Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Telangana బీఆర్ఎస్ , కాంగ్రెస్ లపై రెచ్చిపోయిన కిషన్ రెడ్డి

బీఆర్ఎస్ , కాంగ్రెస్ లపై రెచ్చిపోయిన కిషన్ రెడ్డి

by Satya
Kishan Reddy

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 17 సీట్లు గెలవడానికే పోటీ చేస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేగానీ ఏదో పోటీ చేయాలని ఎన్నికల బరిలో నిలబడటం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎజెండా లేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కూడా బీజేపీకి అత్యధికంగా ఎంపీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో వ్యతిరేకత ప్రారంభమైందన్నారు. సోనియాకు ఎలా సేవ చేయాలి సోనియాగాంధీ కుటుంబానికి సూట్ కేసులు ఎలా పంపాలనే ఆలోచన తప్ప కాంగ్రెస్‌కు మరొకటి లేదన్నారు. రైతు రుణమాఫీ ఎలా చేస్తారో, రైతుబంధు, నిరుద్యోగ భృతి ఏ విధంగా చేస్తారో సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామని ఎవరితోనో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లాలో విజయ్ సంకల్ప యాత్ర కొనసాగుతోందని కిషన్ రెడ్డి తెలిపారు.

Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన …
వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి..
వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు భారీగా తరలివచ్చారు. ప్రజల సమస్యలను త్వరితగతిన …
హైదరాబాద్‍లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎకో సెన్సిటివ్ జోన్ …
మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి ముందు ధర్నా .
తెలంగాణలో ఆశా వర్కర్లు మరోసారి రోడ్డెక్కారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్‌కర్నూల్ …

Advertisements

You may also like

Our Visitor

014641
Total views : 80666

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.