Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh నేడు షెడ్యూల్ విడుదల చేసిన తలశిల రఘురాం..

నేడు షెడ్యూల్ విడుదల చేసిన తలశిల రఘురాం..

by Satya
Talashila Raghuram schedule released

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు(YSRCP President), ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jaganmohan Reddy) చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర(Bus Yatra) ఇవాళ్టి షెడ్యూల్(Schedule) ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్‌ విశాఖలోని ఎండాడ ఎంవీవీ సిటీ నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకుని చెన్నాస్‌ కన్వెన్షన్‌ హాల్‌ వద్ద సోషల్‌ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.

ఇది చదవండి: ఎంతమందితో పొత్తులు పెట్టుకున్న గెలిచేది జగనే..!

అక్కడ నుంచి తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు. జొన్నాడ దాటిన తర్వాత సీఎం జగన్‌ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం బొద్దవలస మీదుగా సాయంత్రం మూడున్నర గంటలకు గంటలకు చెల్లూరు వద్దకు చేరుకొని బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. ఆ తర్వాత చింతలవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలసలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి ముఖ్యమంత్రి జగన్‌ చేరుకుంటారని రఘురాం తెలిపారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


  • త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ.
    ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే సరికొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ’ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. జనాభా నియంత్రణ, సంతానోత్పత్తి తగ్గుదలపై కీలక వ్యాఖ్యలు చేశారు.…
  • పులివెందులలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు.. భారీ బైక్ ర్యాలీ.
    కడప జిల్లా పులివెందులలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు గత వైసీపీ ప్రభుత్వంలో భూకబ్జాలు, నిధుల మళ్లింపు, అవినీతి జరిగాయని ఆరోపించారు.…
  • అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన.
    అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పేదలు, బీడీ కార్మికులకు 32 సంవత్సరాల క్రితం మంజూరైన ఇళ్ల స్థలాలను తమ కుటుంబం నిరంతరం కాపాడుతూ వస్తోందని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో ఈ స్థలాలు రద్దయ్యే…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Our Visitor

023032
Total views : 140762

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.