Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home National తమిళనాడులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు…

తమిళనాడులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు…

by Prakash
Enforcement Directorate raids in Tamil Nadu

తమిళనాడులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు చేపట్టింది. సినీ నిర్మాత, మాజీ డీఎంకే లీడర్ జాఫర్ సిద్దిఖ్, ఇతరులకు సంబంధించిన డ్రగ్స్ మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం రాష్ట్ర రాజధాని చెన్నై, మదురై, తిరుచిరాపల్లిలోని 25 లోకేషన్లలో కేంద్ర పారామిలటరీ బలగాల ఎస్కార్ట్‌తో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. 36 ఏళ్ల సాదిక్‌ తో సంబంధమున్న దర్శకుడు అమీర్‌, మరికొంతమంది నివాసాలల్లో సోదాలు చేసి పలు కీలక పత్రాలను స్వాధీన చేసుకున్నారు ఈడీ అధికారులు. సాదిక్‌ను గత నెలలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. ఎన్‌సిబి అరెస్టు చేసింది. రూ. 2 వేల కోట్లకు పైగా విలువైన సుమారు 3,500 కిలోల సూడోపెడ్రిన్ అక్రమ రవాణాలో సాదిక్ ప్రమేయం ఉందని వచ్చిన ఆరోపణల క్రమంలో ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Advertisements

You may also like

Our Visitor

023116
Total views : 140989

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.