360
కూకట్ పల్లి నియోజకవర్గం లో మరోసారి బిఆర్ఎస్ పార్టీ గెలుపు తద్యమని అన్నారు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కేపి.హెచ్.బి డివిజన్ లోని వసంత నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ ప్రచార కార్యాలయాన్ని స్థానిక కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు తో కలిసి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తమకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. గత పాలకుల సమయంలో కూకట్ పల్లి నియోజకవర్గంలో ఎన్ని కష్టాలు పడ్డాము ప్రతి ఒక్కరికి తెలుసని మరల అలాంటి సమస్యలు పునరావృతం కాకుండా కారు గుర్తుపైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.




Total views : 151408