385
శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ వేదికగా చేపట్టాల్సిన అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం(Agniban Rocket Launch Postponed) చివరి నిమిషంలో వాయిదా పడింది. సాంకేతిక కారణాలతో వాయిదా వేసినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఎనిమిది గంటల కౌంట్డౌన్ అనంతరం ప్రైవేట్ ప్రయోగ వేదిక నుంచి నేడు ఉదయం 5.48 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. దేశంలోనే మొదటి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్గా అగ్నిబాణ్ రికార్డులకెక్కింది. దేశీయంగా రూపొందించిన 3డీ ప్రింటెడ్ ఇంజిన్ను ఇందులో ఉపయోగిస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ముగిసిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం.నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీతో విడిగా భేటీ అయ్యారు. అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక పెండింగ్ ప్రాజెక్టులపై ఇరు నేతలు…
- ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం.ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేశాభివృద్ధి, సమగ్ర మానవ వనరుల పురోగతి, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత లక్ష్య సాధనపై కీలకంగా చర్చించారు.…
- కాచిగూడ రైల్వే స్టేషన్కు 110 ఏళ్ల చరిత్ర.హైదరాబాద్ నగర చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కాచిగూడ రైల్వే స్టేషన్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఆఖరి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ చారిత్రక కట్టడం 110 ఏళ్ల వారసత్వాన్ని పూర్తిచేసుకుంది. గోతిక్ శైలిలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 141063