Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Andhra Pradesh వైసీపీ నాయకుడి ఇంటికి నిప్పంటించిన దుండగులు…

వైసీపీ నాయకుడి ఇంటికి నిప్పంటించిన దుండగులు…

by Prakash
వైసీపీ, Thugs set fire to YCP leader's house

ఆంధ్ర ప్రదేశ్ :

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చెట్నహల్లిలో స్థానిక వైసీపీ నాయకుడు పర్శప్ప ఇంటిని అర్ధరాత్రి డీజిల్, పెట్రోల్ పోసి గుర్తు తెలియని దుండగులు నిప్పు అంటించారు. కుటుంబ సభ్యులు అందరూ ఇంటిలో నిద్రిస్తూండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తృటిలో తప్పిన పెను ప్రమాదం నుండి బయట పడి ప్రాణాలు కాపాడుకున్నారు. బియ్యం, బట్టలు దగ్ధమైనాయి. సుమారు ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ నెల 21 న కూతురు వివాహం కోసం బట్టలు, బియ్యం తెచ్చుకున్నారు. గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక వైసీపీ నాయకుడు కావడంతో కుటుంబం మొత్తంను హత మార్చడం కోసం పన్నాగం పన్నారా, మరి ఎమైన కారణాలు వల్ల జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. Read Also

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow us on : Facebook, Instagram & YouTube.

Advertisements

You may also like

Our Visitor

040901
Total views : 212328

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: