మందమర్రి మండలం, మరియు పట్టణంలో శుక్రవారం రోజు 1నుండి 24 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామన్ కాలనీ ఏరియాలోని 20 వార్డులో అంగడి బజార్ ఏరియాలోని శివాలయంలో నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు..ఈ సందర్భంగా సీనియర్ నాయకులు నోముల ఉపేందర్ గౌడ్, కడారి వీరస్వామి, నాయకత్వంలో ఇంటింటికి వెళ్తూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి, మహిళకు ప్రతినెల 2500 రూపాయలు,500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ,ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, రైతు భరోసా, గృహ జ్యోతి ,ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం, చేయూత పింఛన్లు ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. చెన్నూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ప్రచారాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బుర్ర రాజు గౌడ్, సోతుకు ఉదయ్, వెల్ది సాయి కృష్ణ, శ్రీనివాస్, నోముల పోచ గౌడ్, ఆకుదారి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, మహిళలు, ప్రచారంలో పాల్గొన్నారు
Politics
కృష్ణా జలాల పునఃపంపిణీ పై నోటిఫికేషన్లు రద్దు చేయాలి సిపిఐ డిమాండ్ తిరుపతి జిల్లా వరదయ్యపాలెం భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)ఆధ్వర్యంలో ఈనెల 20,21 వ తేదీ లో విజయవాడలో 30 గంటల నిరసన దీక్ష కార్యక్రమంలో భాగంగా వరదయ్యపాలెం మండల సిపిఐ కార్యదర్శి తరుణ్ కుమార్ ఆధ్వర్యంలో గోడ కరపత్రికలు విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తుకే పోరుచయ కదులుదాం రండి అంటూ నినాదిస్తూ కేంద్రంలో బిజెపి విభజన చట్టంలో పొందుపరచిన తిలోదకాలు హామీలను ఇచ్చి వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందన్నారు పెడరల్ స్ఫూర్తి కి విరుద్ధంగా ఆయా రాష్ట్రాలతో సంప్రదింపులు చేయకుండానే అడ్డు గోడలుగా నిర్ణయాలు చేయడానికి తక్షణ ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Also..
ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య విజయాన్ని కాంక్షిస్తూ రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఇళ్ళ కొరత లేకుండా చేస్తాం అని అలానే సత్తుపల్లి,అశ్వారావుపేట నియోజకవర్గాలను కలుపుతూ జిల్లా అయ్యేలా కృషి చేస్తాం అని సత్తుపల్లి లోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.మ్యానిఫెస్టోలో పెట్టిన కార్యక్రమాలు అమలు చేసే బాధ్యత తీసుకుంటాం అని కార్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో నాల్గోసారి సండ్రను గెలిపించాలి కోరుకున్నారు.
తూర్పు గోదావరి జిల్లా…
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పీ ఏ చంద్రశేఖర్ పై ట్రాఫిక్ కానిస్టేబుల్ కరుణ్ కుమార్ దాడి తలపై రక్తస్రావం జరిగేలా తీవ్రంగా దాడి చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ కరుణ్. తక్షణమే కానిస్టేబుల్ కరుణ్ సస్పెండ్ చేయాలని రాజమండ్రి రామాలయం సెంటర్ లో నడి రోడ్డు పై కూర్చుని నిరసన తెలుపుతున్న గోరంట్ల బుచ్చయ్యచౌదరి.
Read Also….
టీడీపీ, జనసేన ప్రవాహానికి వైసీపీ కొట్టుకుపోతుంది – టిడిపి ఇన్చార్జి రామాంజనేయులు.
ప్రత్తిపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్ మాకినేని పెద్ద రత్తయ్య ఆధ్వర్యంలో గుంటూరు పట్టణంలో పత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బూర్ల రామాంజనేయులు..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అలపాటి రాజా, కన్నా లక్ష్మీనారాయణ హాజరవ్వగా ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించిన వివిధ సంఘాల నాయకులు, టిడిపి పార్టీ సీనియర్ నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపాడు టిడిపి ఇన్చార్జి రామాంజనేయులు మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గం తనకి ఎప్పటినుంచో సుపరిచితమని ప్రతిపాడు లో అఖండ మెజార్టీతో టిడిపిని గెలిపించుకుంటానని ఈ సందర్భంగా ప్రతిపాడు టిడిపి ఇన్చార్జి రామాంజనేయులు తెలిపారు.. టిడిపి జనసేన ప్రవాహానికి వైసీపీ కొట్టుకుపోతుందని అన్నారు..
ఏలూరు జిల్లా..
నేడు ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన. నూజివీడులో బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్. నూజివీడు నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూ పంపిణీకి శ్రీకారం చుట్టనున్నా సీఎం జగన్. 2003కు ముందు అసైన్డ్ భూముల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నజగన్. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 10, 303 మంది లబ్ధిదారులకు 12,886, ఎకరాల్లో శాశ్వత భూ హక్కు కల్పించనున్న సీఎం జగన్.
జగన్ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేసిన జిల్లా అధికారులు..
మెదక్లో ప్రజాఆశీర్వాద సభలో బుల్లెట్ల కలకలం
మెదక్ జిల్లా నర్సాపూర్లో గురువారం నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో బుల్లెట్ల కలకలం రేగింది. సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో అస్లాం అనే వ్యక్తి ప్రెస్ గ్యాలరీలో కూర్చున్నాడు. అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేశారు. రెండు బుల్లెట్లు దొరకడంతో స్వాధీనం చేసుకున్నారు.
అస్లాం సంగారెడ్డి జిల్లా రాయికోడ్కు చెందిన వ్యక్తి. ప్రస్తుతం చిలప్చెడ్ మండలం చండ్రులో ఉంటున్నాడు. అతను ఓ చికెన్ సెంటర్లో పనిచేస్తున్నాడు. డిగ్రీ క్లాస్మేట్ సహాయంతో ఓ యూట్యూబ్ చానల్ ఐడీ కార్డు సంపాదించినట్టు తేలింది.
అస్లాం గతంలో ఎన్సీసీలో పనిచేసినట్టు సమాచారం. అక్కడ పనిచేసినప్పడే తీసుకొచ్చిన బుల్లెట్లు అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా అస్లాం కర్ణాటకకు చెందిన వ్యక్తిగా కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.
ఘటనపై పోలీసుల స్పందన
ప్రజాఆశీర్వాద సభలో బుల్లెట్లు దొరకడంపై పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితుడిని గుర్తించి, అతడి వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. అతడి నుండి బుల్లెట్లను ఎక్కడ నుండి తెచ్చుకున్నాడో, ఎందుకు తెచ్చుకున్నాడో తెలుసుకుంటామని పేర్కొన్నారు.
ఘటనపై రాజకీయ పార్టీల స్పందన
ఈ ఘటనపై రాజకీయ పార్టీలు విమర్శలు చేశాయి. రాష్ట్రంలో భద్రత ఏమిటని ప్రశ్నించాయి. ఈ ఘటన రాష్ట్రంలోని భద్రతా పరిస్థితిపై తీవ్ర సవాలుగా మారింది అని అభిప్రాయపడ్డాయి.
ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏమిటి?
Read Also..
గువ్వల నీ చిల్లర రాజకీయాలు ఆపు…రాళ్లదాడి పై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ ఫైర్….
టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజు ఓటమి భయంతోనే తన అనుచరులతో రాళ్ల దాడులు చేయిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వంశీకృష్ణ అన్నారు..గురువారం రాత్రి నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండల పరిధిలోని కొత్త రాంనగర్ తండాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో గ్రామ సర్పంచ్ తమ్ముడు కృష్ణ నాయక్ రాయితో నాపై దాడి చేయగా అది తప్పిపోయి ప్రచార వాహనంపై పడిందని అన్నారు..ఎవరు ఎన్ని కుట్రలు చేసిన అచ్చంపేటలో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని దీన్ని ఎవరు ఆపలేరని ఆయన అన్నారు..అచ్చంపేట నియోజకవర్గం ప్రజలు నా కుటుంబ సభ్యులని నా కుటుంబ సభ్యులకు ఎక్కడ ఎలాంటి ఆపాద, అన్యాయాలు జరిగినా నేను ముందుండి ప్రశ్నిస్తానని ఆయన భరోసా ఇచ్చారు..గువ్వల బాలరాజు నీవు ఎన్ని డ్రామాలు చేసిన నీ డ్రామాలను అచ్చంపేట నియోజకవర్గం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు..ఈ ప్రాంతంలో పుట్టిన ఈ ప్రాంతంలో పెరిగిన ఈ ప్రాంతంలోనే చనిపోతా నా ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా నేను ప్రశ్నిస్తూనే ఉంటానని ఆయన అన్నారు..ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తూ రాజకీయాలను అపవిత్రం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు..దాడి చేసిన వ్యక్తిని పక్కనే ఉన్న పోలీసులు సైతం పట్టుకొని స్టేషన్ కు తీసుకెళ్లారన్నారు..ఎవరు దాడులు చేస్తున్నారు అన్ని గమనిస్తున్నారని నీకు ఈ నెల 30న జరిగే ఎన్నికలలో ప్రజలు తగిన బుద్ధి చెప్పి నీ సొంత ప్రాంతం వనపర్తి జిల్లాకు సాగనంపడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు..
చేవెళ్ళ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం హోరుగా కొనసాగుతుందని చెప్పవచ్చు ఈ రోజు షాబాద్ మండలంలోని సోలిపేట, మద్దూరు, హైతబాద్, నాగర్ గూడ, తిర్మాలపుర్, దోస్వాడ మరియు తాళ్లపల్లి గ్రామాలలో బీజేపి అభ్యర్ధి రత్నం ప్రచారానికి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రత్నం మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గం లో ఎమ్మెల్యే ఒక దొంగని అన్ని పదవులను తన కుటుంబం వారే అనుభవిస్తున్నారని ఆ కుటుంబ పాలన అంతమెందించడమే బిజెపి లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు అలాగే కాంగ్రెస్ అభ్యర్థి అయిన భీం భారత్ నేర చరిత్ర కలిగిన వ్యక్తి అని క్రిమినల్ కేసులు గల వ్యక్తి అని వారికి మీరు ఓటు వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలన్నీ మేమే అందిస్తున్నామని చెప్పుకుంటూ మోసపూరితమైన మాటలు చెప్తున్నారని వాటిని ప్రజలు ఎవరు నమ్మవద్దని బిజెపికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. షాబాద్ ను డెవలప్ చేశామని అంటున్న టిఆర్ఎస్ ప్రభుత్వం చందనవెల్లి రైతులకు ఇప్పటివరకు నష్టపరిహారం ఎందుకు ఇయ్యలేదని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు ముందు చందన వెళ్లి రైతులకు పూర్తి నష్టపరిహారం చెల్లించవలసింది ఆయన కోరారు మళ్లీ టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఉన్న భూములు కూడా గుంజుకుంతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Read Also..
భారీగా కార్యకర్తలను సమీకరించిన బిఅర్ఎస్ పార్టీ. అల్లపుర్ ,మూసాపెట్ , KPHB,బాలానగర్ మీదుగా రోడ్ షో.. రొడ్ షోలో పాల్గొన్న స్తానిక ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణ రావు, ఎమ్మెల్సీ నవీన్ రావు,స్థానిక కార్పొరేటర్లు Kphb లో కాంగ్రెస్ పార్టీ సీనయర్ నేత గొట్టుముక్కల పద్మారావు కెటిఆర్ అధ్వర్యంలో చేరిక మాధవరం కృష్ణ రావు కాబోయే ఎమ్మెల్యే..9 ఏళ్లలో మేము పని చేసింది ఆరున్నర సంత్సరలు మాత్రమే, కరొన తో కొంత కాలం పోయింది. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది .. ఏక్కడి ప్రాంతం వారైనా మాకు సమానమే కులం ,ప్రాంతం పేరుతో కేసీఅర్ ఎనాడు చూడలేదు ,పెట్టుబడి దారులకు స్వాగతం పలుకుతూ రాష్ట్ర అభవృద్ధి చేశాం. చెన్నై నుండి వచ్చిన రజినీ కి హైదరాబాద్ అభవృద్ధి కనపడింది ,కానీ ఇక్కడ గజిని లకు అర్థం కావడం లేదు.. కేటిఆర్ హైదరబాద్ లో ఐటి రంగం బాగుంటే వివిధ రంగాలు అభివృద్ధి చెంది ఉపాధి దొరుకుతుంది..కెటిఆర్ పెదవాల్లకు సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి ఏర్పాటు చేశాం సౌభాగ్య లక్ష్మి ,కేసీఅర్ భీమ ,సన్న బియ్యం తో అన్నపూర్ణ పతకాలు కాంగ్రెస్ పార్టీ ఆయంలో ఉన్న తాగునీటి ,కరేంటు కష్టాలూ ఇప్పుడు లేవు. కెటిఆర్ హైదరబాద్ వాసులు పని చేసే ప్రభుత్వాన్ని గుర్తించాలి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తె తెలంగాణా పరిస్తితి కుక్కలు చింపిన విస్తరి లా ఉంటుంది..కెటిఆర్ మాధవరం కృష్ణ రావు ఒత్తిడితోనే కాపు ,కమ్మ ,క్షత్రియ సామాజిక వర్గాలకు భూమి కేటాయింపు..కెటిఆర్ కాంగ్రెస్ గతం బి అర్ ఎస్ భవిష్యత్తు






Total views : 152792