technology news
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కెమెరా నిపుణులు కూడా ఈ ఫోన్లను చాలా ఇష్టపడుతున్నారు. మీరు ఫోటోగ్రఫీని బాగా ఇష్టపడి కొత్త ఫోన్ కొనే ముందు కెమెరా ఫీచర్లకు చాలా ప్రాధాన్యత ఇస్తుంటే కొత్త సంవత్సరంలో అంటే 2024లో మార్కెట్లో లభ్యమయ్యే ఆ స్మార్ట్ఫోన్ల జాబితాను ఇక్కడ చూద్దాం. ఇవి కెమెరాకు ఉత్తమమైనవి. OnePlus 11 5G ఈ ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 32MP పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి. Vivo X100 Pro ఈ ఫోన్ కెమెరా ZEISS భాగస్వామ్యంతో తయారు చేయబడింది. ఇది దాని వెనుక భాగంలో 50MP + 50MP + 50MP కెమెరా సెటప్ను కలిగి ఉంది. ఇది సెల్ఫీ కోసం 32MP కెమెరాను కలిగి ఉంది. Google Pixel 8 Pro ఈ ఫోన్ వెనుక భాగంలో 50MP + 48MP + 48MP కెమెరా సెటప్,సెల్ఫీల కోసం 10.5MP కెమెరా ఉంది. ఈ ఫోన్ ఫోటోగ్రఫీకి అద్భుతమైనది. amsung Galaxy S23 Ultra 5G ఈ ఫోన్ యొక్క 12GB RAM,256GB స్టోరేజ్ వేరియంట్ను పొందుతారు. ఈ ఫోన్ వెనుక భాగంలో 200MP ప్రైమరీ కెమెరా, రెండు 10MP టెలిఫోటో కెమెరాలు, 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 12MP కెమెరా మాత్రమే ఉంది. Apple iPhone 15 Pro Max ఈ ఫోన్లు పగలు లేదా రాత్రి, వీడియో లేదా సెల్ఫీలో బాగా పని చేస్తాయి. ఈ ఫోన్ వెనుక భాగంలో 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా,12MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. అంతేకాకుండా, ఇది 12MP సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంది. ఇది ముఖ్యంగా వీడియోగ్రఫీకి బాగా ఉంది.
తిమ్మాపూర్ మండలం, ఎల్ఎండి కాలనీలో గల నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఆదివారం దొంగలు పడ్డారు ఎస్సై చేరాలు కథనం మేరకు ఎల్ఎండి కాలనీలో గల నీటిపారుదల శాఖ ప్రభుత్వ కార్యాలయం ఆదివారం కావడంతో సాయంత్రం ఆఫీసుకు ఉన్న బేడాలను పగలగొట్టి సుమారు 5 కంప్యూటర్లతో పాటు వైఫై కనెక్టింగ్ డేటా, వివిధ సామాగ్రిని దొంగలించినట్లు తెలిపారు. సుమారు 2.5 లక్షల విలువ గల సామాగ్రి చోరీకి గురైనట్లు పేర్కొన్నరు. ఈ విషయమై కార్యాలయ సూపరిండెంట్ అంజిరెడ్డి సమాచారం అందించడంతో ఎస్సై చేరాలు కార్యాలయానికి చేరుకొని సిబ్బందితో కలిసి కార్యాలయంలో దొంగిలించిన కంప్యూటర్లు వివిధ సామాగ్రి తో పాటు ఇంకా ఏమి దొంగతనానికి గురయ్యాయని పరిశీలించారు అక్కడే ఉన్న అధికారులను సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా అని ఆరా తీశారు కొంతకాలంగా పనిచేయకపోవడం లేదని చెప్పారు. దొంగతనానికి గురైన కంప్యూటర్లలో ప్రాజెక్టు కు సంబంధించిన డేటా తో పాటు క్యాంపు క్వార్టర్లు అటెండర్లు వివిధ డెవలప్మెంట్ కు సంబంధించిన డేటా కంప్యూటర్ లో భద్రపరుస్తామని ఆ కంప్యూటర్ లు మాత్రమే చోరీకి గురయ్యాయని అలాగే బీరువా ను పగలగొట్టి వివిధ ఫైళ్లు కూడా చోరీ చేసారు అని వెల్లడించారు. వెంటనే క్లూస్ టీం కు సమాచారం అందించడంతో సోమవారం వేలిముద్రలు సేకరించినట్లు తెలిపారు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ముందు మిర్చి రైతులు ధర్నా. తేజా రకం మిర్చి క్వింటాకు 20,100 మార్కెట్లో పలుకుతుండగా కేవలం 15000 నుంచి 17000 వేలకు క్వింటా చొప్పున రైతుల నుండి విక్రయిస్తున్నారని రైతుల ఆగ్రహం. అధికారులు సిండికేట్ గా మారి రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం. సరైన మద్దతు ధర ప్రకటించకుండా రైతులను మోసం చేస్తున్నారని ఏనుమాముల మార్కెట్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా. రైతుల ధర్నాతో స్తంభించిన రాకపోకలు.
విజయవాడ, ఎమ్మెల్యే రామ మోహన్, ఆయన సతీమణి కృష్ణా జిల్లా జెడ్పి మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ తో భేటీ అయిన కేశినేని శ్వేత. రాజీనామా కారణాలు, తండ్రి కేశినేని నాని కి సంబందించిన అంశాలపై చర్చ. సుమారు అరగంట నుంచి ముగ్గురూ భేటీ. విజయవాడ 11 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ గా ఉన్న శ్వేత. కాసేపట్లో తన పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత టీడీపీకి రాజీనామా. ఎంపీ కేశినేని నాని వ్యవహారంలో ముందుగా రాజీనామా చేస్తున్న ఆయన కుమార్తె శ్వేత. గత మున్సిపల్ ఎన్నికల్లో శ్వేత కు మేయర్ పదవి విషయంలో మొదలైన కేశినేని నాని అసంతృప్తి. టీడీపీ గెలిస్తే శ్వేత కు మేయర్ పదవి ఇవ్వాలని పట్టుబట్టిన ఎంపీ నాని. శ్వేత కు మేయర్ పదవి ఇవ్వొద్దని వ్యతిరేకించిన మరో వర్గం. అప్పటినుంచి అధిష్టానం, వ్యతిరేక వర్గంపై విమర్శలు మొదలు పెట్టిన ఎంపీ నాని. రెండు రోజుల క్రితం తాను రాజీనామా చేస్తానని ప్రకటించిన ఎంపీ. ముందుగా తన కూతురు శ్వేత చేత రాజీనామా చేయిస్తున్న నాని.
అల్లూరి జిల్లా, వి.ఆర్.పురం మండలం వీరపవనకుంటా గ్రామంలో దారుణం. అనుమానంతో భార్య పీక కోసి హత్య చేసిన భర్త సోయం చిరంజీవి. గొల్లగూడెం గ్రామంలో అంగన్వాడీ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న మృతురాలు సోయం రాధ ( 32 ). అనాధాలుగా మిగిలిన నలుగురు ఆడపిల్లలు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సమాచారంతో హుటాహుటిన ఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 11వ డివిజన్ కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. కేశినేని నాని నిర్ణయంతో ఈరోజు కార్పొరేటర్ పదవికి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. ఈరోజు ఉదయం 8:30 గంటలకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యాలయానికి వెళ్లి గడిచిన కార్పొరేషన్ ఎన్నికల్లో తనకు సహకరించినందుకు ధన్యవాదాలు చెబుతారు. 9 గంటలకు అక్కడ కార్పొరేషన్ పరిధిలో తనకు సహకరించిన వారికి ధన్యవాదాలు చెబుతారు. 10:30 గంటలకు విజయవాడ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి మేయర్ మున్సిపల్ కమిషనర్ను కలిసి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా ఇచ్చి ఆమోదింప చేయాలని కోరుతారు.
కృష్ణాజిల్లా, అవనిగడ్డ నాగాయలంక మండలం పెద్ద పాలెం గ్రామంలో దారుణం. తన కూతురు వెంట పడుతున్నాడని షేక్ హుస్సేన్ షరీఫ్ అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేసిన యువతి యొక్క తండ్రి,, తమ్ముడు. షేక్ హుస్సేన్ షరీఫ్ కు తీవ్ర గాయాలు అవటంతో 108 వాహనంలో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. హుస్సేన్ షరీఫ్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి కి రిఫర్ చేసిన వైద్యులు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నాగాయలంక పోలీసులు.
అమరావతి, ఏపీలో మూడు రోజుల పాటు సీఈసీ బృందం పర్యటన. రేపు విజయవాడకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్. 9న రాజకీయ పార్టీలతో సమావేశం కానున్న సీఈసీ బృందం. అనంతరం ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఫిర్యాదులపై సీఈసీ సమీక్ష. 10న ఎన్నికల సన్నద్ధతపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ప్రజెంటేషన్.





Total views : 140743