33
సీఎం రేవంత్ రెడ్డిని కొత్తగా నియమితులైన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సి.వి. ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ ఐసీసీసీ కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, అలాగే చట్టవ్యవస్థను కట్టుదిట్టం చేయడం వంటి కీలక అంశాలపై ఇరువురు మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక భవిష్యత్లో పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేసి ప్రజా భద్రతను మరింత బలోపేతం చేయాలని ఈ సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది.




Total views : 61573