తెలంగాణ ఉద్యమం కెసీఆర్ ఇంటి వాళ్ళు ముగ్గురు చేస్తే రాలేదు తెలంగాణ నిరుద్యోగ యువత తెలంగాణ విద్యార్థులు ఆత్మబలి దానాలతో చలించిపోయిన సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించడం జరిగింది. తెలంగాణలో సుమారు పది లక్షల మంది గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందడం జరుగుతుంది. ఒక్కరికి పదివేల చొప్పున ఉన్నా గాని తెలంగాణకు నెలకు సుమారు 1000 కోట్లను గల్ఫ్ కెళ్ళి వీళ్ళు గల్ఫ్ కార్మికులు సంవత్సరానికి 12 వేళా కోట్లు విదేశీ మరగద్రవ్యాన్ని తెలంగాణకు సమకూరుస్తున్నారు. ఇందులో ఎంత లేకుండా సుమారు గవర్నమెంట్ కి 10% ఆదాయం అనుకున్న కానీ గత పది సంవత్సరాల నుండి గవర్నమెంట్ కు ఒక లక్ష ఇరవై వేల కోట్లను సమకూర్చడం జరుగుతుంది. కానీ గల్ఫ్ కార్మికులకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. నువ్వు గొప్పగా చెప్పిన కాలేశ్వరం ప్రాజెక్టు ఈరోజు ఏమైంది కాలేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిపోయింది హరీష్ రావు ఏమంటాడు ఒక బ్యారేజ్ పగులు తప్ప మిగతా ఇంకా రెండు లేవా ఒక మేడిగడ్డ కృంగిపోతేనే పెద్ద ఏదో జరిగినట్టు అంటున్నారు ప్రతిపక్షాలు మేడిగడ్డ లేకపోతే అన్నారం ఉండదు అన్నారం లేకపోతే. సుందిళ్ళ ఉండదు కేసీఆర్ అంటాడు పగులు వచ్చింది అని పగులు వచ్చిన కుండకు నీళ్లు ఆగుతాయ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మొదటగా గల్ఫ్ కార్మికులు గల్ఫ్ లో అసువులు బాసిన ప్రతి కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున కేటాయిస్తాం . ప్రభుత్వం ఏర్పడగానే స్థానికంగా ఉన్న షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడంతో పాటు యువతకు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము. జగిత్యాలలో నేను మంత్రిగా ఉన్నప్పుడు దిగవంత నేత రత్నాకర్ రావు నేను పోటీపడి అభివృద్ధి చేసినం. నేను జగిత్యాల్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ పెడితే దిగవంతనేత రత్నాకర్ రావు గారు కోరుట్లలో పశు వైద్య కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే కోరుట్ల పట్టణానికి ఏం చేశాడు చెప్పాలి.
Politics
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బౌద్దనగర్ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ కంది శైలజతో కలిసి పద్మారావు గౌడ్ విస్తృతంగా పర్యటించారు. జామే ఉస్మానియా, ఈశ్వరీబాయి నగర్, ఎల్ నారాయణ నగర్, అంబర్ నగర్, బౌద్ధనగర్, సంజయ్ గాంధీ నగర్ తదితర ప్రాంతాల్లో పద్మారావు గౌడ్ పర్యటనకు
ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. కార్యకర్తలతో పాటు స్థానిక ప్రజలు కూడా ఆయనను అడుగడుగునా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా
పద్మారావు గౌడ్ మాట్లాడుతూ గతంలో తాము చేపట్టిన వివిధ శాశ్వత చర్యల వల్ల ప్రజలు భారీ వర్షాల వల్ల ఇబ్బంది పడే పరిస్థితులు తప్పాయని, సికింద్రాబాద్ పరిధిలో పలు ప్రధాన నాలా ల వెడల్పు, కల్వర్టుల పునర్నిర్మాణం వంటి పనులను చేపట్టామని తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలో కరోనా నివారణ చర్యలను నిరంతరం తీసుకొని ప్రజలకు అండగా నిలిచామని తెలిపారు. నిరంతరం ప్రజల సమస్యలను తీర్చేందుకు సితాఫలమండీ లో తమ కార్యాలయం ఏర్పాటు చేసుకొని నిజాయితీగా ప్రజలకు సేవలను అందించే సిబ్బందిని ఈ కార్యాలయంలో నియమించుకున్నామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో నిలిచిన తమకే ప్రజలను ఓటు అడిగే హక్కు ఉందని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు.
intuc కాంపల్లి సమ్మయ్య- సింగరేణి నష్టాల బాటలో పయనించేలా చేసింది కెసిఆర్…
మంచిర్యాల జిల్లా మందమర్రి
సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయుటకు బిజెపితో చేతులు కలిపి టిఆర్ఎస్ నీ బిఆర్ఎస్ గా మార్చి తెలంగాణ ప్రజల యొక్క మనోభావాల మీద దెబ్బతీసిందని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ప్రచారం కోన సాగిస్తున్నామని బుధవారం మందమర్రి ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో intuc నాయకులు కాంపల్లి సమ్మయ్య పేర్కొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….. తెలంగాణ వస్తే మన పరిపాలన మనమే చేసుకుంటాం మన నిధులు ఉద్యోగాలు మనకే వస్తాయి అని చెప్పిన టిఆర్ఎస్ అలియాస్ బిఆర్ఎస్ గా మార్చి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని అన్నారు. సింగరేణిలో బొగ్గు గని కార్మిక సంఘం గెలిస్తే సింగరేణి కార్మికుల ఇళ్లను దివ్య కాంతులుగా వెలిగిస్తాం సింగరేణి కార్మికుల కుటుంబల పిల్లల భవిష్యత్తును మారుస్తానని చెప్పిన ప్రభుత్వం ఏ ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వలేదని సింగరేణి ఆదాయాన్ని రెండువేల కోట్లు వాడుకొని సింగరేణి నష్టాల బాటలో పయనించేలా కెసిఆర్ చేశారని మండిపడ్డారు అక్కడ కెసిఆర్ ఇక్కడున్నటువంటి బాల్క సుమన్ ని ఇంటికి పంపించేదాకా ఊరుకునేది లేదని ముక్తకంఠంతోని నినాదం చేస్తూ ప్రజలు ఏకమై వస్తున్నార ఎక్కడ కూడా దందాలు చేసి డబ్బులు సంపాదించలేదు ప్రజలకు కార్మికులకు ఎలాంటి ఇబ్బంది వచ్చిన వారు ముందుండి సమస్యను తీరుస్తారని సూచించారు.వీరిద్దరు స్థానికులే గత 50 సంవత్సరాల నుండి కాక వెంకటస్వామి చెన్నూర్ని అదేవిధంగా పెద్దపెల్లి పార్లమెంటు సభ్యునిగా ఉండి అభివృద్ధి పదంలో నడిపించారానారు. అదేవిధంగా వివేక్ ఎంపీగా ఉన్నప్పుడు జైపూర్ పవర్ ప్లాంట్ ను తీసుకొచిన్న ఘనత వారిది నాన్ లోకల్ వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే పదవిలో ఉండి ఇసుక బొగ్గు బు దండాలు పాల్పడుతున్నారని కోట్లు సంపాదించిన వ్యక్తి కి ప్రజలు బుద్ది చేపి తరిమివేయాలని ఎన్నికలలో కాంగ్రెస్ కు అభ్యర్థి వివేక్ భారీ మెజార్టీ తో గెలిపించలని ఐఎన్టీయూసీ యూనియన్ కోరారు .
జూబ్లీహిల్స్ నియోజకవర్గం వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అరాచకాలకు అడ్డుకట్ట వేయడానికే కాంగ్రెస్ పార్టీనిఎంచుకున్నట్లు తెలిపిన నవీన్ యాదవ్. జాయినింగ్ ప్రోగ్రాంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి నవీన్ యాదవ్ను పార్టీలోకి ఆహ్వానించిన టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మల్లికార్జున్ కార్గే.
రేవంత్ రెడ్డి పాయింట్స్:
జూబ్లీహిల్స్ వ్యాప్తంగా చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబానికిఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించే వారు ఎవరి పాలనలో ప్రజా జీవితంచక్కగా ఉందో ఆలోచించుకోవాలి. జంట నగరాల వ్యాప్తంగా పేదల పక్షాన ప్రశ్నించే గొంతుక పీజేఆర్ మరణంతో మూగబోయింది. ఇప్పుడు యువ రక్తం నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరికతో జంట నగరాలకు నాయకత్వం లభించినట్లునేను అనుకుంటున్నాను. ఈరోజు తన నామినేషన్ ని వదిలివేసి కేవలం నియోజకవర్గం ప్రజా శ్రేయస్సు కోరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజారుద్దీన్ బలపరచడానికి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నవీన్ యాదవ్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వ్యాప్తంగా ఎంతో అనుభవకుడైన చిన్న శ్రీశైలం యాదవ్ అనుభవ పాఠాలను అజారుద్దీన్, నవీన్ యాదవ్ పాటిస్తూ ఎన్నికలలో జూబ్లీహిల్స్ గడ్డమీద కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయం.
ట్రాన్స్ జెండర్స్ ను అవమానపరిచే విధంగా వాక్యాలు చేయడం సరైనది కాదని.. కెసిఆర్, కేటీఆర్ సూచనల మేరకే ట్రాన్స్ జెండర్స్ ను అవమానపరిచావా..? వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిలిచిన మిగతా అభ్యర్థులు మగవారు కాదా అని సూటి ప్రశ్న.. బీఎస్పీ తరఫున ఒక ట్రాన్స్ జెండర్ బరిలో నిలిచి ఉంటే బిఆర్ఎస్ పార్టీ నాయకులు తట్టుకోలేక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని.. తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే శ్రీహరి ఇల్లు ముట్టడిస్తాం.. మా ట్రాన్స్ జెండర్స్ అందరం ఐక్యమై నీ అంత చూస్తామని సవాల్ చేశారు.
రాష్ట్రమంతా పింక్ వేవ్ కనిపిస్తోందని, మూడో సారి సీఎం కేసీఆర్ అధికారంలోకి పచ్చి దక్షిణాదిన తొలిసారి హాట్రిక్ సాధించి రికార్డు సృష్టిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు స్పష్టం చేశారు. ప్రజలు గర్వంగా కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ ను గెలిపించాలన్న ఆశతో ఉన్నారని చెప్పారు. “సీఎం కేసీఆర్ అంటే అభివృద్ధికి గుర్తు. కేసీఆర్ అంటే ప్రేమకు పరాకాష్ట. ” అని వ్యాఖ్యానించారు. గులాబీ జెండా ఎత్తి తెలంగాణ ఉద్యమానికి బయలుదేరినప్పుడు ఇదే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. అందరూ పిడికిలి ఎత్తి ఉద్యమం చేస్తున్నప్పుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బందూక్ పట్టుకొని ప్రజల మీదకి పచ్చిన విషయాన్ని మరిచిపోతారా అని అడిగారు. రైతుబంధును రైతులకు బిచ్చమేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని, పెన్షన్లు, బీమా వృధాగా ఇస్తున్నామని కూడా అంటున్నారని, అధికారంలో లేనప్పుడే ఇంత అహంకారంతో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ రేపు పొరపాటున అధికారంలోకి వస్తే కనీసం ప్రజలను పట్టించుకుంటారా అన్నది ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ అంటే ఆత్మీయత అని, కాంగ్రెస్ పార్టీ అంటే అహంకారం అని తెలిపారు. గ్రామల్లో తెలంగాణ అభివృద్ధిపై చర్చించాలని కోరారు. ఉమ్మడి పాలనలో ఒక్క ప్రభుత్వమైనా రైతుల గురించి ఆలోచించి ఒక్క పైసా అయినా ఇచ్చిందా అని అడిగారు. లక్షలాది పేద ఇంటి ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని, గతంలో ఎవరైనా ఈ ఆలోచన చేశారా అని అడిగారు. మరి ఏమీ చేయని ఎందుకూ పనికిరాని వాళ్లు, ఒక్క నీటి బొట్టును కూడా ఇవ్వనివాళ్లు ఇవాళ సీఎం కేసీఆర్ మీద తొడగొడుతాం, మెడ కోసుకుంటామని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తొడగొడితేనో, మెడ కోసుకుంటేనో సీఎం కేసీఆర్ మీద గెలవడం అయ్యే పనికాదని తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్ మీద గెలవాలంటే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల గుండెల్లో చోటు సంపాదిస్తేనే అది సాధ్యమవుతుంది తప్పా ఉట్టిగా అయ్యే పనికాదని స్పష్టం చేశారు. బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గతంలో సాగునీటి శాఖ మంత్రిగా పనిచేసినా కూడా ఒక్క చెరువును మరమ్మత్తు చేయలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ నిజాం సాగర్ కాలువల ఆధునీకరణకు కృషి చేశారని, ఎన్నో చెరువులను బాగు చేసుకున్నామని, చివరి ఆయకట్టుకు కూడా నీళ్లు పచ్చేలా పని చేసుకున్నామని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ సు భారీ మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్ కు బోధన్ ను బహుమానంగా ఇద్దామని పిలుపునిచ్చారు.
గుంటూరు జిల్లా పొన్నూరులో సామాజిక యాత్ర పేరుతో అధికార పార్టీ ప్రభుత్వ దుర్వినియోగానికి పాల్పడుతుందని, అధికారులను బెదిరించి మా కార్యక్రమాలకు తప్పక హాజరు కావాలని చెప్పి హుకుం జారీ చేసిందని టిడిపి సీనియర్ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేయాలంటే 100 పరిమిషన్లు తీసుకోవాలని విమర్శించారు. వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం మీద, ఇసుక మీద చాలా దోచుకుంటున్నారన్నారు. నందిగామలో ముగ్గురు చిన్నారులు చనిపోయారని దానికి వైసిపి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పొన్నూరు నియోజకవర్గం లో 8,000 పెన్షన్లు తీసేసారన్నారు. కొత్తగా ఇచ్చిన పెన్షన్లు ఏమీ లేవన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దోచుకుంటాడు ఇక్కడ మన ఎమ్మెల్యే దోచుకుంటాడని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి తిరుపతిని ఎలా కబ్జా చేశాడో, మన పొన్నూరు ఎమ్మెల్యే గుళ్లను అలా కబ్జా చేశాడన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో ఏ పోస్టింగ్ కి రావాలన్న కప్పం కట్టాల్సిందే అని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆదాయం నెలకు 20 లక్షలన్నారు. 5లక్షల నుంచి 6 లక్షలు రేషన్ మాఫియా నుండి వసూలు చేస్తున్నాడన్నారు. బస్సు యాత్రకు వచ్చే నాయకులకు, మంత్రులకు సిగ్గుండాలన్నారు. సీఎం ఆఫీస్ ఐడి కార్డులు పెట్టుకొని గ్రావెల్ అమ్ముకొని ఈ ప్రభుత్వం 500 కోట్లు దోపిడీ చేశారన్నారు. బస్సు యాత్రకు డ్వాక్రా, వాలంటీర్నీ తరలించాలని అధికారులను బెదిరిస్తున్నారని విమర్శించారు పొన్నూరు నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధి మీద సమాధానం చెప్పి వెళ్లాలని కోరుకుంటున్నాను అంటూ ధూళిపాళ్ల ముగించారు.
Read Also..
హయత్నగర్లో అర్థరాత్రి హై టెన్షన్ … మధుయాష్కీ గౌడ్ ఇంటి పై పోలీసుల దాడి
హైదరాబాద్లోని మధుయాష్కీ గౌడ్ నివాసంపై అర్థరాత్రి పోలీసులు దాడి చేశారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా, మూకుమ్మడిగా పోలీసుల బృందం ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడింది. సోదాల పేరుతో, కుటుంబ సభ్యులను పోలీసులు భయబ్రాంతులకు గురిచేశారు. మధుయాష్కీ నివాసంలో పెద్ద ఎత్తున డబ్బు ఉందన్న సమాచారంతో, పోలీసులు దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ సెర్చ్ వారెంట్ లేకుండా దాడి చేయడంతో, కాంగ్రెస్ శ్రేణులు ఆశ్చర్యపోతున్నాయి. హయత్ నగర్ లో ఉద్రిక్తత అర్థరాత్రి మధుయాష్కీ గౌడ్ నివాసం ఇంటిపై అనుమతి లేకుండా ఇంట్లోకి చొరబడి పోలీసుల మూకుమ్మడి దాడి జరగటం తో కుటుంబ సభ్యులు భయబ్రాంతులకు గురి అయ్యారు.
బొర్రా వెంకట అప్పారావు జనసేన సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కామెంట్స్…
బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన కలిసిన ఆవశ్యకత ఏమిటి సైకో ముఖ్యమంత్రిని ఏ కారణంగా దించాలి. జనసేన టిడిపి ఎందుకు అధికారంలోకి రావాలి. మన ఓటు ఏంటి వాటర్ లిస్టులో ఉన్న తప్పులను సరిదిద్దాలి.
మన ఓటు హక్కుని మన వినియోగించుకుంటూ, మనల్ని అన్యాయం చేయడానికి దొంగ ఓట్లు సృష్టిస్తూ నీ హామీలను నెరవేస్తే దొంగ ఓట్లు సృష్టించుకోవాల్సిన అవసరం లేదు.
దొంగ ఓట్లు లేకుండా నిజాయితీగా ఎలక్షన్ గా నిన్ను చిత్తుచిత్తుగా ఓడిస్తాము. తండ్రికి పక్షం ఇచ్చి కొడుకు ఉద్యోగం లేకుండా చేస్తున్నావ్. వృద్ధాంత ప్రదేశ్ అయిపోతుంది ఆంధ్రప్రదేశ్. పోరుగు రాష్ట్రాలకు వలసల పోతున్నారు మీ అసమర్థత వల్ల అన్నారు.
మా జనసేన కార్యకర్త వాసు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. రోడ్డుకు మట్టి పెట్టి ప్యాచ్ వర్క్ వేస్తున్నారు. ఈ వారం పది రోజుల్లో ఇద్దరు ముగ్గురు చనిపోయారు. ఈ ప్రభుత్వాన్ని వెనక్కి పంపించాలంటే జనసేన టిడిపి కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలి అని బొర్రా వెంకట అప్పారావు పేర్కొన్నారు





Total views : 152668