ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించి అనంతపురం జిల్లాకు మొదటిసారిగా వచ్చిన పయ్యావుల కేశవకు అనంతపురం గుత్తి పట్టణంలో గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. స్థానిక గాంధీ సర్కిల్లో క్రేన్ సహాయంతో పయ్యావుల కేశవకు భారీ గజమాలతో సత్కరించారు. పయ్యావుల కేశవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ నేపథ్యంలో పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్ నుండి పట్టణ శివారు వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలోగుంతకల్ ఎమ్మెల్యేజయరాం,అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్,మడకశిర ఎమ్మెల్యేఎమ్మెస్ రాజు కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు,అనంతపురం ఎంపీఅంబిక లక్ష్మీనారాయణ, అనంతపురం జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో పయ్యావుల మాట్లాడుతూ రాష్ట్రానికి ఆర్థిక మంత్రి అయిన అనంతపురం జిల్లాకు ఒక కూలివాడిగా పని చేస్తానన్నారు. వైసిపి ఐదేళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థ కుదించక పోయిందన్నారు. అనంతపురం జిల్లాకు త్రాగు,సాగునీరు అందించే దిశగా పనిచేస్తానన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్ఎంఎస్.సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం పూర్తిగా విఫలమైందని హెచ్ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు సిద్ధంశెట్టి సాజన్ ఆరోపించారు. యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరిస్తూ కార్మిక సమస్యల పరిష్కారం కంటే పైరవీలకే పరిమితమైందని విమర్శించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల…
- రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.రాఖీ పౌర్ణమి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం టీజీఎస్ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 27 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రవాణా శాఖ మంత్రి…
- మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.మైన్స్ అండ్ జియాలజీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బొజ్జ జయరాజుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం వరంగల్ డిప్యూటీ డైరెక్టర్గా ఎఫ్ఏసీ బాధ్యతలు నిర్వహిస్తున్న జయరాజు.. గతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విధులు నిర్వహించారు.…
- సెప్టెంబర్ 2న పాయకరావుపేటకు చంద్రబాబు.ఉత్తరాంధ్ర జిల్లాల సాగు, తాగునీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేసే బృహత్తర సంకల్పం సాకారమవుతోంది. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా జీవనది గోదావరి జలాలను విశాఖపట్నం, అనకాపల్లి సహా ఉత్తరాంధ్ర ప్రాంతాలకు తరలించే ప్రక్రియకు సీఎం చంద్రబాబు సెప్టెంబర్…
- నేపాల్లో ఏపీ యాత్రికుల భద్రతపై 24 గంటల పర్యవేక్షణనేపాల్లో ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలూ పర్యవేక్షణ కొనసాగిస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ఆర్టీజీఎస్ అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తిరుపతి నుంచి కైలాస మానససరోవర్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.