మట్టి దొంగలను అరెస్ట్ చేయాలి అని మైలవరం పోలీసుస్టేషన్ లో ఎస్.ఐ హరి ప్రసాద్ కి పిర్యాదు చేశారు. మండలంలోని పుల్లురు గ్రామంలో రూ.3 కోట్లు విలువైన నిలువ చేసిన మట్టిని తరలిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆయన అనుచరులు ఏ ఎం సి చైర్మన్ అప్పిడి సత్యనారాయణ రెడ్డిని అరెస్ట్ చేయాలి. పుల్లూరు గ్రామస్తులు మట్టి తోలకాలను అడ్డుకొని పోలీసులకు పట్టిస్తే కేసు నమోదు చేయకపోగా ఫిర్యాదు ఇస్తే విచారణ చేస్తామని పోలీసులు అనడం విడ్డూరంగా ఉందన్నారు. వైసిపి నాయకులకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చెరువు మట్టి ప్రజల అస్తి అలాంటి సంపదను వైసిపి నాయకులు దోచుకుంటున్నారు. వైసిపి నాయకులు మట్టి దోపిడీ రఘురాం రెడ్డి కి కనిపించటం లేదా అని ప్రశ్నించారు.
ఎంత వరకు చంద్రబాబు నాయుడు పై ఏ కేసులు పెడదాం అని చూస్తున్నారు అని విమర్శించారు. ఒక ఛాన్స్ పేరు తో ఎమ్మెల్యే అయ్యిన వసంత కృష్ణ ప్రసాద్ మట్టి దొంగలను, ఇసుక దొంగలను కాపాడుతున్నారని.., వైసీపీ పార్టీ కార్యాలయం లో ఉన్న అనుచరుల ద్వారా ఎమ్మెల్యే గంజాయి అమ్మిస్తున్నారని ఆరోపించారు. పేర్లు మార్చుకొని దుర్మార్గులు అంత మైలవరం ని చెర పట్టేందుకు గ్రామాల్లోకి వస్తున్నారని వీళ్ళందర్నీ తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Politics
గుంటూరు జిల్లాల్లో టిడిపి, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ మరి కొద్దిసేపట్లో తొలిసారి సమావేశం కానుంది. టిడిపి తరపున యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, పట్టాభి హాజరు అవుతున్నారు. జనసేన నుంచి వరప్రసాద్, శశి కుమార్, శరత్ బాబు హాజరు అవుతున్నారు.రాష్ట్రంలో సంక్షేమం ,అభివృద్ధి, ఎజెండా గా రూపకల్పన చేసే విధంగా ప్రణాళిక ని సిద్దం చేస్తున్నారు. టిడిపి తయారు చేసిన కొన్ని అంశాలకు భవన నిర్మాణ కార్మికులు, ఇసుక పాలసీ, విద్యుత్ చార్జీలు వసూలు లో ప్రజలు ఇబ్బందులు దృష్టి లో ఉంచుకొని మ్యానిఫెస్టోలో పొందుపరిచే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా రైతు ,యువత కార్మికులు సమస్యలను మ్యానిఫెస్టోలో రూపకల్పన చేయనున్నారు. దీంతో పాటు మరో రెండు పర్యాయాలు ఇలాంటి సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంటా అంజిబాబు మాట్లాడుతూ….రాహుల్ గాంధీ జోఢో యాత్ర తో ప్రజల్లో పూర్తి స్థాయిలో చైతన్య వంతులు అయ్యారు.,రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ దేశం అభివృద్ధి చెందుతున్నది అన్న నమ్మకం ప్రజలలో కలుగుతోంది రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వాన్ని సక్రమ మార్గంలో నడపకుండా అక్రమ కేసులు పెడుతున్నారు, రేపు తెలుగుదేశం పార్టీది ఇదే బాటలో., కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రజల పక్షాన బిజెపి ఎస్సీల వర్గీకరణ బూటకం., మళ్ళీ అధికారంలోకి రావాలని వారి మద్య చిచ్చు పెడుతున్నారు జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తాం
అమరావతి….
నేడు జనసేన,టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సమావేశం జరగనుంది, నేటి మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న సమావేశం లో టీడీపీ నుంచి ముగ్గురు,జనసేన నుంచి ముగ్గురు సభ్యులు పాల్గొననున్నారు. టీడీపీ నుంచి కమిటీలో సభ్యులుగా యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, పట్టాభి మరియు జనసేన నుంచి కమిటీలు సభ్యులుగా నాదెండ్ల మనోహర్ ముత్తా శశిధర్, శరత్ కుమార్ హాజరుకానున్నారు.
నేటి మధ్యాహ్నం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనున్నది. ఇప్పటికే ఆరు అంశాలను మినీ మేనిఫెస్టో గా విడుదల చేసిన టీడీపీ, మరో ఐదు లేక నాలుగు అంశాలను చేర్చాలని జనసేన వెల్లడి. ఇరువురి ప్రతిపాదనలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. పినపాక నియోజకవర్గం బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో సీఎం కేసీఆర్ తలపెట్టిన ప్రజా ఆశీర్వాద సభ సర్వం సిద్ధం చేసిన బిఆర్ఎస్ నాయకులు సుమారు 60000 మంది వస్తారని అంచనా.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తోంది. నేటి నుంచి రెండవ విడత ప్రచార కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. మొత్తం 54 ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొంటారు.
నేడు సీఎం కేసీఆర్ భద్రాచలం, పినపాక రెండు నియోజకవర్గాలకు కలిపి బూర్గంపాడు లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు.
ఏజెన్సీ ఏరియాలు కావడం వల్ల కేసీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండు ఒక్కటే నని బిజెపి అభ్యర్థి బండి సంజయ్ ని గెలిపించేందుకే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని..కరీంనగర్ బారసా అసెంబ్లీ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.. ఆదివారం హుస్సేన్ పుర నేషనల్ ప్యాలస్ లో ముస్లీం సోదరుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోమ్ మినిస్టర్ మెహమూద్ అలీ, ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ మంత్రి గంగుల కమలాకర్ హాజరైనారు..
ఈ సందర్బంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ సమైక్య పాలనలో ఎక్కడ చుసిన గొడవలు, శాంతి భద్రతల సమస్యలు 144 సెక్షన్ లులాఠీఛార్జి లు ఉండేవని అన్నారు.. రాజకీయ అవసరాల కోసం హిందూ ముస్లిం ల మధ్య గొడవలు పెట్టి లబ్ది పొందే వారని అన్నారు.. బయటకు వెళ్లిన పిల్లలు ఇంటికి వచ్చేవరకు తల్లిదండ్రులు భయం భయంగా గడిపే వారని…తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకహిందూ ముస్లింలు ఒకటై కలిసిమెలిసి జీవిస్తున్నారని అన్నారు.. కెసిఆర్ హయంలో కడుపునిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారని గుర్తు చేశారు.. శాంతిభద్రతలు అదుపులో ఉన్నప్పుడే పెద్దపెద్ద కంపెనీలో తరలివస్తాయని.. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు.. రానున్న ఎన్నికల్లో సెక్యులర్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు.. తెచ్చుకున్న తెలంగాణ కెసిఆర్ చేతుల్లోనే భద్రంగా ఉంటుందని వెల్లడించారు.. కానీ ప్రతిపక్షాలు వేస్తే కరెంటు నీళ్లు తెలంగాణ సంపదనను దోచుకుంటారని..కరీంనగర్ ప్రజలు ఒకసారి ఆలోచించాలని… అభివృద్ధిని చూసి మరోసారి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ని ఆశీర్వదించాలని అన్నారు..కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు..
జిల్లా వైసీపీ నాయకులు, వైఎన్ఆర్ చారిటీస్ చైర్మన్ యలమంచిలి జయప్రకాశ్ జన్మదిన వేడుకలు అయన నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు… వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్, స్థానిక కార్పొరేటర్ లు మరియు అభిమానులు వేడుకల్లో పాల్గొని జయ ప్రకాష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు.. ఈ సందర్బంగా అవినాష్ మాట్లాడుతూ.. ” నా శ్రేయస్సు కోరుకునే ప్రధమ వ్యక్తుల్లో జయప్రకాశ్ ఒకడు, ఆయన చేసే సేవా కార్యక్రమాలు అన్ని నా శ్రేయస్సు కోసమే అని కొనియాడారు “…. జయప్రకాష్ మాట్లాడుతూ ” పుట్టినరోజులు చేసుకోవడం తన అభిమతం కాదని, ఈ నెపంతో పదిమందికి సహాయం చేయొచ్చు అనే ఉద్దేశంతోనే పుట్టినరోజు నిర్వహించుకుంటానని తెలియజేశారు… ఈ సందర్భంగా పేదలకు తోపుడు బండ్లు మరియు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు…
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గ, కందుకూరు మండలం…..
కేఎల్ఆర్ కు కందుకూరు మండలంలో బ్రహ్మరథం పట్టిన ప్రజలు కేఎల్ఆర్ కి మా ఓటు అంటున్న గ్రామ ప్రజలు, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో, కొత్తూరు, గపూర్ నగర్, కొత్తగూడా, జైత్వరం, పులిమామిడి, దన్నారం, చిప్పలపల్లి ,మురళి నగర్ ,పెద్దమ్మ తండా ,దావూద్ గూడా తండా ,బాచుపల్లి, నేదునూరు ,దాసర్లపల్లి ,గ్రామాలలో కేఎల్ఆర్ రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కె.ఎల్.ఆర్ కి ప్రతి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారు పెద్ద ఎత్తున వివిధ గ్రామాల నుండి కే ఎల్ ఆర్ కి ఘన స్వాగతం లభించింది కేఎల్ఆర్ కి అధిక మెజార్టీతో గెలిపిస్తామని గ్రామస్తులు మాటఇవ్వడం జరిగింది మరియు నేదునూరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నుండి ముఖ్య నేతలతో పాటు 300 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా కందుకూరు మండలం మిర్ఖాన్పేట్ గ్రామం నుండి 500 మంది బిజెపి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది
అనంతపురం జిల్లా: అక్రమ ఇసుక రవాణా దందా పై అధికారుల దాడులు, 17 టిప్పర్లు సీజ్
అనంతపురం జిల్లా…
రాయదుర్గం నియోజకవర్గం…
ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో పెద్ద ఎత్తున కర్ణాటకకు ఇసుక అక్రమ రవాణా
- అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం జుంజురాంపల్లి ఇసుక రిచ్ పై మైన్స్ అండ్ జియాలజీ అధికారులు దాడులు
- ఒక హిటాచి, 17 టిప్పర్లు సీజ్ చేసిన మైన్స్ అండ్ జియాలజీ అధికారులు
- రాయదుర్గం రెవెన్యూ అధికారులకు అప్పగింత
- అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం జంజురాంపల్లి వేదవతి హగరి నది ఇసుక రీచ్ పై మైనింగ్ శాఖ అధికారులు శనివారం రాత్రి ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.
ప్రభుత్వం అనుమతించిన గడువు ముగిసినా తవ్వకాలు జరుపుతున్నారని ఫిర్యాదుతో వెళ్లిన మైన్స్ అండ్ జియాలజీ విజిలెన్స్ అధికారులు. హిటాచి, 17 టిప్పర్లు సీజ్ చేసి రాయదుర్గం రెవెన్యూ అధికారులకు అప్పగించారు. అనంతపురం జిల్లా మైన్స్ అండ్ జియాలజీ ఇంచార్జ్ అధికారి, తాడిపత్రి కి చెందిన నాగన్న ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. గత కొద్దిరోజులుగా ప్రభుత్వ అనుమతులు ముగిసిన పెద్ద ఎత్తున టిప్పర్లు, ట్రాక్టర్లలో బహిరంగంగా ఇసుకను తరలిస్తూ జెకె కంపెనీ వారు ఇసుక రీచ్ లో వసూళ్లకు పాల్పడుతున్నారు. గత కొన్ని రోజులుగా రాత్రిపూట భారీ సంఖ్యలో టిప్పర్లలో జుంజురాంపల్లి, వేపరాళ్ళ రీచ్ల నుంచి ఇసుక కర్ణాటకకు అక్రమంగా రవాణా సాగిస్తున్నారు. కర్ణాటక సరిహద్దులోని రాయదుర్గం నియోజకవర్గంలో నుంచి అధికార పార్టీ నేతలు అండదండలతో యదేచ్చగా ఇసుక అక్రమ రవాణా దందా కొనసాగుతోంది. ఇసుక టిప్పర్లు సీజ్ చేసిన మైన్స్ అండ్ జియాలజీ అధికారులు మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అనంతపురం వెళ్లడం శోచనీయం. ఇసుక టిప్పర్లు సీజ్ చేసిన విషయాన్ని తెలుసుకున్న తెదేపా నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు రాయదుర్గం ఏపీఎస్ ఆర్టీసీ డిపోలో ఉంచిన టిప్పర్లను పరిశీలించడానికి వచ్చారు. ఈ సందర్భంగా అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఆర్టీసీ డిపో వద్ద కాలవ మీడియా సమావేశంలో మాట్లాడారు. వైకాపాలనలో ఇసుక అక్రమ రవాణా యదేచ్చగా కొనసాగుతుందని కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 110 ఇసుసుక రీచులు ఉండగా, నేషనల్ గ్రీన్ ట్రిబునల్ అనుమతులు రద్దు చేసినట్లు తెలిపారు. అయినా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల అండదండలతో , రాయదుర్గం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అండదండలతో ఇసుక స్మగ్లింగ్ పెద్ద ఎత్తున జరుగుతుందని ఆయన ఆరోపించారు. జుంజురాంపల్లి ఇసుక రీచ్ లో సీజ్ చేసిన టిప్పర్ల వివరాలను అధికారులు వెల్లడించాలని, వాటిపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా..
అర్ధరాత్రి నల్లమల అచ్చంపేట లో ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ.. ఘర్షణలో గాయపడ్డ ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు.. ఘర్షణలో గువ్వలకు మెడ పై గాయలయ్యాయంటు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఓ వాహనంలో డబ్బుల బ్యాగ్ లను తరలిస్తున్నారనే సమాచారంతో వెంబడించిన కాంగ్రెస్ నేతలు. ఆ వాహనం గువ్వల బాలరాజు ఉన్న ప్రాంతానికి వెళ్లి ఆగిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగిన కాంగ్రెస్ శ్రేణులు. ఘర్షణ లో టవెరా వాహనం అద్దాలు పగలగొట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు. సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజు రాత్రి 10 తర్వాత ప్రచారం చేస్తూ డబ్బులు పంచుతున్నారంటూ ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ. స్థానిక పోలీసులు, గువ్వల గన్ మెన్ లు, గువ్వల ఎస్కార్ట్ పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కు సపోర్ట్ చేస్తున్నారంటూ ఆగ్రహించిన వంశీకృష్ణ. ఈ ఘటన పై రాష్ట్ర ఎన్నికల కమీషన్ చర్యలు తీసుకోవాలని కోరిన వంశీకృష్ణ. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు..





Total views : 152350