Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Latest News కేజ్రీవాల్‌ కు ED మరోసారి సమన్ల జారీ…

కేజ్రీవాల్‌ కు ED మరోసారి సమన్ల జారీ…

by Prakash
ED issues summons to Kejriwal again

ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ – ED మరోసారి సమన్లు జారీ చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఫిబ్రవరి 2న విచారణకు హాజరు కావాలని తెలిపింది. ఇప్పటికే నాలుగు సార్లు సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ హాజరుకాలేదు. తొలుత నవంబరు 2న, ఆ తర్వాత డిసెంబరు 21, జనవరి 3, జనవరి 18న తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ ఈడీ పలుమార్లు సమన్లు జారీ చేసింది. అయితే వివిధ కారణాలు చూపి ఆయన వాటిని తిరస్కరించారు. ఈ క్రమంలోనే తాజాగా ఐదోసారి ఆయనను విచారణకు పిలిచింది. ఈసారి కేజ్రీవాల్‌ గైర్హాజరైతే అరెస్టు వారెంట్‌ నిమిత్తం కోర్టును ఆశ్రయించాలని దర్యాప్తు సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఈ సమన్లు చట్టవిరుద్ధమైనవని కేజ్రీవాల్‌ ఆరోపించారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనను విచారణకు పిలుస్తున్నారంటూ కేంద్రంపై మండిపడ్డారు. తన జీవితంలో దాచడానికి ఏమీ లేదని, తాను ఈ సమన్లను స్వీకరించబోనని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

Advertisements

You may also like

Our Visitor

023088
Total views : 140869

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.