Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home TelanganaKhammam ఎన్నికలు ఉన్నా లేకపోయినా ప్రజాసేవే లక్ష్యం..

ఎన్నికలు ఉన్నా లేకపోయినా ప్రజాసేవే లక్ష్యం..

by Rama
sandra venkata verayyah

ఎన్నికలు ఉన్నా లేకపోయినా ప్రజాసేవే లక్ష్యంగా పని చేశానని, ప్రజల కోసం పని చేసే వ్యక్తికి ఓటు వేయాలని బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య కోరుకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రామానగరం గ్రామంలో ప్రచార రథంపై ఎన్నికల ప్రచారాన్ని సండ్ర వెంకట వీరయ్య ప్రారంభించారు. ముందుగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల కోసం చాలామంది నాయకులు వస్తూపోతూ ఉంటారని అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రాజకీయ అవసరం కోసం కాకుండా మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారని దళితులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి దళిత బంధు పదాన్ని ఉచ్చరించే అర్హత లేదన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, దళితులను ఏమాత్రం పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విస్మరించాలని పిలుపునిచ్చారు..

Advertisements

You may also like

Our Visitor

026651
Total views : 150822

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.