రాష్ట్రంలో సంచలనంగా మారిన రాజ్ తరుణ్-లావణ్య వ్యవహారం అనూహ్యంగా మరో కీలక మలుపు తిరిగింది. గుంటూరులో డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అనే యువకుడ్ని ఏపీ సెబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని స్టేషన్కు తరలించి విచారించగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఇటీవల హైదరాబాద్లోని వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితుడికి ఈ సాయి అనే వ్యక్తి డ్రగ్స్ ఇచ్చినట్లు వెల్లడైంది. ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. విచారణలో ఇండస్ట్రీని కుదిపేస్తో్న్న రాజ్ తరుణ్-లావణ్య వ్యవహారంలో తెరపైకి ఈ మస్తాన్ సాయి పేరు వచ్చింది.
సాయి ఫోన్లో అనేక మంది యువతుల ప్రయివేట్ వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. వారితో చనువుగా ఉండి వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలిపారు. కాగా, లావణ్యకు మస్తాన్ సాయి అనే వ్యక్తితో పరిచయం ఉందని రాజ్ తరుణ్ ఆరోపించిన విషయం తెలిసిందే. లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారంలో తెర పైకి మస్తాన్ సాయి. ఆయనతో కూడా ఇలాగే గొడవ పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసిందని అన్నారు. రాజ్ తరుణ్ లావణ్యల వ్యవహారం కోర్టులో నడుస్తున్న తరుణంలో మస్తాన్ సాయి లావణ్యకు సంబంధించినటువంటి ఒక ఆడియో లీక్ బయటకు రావడం, ఇప్పుడు అతని ఫోన్లో అమ్మాయిల వీడియోలు ఉండటం మరో సంచలనంగా మారింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను ఆనంద డోలికల్లో ముంచాయి. వందలాదిమంది కళాకారులతో పాటు తమ గాన మాధుర్యంతో ప్రఖ్యాత సింగర్లు.. వేలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశారు. ముందుగా మెక్సికో…
- ఇరాన్తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.అమెరికా, ఇరాన్ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక గొప్ప ఒప్పందం కుదిరిందని సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే హర్మూజ్ జలసంధిని తిరిగి…
- ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.…
- చివరి వరకు పోరాడిన శ్రీలంక.. కానీ ఫలితం వెస్టిండీస్దే.ఈ మ్యాచ్ 20వ ఓవర్లో మాత్రమే ముగిసినా, అసలు విజయానికి పునాది శ్రీలంక ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలో మరియు అనంతరం బ్యాటింగ్ పవర్ప్లేలో పడింది. చివరి 5 ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చిన వెస్టిండీస్, తర్వాత తొలి 6…
- పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్లు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పులపాకుల తులసి, కామాక్షి దుర్గాప్రసాద్లను శివాలయం బ్రిడ్జి వద్ద…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 141012