Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh వైసీపీ నేతల మధ్య విభేదాలు..!

వైసీపీ నేతల మధ్య విభేదాలు..!

by Satya
YCP


విశాఖ జిల్లా(Visakhapatnam):

విశాఖ జిల్లా(Visakhapatnam) గాజువాక(Gajuvaka) వైసీపీ(YCP) నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. నియోజకవర్గ సమన్వయకర్తను మార్చినప్పటి నుంచి నివురుగప్పిన నిప్పులా వున్న విభేదాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. ఎవరికి వారు వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారంటూ ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు.

టికెట్‌పై ఎవరికి వారే ధీమా వ్యక్తం..

సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డి(MLA Nagireddy), ప్రస్తుత ఇన్‌ఛార్జి ఉరికిటి చందు మధ్య వైరం తారాస్థాయికి చేరుకుంది. టికెట్‌పై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేశారు. గాజువాక సీటు తమ నాయకుడిదేనని నాగిరెడ్డి వర్గం వెల్లడించింది. అయితే గతంలోనే గాజువాక అభ్యర్థి చందు అంటూ వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) ఓ ప్రకటన చేశారు. దీంతో కార్పొరేటర్ల మద్దతుతో ఉరికిటి చందు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతుంటే నేతల మధ్య ఈ కుమ్ములాటలు ఏమిటంటూ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: జనంలోకి జనసేన కార్యక్రమం..


త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే సరికొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ’ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం …
పులివెందులలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు.. భారీ బైక్ ర్యాలీ.
కడప జిల్లా పులివెందులలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ, బీజేపీ, జనసేన …
అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన.
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పేదలు, బీడీ కార్మికులకు 32 సంవత్సరాల క్రితం మంజూరైన ఇళ్ల …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.


Advertisements

You may also like

Our Visitor

023147
Total views : 141206

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.