గ‌ల‌ కోసం తీసుకురాగా ప‌ట్టుకున్న‌ప్పుడు ఎందుకు పోలీస్టేష‌న్‌కు వెళ్లలేద‌న్నారు. తాను నియ‌మించుకున్న ఇబ్ర‌హీం ఎమ్మెల్యేకి తెలియ‌కుండా ఏదీ చేయ‌డ‌ని విమ‌ర్శించారు.

Advertisements

You may also like

Our Visitor

014253
Total views : 79634

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.