అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి మూడు జిల్లాల సరిహద్దు ప్రాంతమైన తాడిపత్రి నడిబొడ్డున ఉన్న 100 పడకల ఆసుపత్రిని ఆర్భాటంగా అయితే ప్రారంభించి మిగతా నిర్మాణ పనులను మధ్యలోనే వదిలేసారు.వివరాల్లోకి వెళ్తే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వైఎస్ఆర్ సర్కిల్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి 100 పడకల ఆసుపత్రిని నిర్మాణ దశలో ఉండంగానే ఎన్నికల కోడ్ వస్తే తమకు రావాల్సిన పేరు ఎక్కడ వెళ్ళిపోతుందో అనే ఉద్దేశంతో కనీస వసతులు కల్పించకుండా ప్రజల్లో గొప్ప పేరు తెచ్చుకునేందుకు ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించారు.తీరా చూస్తే బిల్లులు రాలేదని కాంట్రాక్టర్ ఎక్కడికక్కడ పనులను వదిలేసి వెళ్లారు.కేవలం మొదటి అంతస్తులో .రోగులకు సౌకర్యంగా భవనము ఉంటుందని అనుకున్నారు. అయితే గత ప్రభుత్వ వైకాపా నాయకుల అసమర్ధతతో నిర్మాణములో ఉన్న ఆసుపత్రి నాసరికంగా చెప్పట్టిన గదుల నిర్మాణ పనులు ప్రస్తుతం రోగులకు శాపంగా మారింది.24 కోట్ల వ్యయంతో
ఆసుపత్రి భవనం నిర్మించేందుకు నిధులు మంజూరు అయినప్పటికి తాడిపత్రి ప్రజలకు ఎటువంటి వైద్య సేవలు అందలేదు.ఇందుకు వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రజల్లో పేరు తెచ్చుకునేందుకు నిర్మాణంలో ఉన్న భవనాన్ని ప్రారంభించారు.వంద పడకల ఆసుపత్రిలో కేవలంకొన్ని గదులే వాడుతు మిగతా గదులన్నీ నిర్మాణ దశలోనే ఉండడంతో రోగులకు అవస్థలు తప్పడం లేదు.రెండవ అంతస్తు,మూడవఅంతస్తు,నాలుగవంతస్తు,ఈ మూడు అంతస్తులు నిర్మాణ దశలోనే మిగిలిపోయాయి.అంతేగాక వర్షం వస్తే వర్షపు నీటితో ప్రభుత్వ ఆసుపత్రి ఒక కుంటను తలపించేలా మారింది..ఇలా అరకోర వసతులతో భవనాన్ని ప్రారంభించి ప్రజల ప్రాణాలతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెలగాటం ఆడరని ప్రజలు తెలిపారు.తాడిపత్రి ప్రజలకు మంచి జరగలన్నా అభివృద్ధి చేయాలన్నా ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరగతిన పూర్తి చేయాలన్న కేవలం జేసితో మాత్రమే సాధ్యమవుతుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- విజయవాడలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.ప్రజా ఆరోగ్యానికి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయవాడ హనుమాన్పేటలో ఉన్న ‘డ్రగ్స్ కంట్రోల్ భవన్’ను, ప్రారంభించిన మంత్రి..చంద్రబాబు దార్శనికతతో ఆరోగ్యాంధ్రప్రదేశ్ విజన్కు అనుగుణంగా ఆరోగ్యశాఖ పని చేస్తుందన్నారు. విజయవాడ హనుమాన్పేటలో డ్రగ్స్ కంట్రోల్…
- ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట.రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటించారు. నియోజకవర్గ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అత్యంత కీలకమైన ఈదరపల్లి…
- అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కూటమి రెండేళ్ల విజయోత్సవ వేడుకలు.అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. నక్కపల్లి మండలం దొడ్డిగల్లు జంక్షన్ నుంచి వేంపాడు టోల్ప్లాజా వరకు కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో…
- అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’పై ఆకస్మిక తనిఖీలు.భాగ్యనగరంలో కల్తీగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అపరిశుభ్రత వాతావరణంలో వంటలు చేస్తూ..ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. జుగుప్సాకరంగా కన్పించే దృశ్యాలు చూస్తే..కడుపులో పేగులు బయటపడాల్సిందే..కానీ అవేమీ చూడకుండా పాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఆరగిస్తే..అంతే సంగతులు..ఈ విషయమై అప్రమత్తమైన ఫుడ్…
- శరవేగంగా వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు.దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఆధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పనులను వేగవంతం చేశారు. ప్రభుత్వ విప్, వేములవాడ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 150575