ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండల పరిధిలోని అటవీ, రెవెన్యూ భూముల్లో పలువురు దళారులు ఇష్టానుసారంగా మట్టి, కంకర తవ్వకాలను చేపడుతున్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఈ తంతు ప్రతిరోజూ కొనసాగుతోంది. కానీ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి దళారులు అక్రమంగా గండికొడుతున్నా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు ఉండటంపై పలువురు మండిపడుతున్నారు. ఇండ్లు కట్టుకునే వారికి మట్టి, కంకరతో అవసరం ఉంటుంది. దీంతో అధికారులతో కుమ్మక్కైన దళారులు తమ జేబులు నింపుకుంటున్నారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు కూడా దళారులు ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి వారికి సహకరిస్తున్నారు. పుట్రెల గ్రామంలో కోటిపల్లి నుండి పక్క మండలాలకు టిప్పర్ల, ట్రాక్టర్లు ద్వారా మట్టి, కంకర తరలిస్తున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు.
నరసాపురం గ్రామంలోని అటవీ ప్రాంతం నుంచి మట్టిని తరలిస్తున్నా అటవీ శాఖ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవటంతో వారి పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అటవీ భూముల్లో లెవెల్ ట్రాక్టర్ పెడితేనే అటవీ శాఖ అధికారులు అక్కడికి వచ్చి అడ్డుకుంటారు.. అలాంటిది ఇప్పుడు ఏకంగా తవ్వకాలు జరుపుతున్నా పట్టించుకోవట్లేదు. దీంతో వారికి ఎంత మేర ముట్టిందో దీనిబట్టే అర్థమవుతోంది. దీనిపై అధికారులను ప్రశ్నించే వారి పేర్లు, ఫోన్ నెంబర్లు సదరు దళారులకు ఇస్తూండటంతో వారు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దళారుల దందాకు చెక్ పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ముఖ్యంగా బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాజధానిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం…
- పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని వాడపల్లి…
- ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.ఏపీ హైకోర్టు మాజీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడైన ఐపీఎస్ అధికారి ఎం. సునీల్ కుమార్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను జూలై 3, 2026కి వాయిదా వేసింది. అప్పటివరకు ఆయనకు మధ్యంతర రక్షణ కల్పించిన…
- లంచగొండి అధికారుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి.రైడ్స్ జరగడం… అధికారులు పట్టుబడడం… ఆ తర్వాత కేసులన్నీ నీరుగారిపోవడం… ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ పరిధిలో జరుగుతున్న పరిణామాలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తి ఇది. వ్యవస్థను పట్టిపీడిస్తున్న అవినీతి వైరస్కు వ్యాక్సిన్ వేయాల్సిన ఏసీబీ వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.…
- ఫిన్లాండ్లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి విదేశాల్లో అదృశ్యమై 45 రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఫిన్లాండ్లో బీటెక్ చదువుతున్న మణిదీప్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడిని క్షేమంగా తిరిగి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 151086