మంచిర్యాల జిల్లాకు పిసిసి అధ్యక్షుడు సభలో పాల్గొననున్నారు…!బెల్లంపల్లికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రానున్నారు. ఇందుకు సంబంధించి పాత బస్టాండ్ ఏరియాలోని సింగరేణి తిలక్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ సభా ఏర్పాట్లు పూర్తి చేసారు నియోజకవర్గం నుండి జనాన్ని సభకు తరలించానున్నారు ట్రాఫిక్ ను నీవరించడానికి పోలీస్ లు అన్ని విధాలా చర్యలు చేపట్టారు
Congress party
నగాం నియోజకవర్గం కాంగ్రెస్స్ పార్టీ అభ్యర్థి గా నామినేషన్ వేయటం జరిగింది నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర కేంద్ర నాయకులకి ధన్యవాదాలు. ఎలాంటి అక్రమాలకు భూ కబ్జాలు చేయకుండ నిజాయితిగా నియోజక వర్గ అభివృద్ధి కోసం పనిచేస్తా జనగామ నియోజక వర్గ ప్రజలు నాకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా పది సంవత్సారాల పరిపాలనలో చేసింది ఎం లేదు కెసీఆర్ ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చారు ముత్తి రెడ్డి యాదగిరి చెప్పిండు కెసిఅర్ అడిగినంత అమౌంటు నేను ఇవ్వలేకపోయా నాకన్నా ఎక్కువ అమౌంటు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇచిండు కనకే టికెట్ ఇవ్వడం జరిగింది అన్నారు గతంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పరిపాలనలో మొత్తం భూకబ్జాలు అక్రమాలు, అవినీతులు ఇప్పుడు కూడా పళ్ల అంతకంటే ఎక్కువ కబ్జాలు అక్రమాలు చేసి ముత్తిరెడ్డి కన్నా ఎక్కువ అమౌంట్ కేసిఆర్ కు ఇవ్వాలి అనే ఒప్పందంతోనే పల్లాకి టికెట్ ఇచ్చారు కెసిఅర్ పాలనలో అన్ని రకాల అరాచకాలు పరిపాలన అస్తవ్యస్థంగా దుర్మార్గుడి పరిపాలనలో తెలంగాణ ఉన్నదీ ఇదే నెలలో దీపావళి ఉన్నదీ కానీ నిజమైన దీపావళి వచ్చే నెల వస్తుంది కెసిఅర్ అనే నరకాసురుడు దుర్మార్గుడు పోయి కాంగ్రెస్స్ ఇందిరమ్మ పాలన వస్తుంది ప్రజలు అందరు సుఖ సంతోషాలతో ఉంటారు నిజమైన దీపావళి మూడు తారీకు సాయంత్రం చేసుకుందాం అన్నారు.
Read Also..
Read Also..
వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవ శ్రీ తూడి ఉన్న మేఘారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తో బుధవారం మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తన సతీమణి శారదతో కలిసి వారి ఇంటి దైవం సింగోటం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించుకుని దంపతులిద్దరూ పూజలు చేశారు. అక్కడి నుంచి సొంత గ్రామం మంగంపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో గ్రామస్తులతో కలిసి దంపతులిద్దరూ ప్రత్యేక పూజలు చేశారు. స్వర్గస్తులైన వారి తల్లిదండ్రులు వెంకటమ్మ సాయిరెడ్డిల చిత్రపటాల వద్ద నమస్కరించి వనపర్తికి బయలుదేరారు. వనపర్తి రామాలయంలోను ప్రత్యేక పూజలు చేసిన ఆయన అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ చేరుకున్నా ఆయన నామినేషన్ దాఖలు చేశారు.
దశాబ్ద కాలంగా అనేక హామీలు ఇచ్చి నిరుపేదల సంక్షేమాన్ని మరచి ఏ యొక్క పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా మోసపూరితంగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికలలో పారదోలాలని కేకే మహేందర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు తంగనపల్లి మండలంలోని గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగం రాణి గారికి మరియు తంగాళ్ళపల్లి పట్టణం మాజీ రెడ్డి సంఘం అధ్యక్షులు గంగ రాజీ రెడ్డి గారి ఆధ్వర్యంలో 30 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెరల్లా గ్రామ బీఎస్పీ అధ్యక్షులు ఆనంద్ గారు మరియు గ్రామ యువకులు 30 మంది చేరారు, వీరికి కేకే మహేందర్ రెడ్డి గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే KTR గారు ఏ ఒక్క పని గ్రామాలలో పూర్తి చేయలేదని అన్నారు. రైతులకు గతంలో లభించే ఏ ఒక్క సబ్సిడీ బీఆర్ఎస్ ప్రభుత్వం అందజేయడం లేదని రైతుబంధు పేరుతో పేద రైతులకు అన్యాయం చేసి పెద్ద రైతులకు ప్రభుత్వ ధనాన్ని దోచిపెడుతున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తనను అసెంబ్లీకి పంపాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు జనగం ప్రవీణ్ భూపతి సుద్దాల శ్రీనివాస్ లక్ష్మీరాజం శ్రీకాంత్ మునిగ రాజు భారత్ పరశురాములు. హారిక, సరిత, భాగ్య, శంకర్, లక్ష్మణ్ యూత్ కాంగ్రెస్ సభ్యులు పాల్గొనడం జరిగింది.
అనంతరం గజ్వేల్ నుండి హెలికాప్టర్ లో కామారెడ్డి చేరుకొని నామినేషన్ వేస్తారు. అనంతరం అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారం ముగింపు సభ సీఎం గారితో గజ్వేల్ లో ఈనెల 28 తారీకు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. 2014, 2018 లో కూడా ముగింపు సభ గజ్వేల్ లో చేసుకున్నాం రాష్ట్రంలో అద్భుతమైన విజయం సాధించాం. అప్పుడు అదే ఆనవాయితీ కొనసాగించబోతున్నాము. కెసిఆర్ కు ఓటు వేసి రుణ తీర్చుకునేందుకు గజ్వేల్ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇచ్చిన హామీలే కాదు ప్రజలు కోరని పనులను కూడా గజ్వేల్ లో సీఎం పూర్తి చేశారు. కరువు పీడిత ప్రాంతమైన గజ్వేల్ నేడు కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలమయ్యింది. గతుకుల గజ్వేల్ ను బతుకుల గజ్వేల్ గా మార్చింది కేసీఆర్. విద్యాలయాలకు, రిజర్వాయర్లకు నిలయంగా మారింది గజ్వేల్. దేశ విదేశ ప్రతినిధులు గజ్వేల్ కు వచ్చి ఇక్కడ అభివృద్ధిని మెచ్చుకుంటున్నారు. కోకాకోలా, ఫుడ్ ప్రాసెసింగ్ హబ్స్ రావడం వల్ల ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. గజ్వేల్ చరిత్రలో రానటువంటి రికార్డు మెజారిటీ ఈసారి కేసీఆర్ గారికి రాబోతున్నది. లక్షలకు పైగా మెజారిటీతో గజ్వేల్ లో గెలిచి తీరుతాం. కొందరు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పెద్దవాళ్ల మీద పోటీ చేస్తే పెద్దవాళ్ళం అవుతామని అనుకుంటున్నారు. కేసీఆర్ కు సరితూగే నాయకుడు ఈ రాష్ట్రంలో మరెవరూ లేరు. జీవితాన్ని ఫణంగా పెట్టీ తెలంగాణ సాధించారు. ఇంకెవరు పోటీ వచ్చినా అది నామ మాత్రమే కెసిఆర్ మా ముఖ్యమంత్రి అని గజ్వేల్ ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు. వేరే వాళ్ళు ఉంటే ఆ గౌరవం గజ్వేల్ కు ఉంటుందా. పక్క జిల్లాలు, నియోజకవర్గాల నుంచి కిరాయి మనుషులను తెచ్చుకొని షో చేయాల్సిన అవసరం మాకు లేదు. ఎక్కడినుండి నిన్న జనం వచ్చారో ప్రజలందరికీ తెలుసు. మా పార్టీ కుటుంబ సభ్యులే 25 వేల మంది దాకా ఉంటారు. నీళ్లు పట్టుకునే మంచినీళ్ల బిందెలో, పండిన ప్రతి గింజలో కెసిఆర్ కనిపిస్తున్నాడని ప్రజలు చెబుతున్నారు. తెలంగాణ ద్రోహులంతా రాష్ట్రంలో ఏకమవుతున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీకి, పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీకి మద్దతు పలుకుతున్నారు. ఆనాడు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన శక్తులు నేడు కాంగ్రెస్, బిజెపి రూపంలో తెలంగాణపై దాడి చేసేందుకు కుట్ర చేస్తున్నాయి. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళ చేతుల్లో పెడితే ఆగం అవుతాం. దయ్యాల పాలు చేసినట్లు అవుతుంది. రిస్క్ లేకుండా నీళ్ళు, సాగు నీళ్ళు, రైతు బంధు, రైతు బీమా, పింఛన్లు వస్తున్నాయి. మరి రిస్క్ తీసుకొని వేరే ప్రభుత్వానికి ఓటు వేయడం ఎందుకు పండిన పంట ఏ తంటా లేకుండా ఊరూరా కాంట పెట్టీ కొనుగోలు చేసస్తున్నారు. కర్ణాటక సీఎం ధన్యవాదాలు చెప్పాలి. కర్ణాటకలో 5 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నట్లు ఒప్పుకున్నారు. రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ చాలు అని చెప్పి ఇప్పుడు మాట మార్చాడు. నేను అనలేదు అని బుకాయిస్తున్నడు. అన్న మాట, వీడియో అందరూ చూశారు. కుల్లం కుల్లం అన్నవు. గూగుల్ చేసి చూడు రేవంత్ రెడ్డి. 5 గంటలు కావాలి అనేవాళ్ళు కాంగ్రెస్ కు, 24 గంటల కరెంట్ కావాలనుకునేవాళ్లు బిఆర్ఎస్ కు ఓటు వేస్తరు. పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఉంటే మేలు ఎలా జరుగుతుందో, కెసిఆర్ చేతిలో తెలంగాణ ఉంటే అలా మేలు జరుగుతుంది. సురక్షితంగా ఉంటుంది.
నామినేషన్ దాఖలు చేసిన బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ కేంద్రంలో బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ బుధవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి హనుమ నాయక్ కు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం మీడియాతో పుట్ట మధుకర్ మాట్లాడుతూ.. ఒక బిసీ బిడ్డగా ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు మూడో సారి అవకాశం ఇచ్చారని, నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న బిసిలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అగ్రవర్ణాలలో ఉన్నవారికి అనేక అవకాశాలు ఉన్నా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా అనిచి వేశారని అందుకే ఈ సారి నేను పోటీలో ఉండవలసిన అవసరం ఏర్పడిందని అన్నారు. ఎవరికి సాయం చేయని కాంగ్రెస్ పార్టీ, రాజకీయంగా ఎదిగిన వారిని రాజకీయ సమాధి చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళు అన్ని విషయాల మీద పరిజ్ఞానం ఉన్నవాళ్లు ఎమ్మెల్యే అయితే, ఇప్పటికే నాలుగు సంవత్సారాలు ఏవిధమైన అభివృద్ధి జరిగిందో ప్రజలు చూసారని గుర్తు చేశారు. ఈ సారి బి ఆర్ ఎస్ పార్టీ తరుఫున నామినేషన్ వేసిన తనను ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని కోరారు.
టికెట్లు అమ్ముకునే సంస్కృతి ఉన్న కాంగ్రెస్పార్టీ రేపు రాష్ట్రాన్ని అమ్ముకోదన్న గ్యారంటీ ఏంటని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. ఆందోల్ మండల పరిధిలోని సంగుపేట వద్ద జరిగిన బూత్ కమిటీల సమావేశానికి హాజరై ఎమ్మెల్యే క్రాంతి కిరణ్తో కలిసి మాట్లాడారు. కాంగ్రెసోళ్లకు ప్రజలు పదకొండు సార్లు అవకాశమిస్తే ఏం డెవలప్ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సంగారెడ్డిని జిల్లా చేయలేదు, తలాపున ఉన్న సింగూర్ నుంచి వ్యవసాయానికి నీళ్లు ఇవ్వలేని అసమర్థులన్నారు. ఆందోల్ కాంగ్రెస్ పెద్ద లీడర్ వాళ్లకు, వీళ్లకు టికెట్ ఇప్పిస్తానని మాటిచ్చి ఇప్పుడు భంగపడ్డారని విమర్శించారు. తెలంగాణ సాధించి అభివృద్ధి వైపు నడిపిస్తున్న కేసీఆర్ను వదులుకుంటే తెలంగాణ ప్రజలు ఆగమవుతారన్నారు. కేసీఆర్ను గెలిపించుకుటేనే భవిష్యత్ ఉంటుందన్నారు. తల్లి లాంటి బీఆర్ఎస్ను ప్రజల నుంచి దూరం చేయడానికి కాంగ్రెస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయన్నారు. కార్యకర్తలు ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
జనగామ జిల్లా నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొమ్మూరు ప్రతాపరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ BRS పార్టీ తెలంగాణ మోసం చేసిందని కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు దండుకున్నారని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ 2018 ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను ఒకటి కూడా నెరవేర్చలేదని అన్ని మోసపూరిత హామీలు ఇస్తుందని మరోసారి తెలంగాణ ప్రజలు మోసపోవద్దని ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్గీ అభ్యర్థి మధు యాస్కీ గౌడ్, ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశారు. పాండవులు ఐనా కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులంతా MLA సుదీర్ రెడ్డి , అతని అనుచరులను ఓడించేందుకు ఐక్యంగా కదులుతున్నారని అన్నారు. మా ఐక్యత చూసి సుదీర్ రెడ్డి కి లాగులు తడుస్తున్నాయని అన్నారు. చైతన్యపురి లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మల్ రెడ్డి రాంరెడ్డితో కలసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మధు యాస్కీ మాట్లాడుతు..సుదీర్ రెడ్డి కి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, గుండాలను వెంబడి పెట్టుకొని కాంగ్రెస్ నాయకులను, కాలనీ అధ్యక్షులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. సుదీర్ రెడ్డి కబ్జాలకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రాంరెడ్డి ఎంతో పోరాటం చేశారని అన్నారు. ప్రాణాలు అడ్డుపెట్టయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తనను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన ఎల్బినగర్ ప్రజలను కోరారు.
రాజకీయ నాయకులు ప్రజలకు చేసేది చెప్పాలి కానీ వ్యక్తిగత దూషణలు చేయొద్దని , రాజకీయాలు నూతన తరానికి ఆదర్శంగా ఉండాలని
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశంలో అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విజన్ ఉన్న నాయకుడని , తెలంగాణను కేసీఆర్ తప్ప ఎవరికి పాలించే అర్హత లేదన్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 కి 12 మంది BRS ఎమ్మెల్యే లు గెలవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థులు 12 మంది ఉన్నారని మూడవ సారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవడం ఖాయంమని ,ప్రజలు దీవించడానికి సిద్ధంగా వున్నారన్నారు.





Total views : 61989