cvr news channel telugu
ఆర్ జే డి అధినేత, బీహార్ మాజీ సీఎం, మాజీ కేంద్ర మంత్రి లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న సాయంకాలం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని రోడ్డు మార్గాన తిరుమలకు వచ్చి రాత్రి తిరుమలలోని బస్సు చేశారు లాలూ ప్రసాద్ యాదవ్, కుటుంబ సభ్యులు.ఈ రోజు ఉదయం లాలూ ప్రసాద్ యాదవ్,ఆయన సతీమణి మాజీ ముఖ్యమంత్రి రబ్రి దేవి, ఆయన తనయుడు బీహార్ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, ఇతర కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు, ఆలయాధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేసి దర్శనం చేయించారు. అనంతరం ఆలయం వెలుపల బీహార్ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ మాట్లాడుతూ తన కుమారుడి తలనీలాల సమర్పణ కోసం వచ్చామని,తలనీలాలు సమర్పించి కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, మా కుటుంబంతోపాటు దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దేవుని ప్రార్థించాను అని అన్నారు డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, గన్నవరం మండలం చిన్న ఆవుటపల్లి వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టిన వైనం. తాడేపల్లిగూడెం నుండి గుంటూరు వైపు వెళ్లే తరుణంలో చిన్న అవుటపల్లి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం. ప్రమాదంలో గాయపడిన వ్యక్తులు గుంటూరు వాసులుగా కార్తీక్ (19) వెంకట్ (30)గా గుర్తింపు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు సమీపంలోని చిన్న అవుటపల్లి పిన్నమ నేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం తరలించారు. సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది రోడ్డుపై ట్రాఫిక్ ను క్లియర్ చేయడం జరిగింది. హైవే పెట్రోలింగ్ సిబ్బంది సహాయం తో సమాచారం అందుకున్న ఆత్కురు పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా. ప్రసూతి కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే డాక్టర్ల నిర్లక్ష్యంతో మహిళ గర్భంలోని శిశువు మరణించిన సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది. బోయినపల్లి మండలం జగ్గారావుపెల్లి కి చెందిన తిప్పరవేని చందు- అమూల్యలకు మూడు సంవత్సరాల క్రితం వివాహం జరగ్గా, తొలి కాన్పు సమయం కావడంతో వేములవాడ ఏరియా హాస్పిటల్ మూడు రోజుల క్రితం అడ్మిట్ కాగా, ఆపరేషన్ చేయాలని అమూల్య బంధువులు ఎంత వేడుకున్నా డాక్టర్లు మాత్రం పట్టించుకోకుండా ఆపరేషన్ చేయాలంటే అనస్తీషియా అందుబాటులో లేడని, ఆపరేషన్ చేసే డాక్టర్ లేడని పొంతనలేని సమాధానాలు చెప్పడంతో, అప్పటికే తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న అమూల్య గర్భంలోని శిశువు మరణించాడు. వెంటనే తేరుకున్న డాక్టర్లు ఆదరాబాదరగా ఆమెకు ఆపరేషన్ చేసి మృతి చెందిన శిశువును అప్పగించడంతో ఆగ్రహం తో కుటుంబ సభ్యులు ఏరియా హాస్పిటల్ ముందు ధర్నా దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే పసి పాప మృతి చెందినదని, బాధ్యులైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం పాలెం గ్రామం ఏలేరు నదిలో గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది.. స్థానికులు కథనం ప్రకారం పాలెం తామరాడవెళ్మ రహదారి మధ్యలో ఏలేరు నదిపై ఉన్న వంతెన క్రింద ఓ గుర్తు తలియని మృతదేహం నీటిలో తేలుతూ ఉండటంతో అటుగా వెళుతున్న స్థానికుల గమనించి కిర్లంపూడి పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు.. సమాచారం అందుకున్న కిర్లంపూడి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.. కానీ మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నం మాత్రం చేయలేదు.. ఇదంతా ఎలా ఉంటే ఈ మృతదేహాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఏలూరు వంతెనపై చూడడానికి రావడంతో తండోపతండాలుగా జనం తరలి రావడంతో బ్రిడ్జిపై కొంతమేర ట్రాఫిక్ నిలిచిపోయింది.. ఈ మృతదేహం ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది మరింత సమాచారం తెలియాల్సి ఉంది..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేతకు సంబంధించి ప్రక్రియను ప్రారంభించాలని పోలీసు శాఖను రేవంత్ ఆదేశించారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీలలో నేటి నుంచి రెండింటిని అమలు చేస్తామని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో పాల్గొన్న ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తివేయనున్నట్లు తెలిపారు. 2009 నుంచి 2014 జూన్ 2వ తేదీ వరకు నమోదైన కేసుల వివరాలను ఇవ్వాలని అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. వివరాలు వచ్చిన వెంటనే ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తి వేయనున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల ఉద్యమకారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండల కేంద్రంలో తెలుగు తమ్ముళ్ల మధ్య పెక్సీల వివాదం. ఈరోజు చంద్రబాబు నాయుడు వస్తున్న సందర్భంగా తెలుగు తమ్ముళ్లు పెక్సీలు కట్టే విషయంలో రెండు వర్గాలుగా విడిపోయి మాది సెంటర్లో ఉండాలి, మాది సెంటర్లో ఉండాలని ఘర్షణకు దిగిన తెలుగు తమ్ముళ్లు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి ఇరు వర్గాలను చెదల కొట్టడంతో సమసిపోయిన వివాదం.
చిత్తూరు జిల్లా లోని పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో కుక్కల దొడ్డి వద్ద ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరిని కారు ఢీకొనడంతో వృద్ధుడు మృతి మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి, స్థానికుల సహాయంతో గాయపడిన వ్యక్తిని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, వీరి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
భారతదేశం తన చంద్రయాన్-4 కార్యక్రమాన్ని 2024లో ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఈ కార్యక్రమం భారతదేశం నుండి చంద్రునికి మొదటి ల్యాండర్, రోవర్ మరియు ఆర్బిటర్ను పంపనుంది.
చంద్రయాన్-4 యొక్క ప్రధాన లక్ష్యం చంద్రుని శిలలను తీసుకురావడం. ఇది చంద్రుని పుట్టుక మరియు అభివృద్ధి గురించి మరింత తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలకు సహాయపడుతుంది.
చంద్రయాన్-4 ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అవుతుంది మరియు రోవర్ను విడుదల చేస్తుంది. రోవర్ చంద్రుని ఉపరితలంపై 100 మీటర్ల వరకు ప్రయాణించి శిలలను సేకరిస్తుంది. ఈ శిలలు ల్యాండర్లోకి తిరిగి తీసుకురాబడతాయి మరియు భూమికి తిరిగి తీసుకువెళ్లబడతాయి.
చంద్రయాన్-4 ఆర్బిటర్ చంద్రుని చుట్టూ తిరుగుతుంది మరియు శాస్త్రీయ పరిశోధనలను నిర్వహిస్తుంది. ఇది చంద్రుని ఉపరితలం యొక్క మ్యాప్ను తయారు చేస్తుంది, చంద్రుని భౌగోళికం మరియు భౌతిక లక్షణాలను అధ్యయనం చేస్తుంది మరియు చంద్రుని భవిష్యత్తు పరిశోధనలకు మార్గదర్శకత్వం చేస్తుంది.
చంద్రయాన్-4 భారతదేశం యొక్క చంద్రుని అన్వేషణలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఇది భారతదేశాన్ని చంద్రునిపై శిలలను తీసుకురావడంలో విజయం సాధించిన మూడవ దేశంగా మారుస్తుంది.
చంద్రయాన్-4 కార్యక్రమం యొక్క కొన్ని ముఖ్యమైన లక్ష్యాలు:
- చంద్రుని శిలలను తీసుకురావడం
- చంద్రుని ఉపరితలం యొక్క మ్యాప్ను తయారు చేయడం
- చంద్రుని భౌగోళికం మరియు భౌతిక లక్షణాలను అధ్యయనం చేయడం
- చంద్రుని భవిష్యత్తు పరిశోధనలకు మార్గదర్శకత్వం చేయడం
చంద్రయాన్-4 కార్యక్రమం భారతదేశం యొక్క చంద్రుని అన్వేషణలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఇది భారతదేశాన్ని చంద్రునిపై శిలలను తీసుకురావడంలో విజయం సాధించిన మూడవ దేశంగా మారుస్తుంది.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి డిగ్రీ కాలేజ్ ఎదురుగా స్టూడెంట్ పై నుండి ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు దూసుకెళ్లడంతో, తీవ్ర గాయాలు పాలైన బెండి.సాయి( 24 ) అనే విద్యార్థి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి టెక్కలి వెంకటేశ్వర కాలనీకి చెందిన బెండి ఉమామహేశ్వరి కొడుకు గా గుర్తించారు. మృతుడి తండ్రి తన చిన్నప్పుడే చనిపోవటం తో, తన తల్లి చదివించి, పెద్దచేసి అల్లారు ముద్దుగా పెంచుకుంది. కల్లెదురుగా కన్నకొడుకు చనిపోవటం తో కన్నీరు మున్నీరు గా విలపిస్తుంది.





Total views : 151199