సీఎం కేసీఆర్ బహిరంగ సభలో బుల్లెట్ల కలకలం రేగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ ప్రసంగం కొనసాగుతుండగా అస్లాం అనే వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ హల్చల్ చేశాడు. దీంతో వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Read Also..
Read Also..





Total views : 140817