బాపట్ల జిల్లాలో ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 13వ రోజు అంగన్వాడీలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. లక్షపై చిలుకు ఉన్న అంగన్వాడీల పట్ల ఎందుకు అంత నిర్లక్ష్యం. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ 13 రోజుల నుండి మేము సమ్మెలు దీక్షలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చీమకుట్టినట్లు అయినా లేదని, అంగన్వాడీల పట్ల ముఖ్యమంత్రి మొండి వైఖరి, మాకెంతో బాధ కలిగిస్తుందని వారు అన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడీ పట్ల దయచూపి అంగన్వాడి ల డిమాండ్లను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె ఉధృతం చేస్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగనవాడిలపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తుందని వారన్నారు, ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడి డిమాండ్లను పరిష్కరించాలని వారు అన్నారు.
ysrcp
వైసిపి పాలనకు చరమగీతం పాడేందుకే తెలుగుదేశం – జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయని గుంటూరు జిల్లా టిడిపి నాయకులు తెలిపారు. నారా లోకేష్ పాదయాత్ర విజయవంతమైందని ఆలపాటి రాజా తెలిపారు. టిడిపికి పోస్ట్ మార్టం చేయాలని మంత్రి అంబటి మాట్లాడుతున్నారని.. పోస్ట్ మార్టం చేయాల్సింది వైసిపీకేనని విమర్శించారు. వైసిపి ఎమ్మెల్యేల నియోజకవర్గాలు మార్చినప్పుడే వారి ఓటమి ఖరారయిందన్నారు. తుఫాన్ వల్ల సర్వం కోల్పోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. క్షేత్రస్థాయిలో జగన్ పంట పొలాలను పరిశీలించకుండా పరదాల చాటున వచ్చి రైతుల్ని పలకరించకుండానే వెళ్లిపోయారని మండిపడ్డారు. మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పి.. మహిళలను దారుణంగా మోసగించారన్నారు. నాడు – నేడు విద్యారంగంలో సంస్కరణలంటూ ప్రచారం చేస్తున్నారని… కానీ ఆరు లక్షల మంది విద్యకు దూరమయ్యారని ఆలపాటి ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత కొద్దిరోజులుగా అంగన్ వాడీలు నిరసనలు చేస్తున్నా పట్టించుకోక పోవడం దారుణమని ఆలపాటి రాజ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also..
మాజీమంత్రి, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం శ్రీ రఘురాo విలేకర్ల సమావేశంలో యువగళం నవశకం అనంతరం వైఎస్సార్సీపీ బెంబేలెత్తి పోయింది. దాదాపు 5లక్షల మంది హాజరైన నవకశం సభ, ప్రజలు ఏరకంగా వైఎస్సార్సీపీ పట్ల విముఖతతో ఉన్నారనేది స్పష్టమవుతోంది. ఒకచోట పనికిరానటువంటి వ్యక్తిని మరొక చోట తీసుకెళ్లి పెట్టిన ఏరకంగా ఆ వ్యక్తి చెల్లుబాటు అవుతారనేది ప్రజలు ఆలోచించాల్సిన అవసరముంది. ఈ యువగళం పాదయాత్ర ఇదేమీ ముగింపు కాదు ఇది ఒక నవశకానికి ఆరంభం. చంద్రబాబు చెప్పినట్లుగా జనసేన పొత్తు రేపటి ఆంధ్ర భవిష్యత్తుకు అత్యంత అవసరం. రెండూ పార్టీలు ప్రజా ప్రయోజనాల కోసo పొత్తుతో వైఎస్సార్సీపీ ఓటమి ఖాయమయ్యింది. రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి రేపటి ఎన్నికల్లో 165 స్థానాల్లో ఎమ్మెల్యేల గెలుపు, 25 ఎంపీల గెలుపు ఈ గెలుపు రేపటి ఆంధ్రరాష్ట్ర భవిష్యత్తును నిర్దేశిస్తుంది, జగన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు, దోపిడీ, దౌర్జన్యం అనేక రకాలుగా చట్టాన్ని అనుకూలంగా మార్చుకోవటం ఇవన్నీ తొలగిపోతాయి. అరాచక ప్రభుత్వాన్ని పూర్తిగా తొలగించటo టీడిపి, జనసేన ల లక్ష్యం, పొత్తు యొక్క ఉద్దేశ్యం. రేపు జరుగబోయే ఎన్నికలు జగన్మోహన్రెడ్డికి ఆంధ్రులు ఐదున్నర కోట్ల మంది ప్రజానీకం యొక్క ఆత్మగౌరవం మధ్య జరిగే యుద్ధమిది, జగన్మోహన్రెడ్డి అవమానించి, కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారు. ప్రజా ఆస్తుల్ని దోచుకుంటున్న తరుణంలో రేపు ప్రజలు తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం ఓటు వేస్తారనేది సందేహం లేదు. రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్రెడ్డి కి బైబై చెప్పటానికి సమాయాత్తమయారు.
పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు పాడేరు విద్యుత్ శాఖ సబ్ స్టేషన్ ముట్టడించి, ఉద్యోగులు బయటకు రాకుండా దిగ్బంధించారు. విద్యుత్ సబ్ స్టేషన్ ప్రధాన గేట్లను మూసివేసి, ప్లెక్సీలు కట్టి ధర్నాకు దిగారు. భారతీయ జనతా పార్టీ నేతలు.. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిజేపి ఆధ్వర్యంలో శుక్రవారం పాడేరు ఈ.పి.డి.సి.ఎల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యుత్ చార్జీల భారంతో వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుస్తుందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని లేకుంటే బీజేపీ ఆధ్వర్యంలో మరింతగా ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడి టీచర్ల ఆధ్వర్యంలో చేస్తున్న నిరసన సమ్మె శుక్రవారం 11 రోజుకు చేరింది. ఇందులో భాగంగా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం నుండి స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సిఐటియు నాయకులతో కలిసి అంగన్వాడి టీచర్లు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్లో సిఐటియు నాయకులతో కలిసి అంగన్వాడి టీచర్లు రోడ్డుపై బైఠాయించి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు జిల్లా నాయకులు నాగరాజు, నిర్మలమ్మ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన హామీల్లో అంగన్వాడి టీచర్లకు తెలంగాణ రాష్ట్రంలో కన్నా అదనంగా వెయ్యి రూపాయలు జీతాలు పెంచుతానని మాట ఇచ్చి మాట తప్పారని జగన్ సర్కార్ పై అంగన్వాడీ టీచర్లు మండిపడ్డారు. తక్షణమే అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వచ్చే ఎన్నికలలో ఓటుతో బుద్ధి చెప్తామని జగన్ సర్కార్ కు హెచ్చరించారు. రోడ్డుపై భిటాయించి ఆందోళన చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం తీసుకున్న పోలీసులు వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకున్నారు.
Read Also..
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి, రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అల్లూరి జిల్లాలో పర్యటన లో భాగంగా గురువారం చింతపల్లి సభా స్థలానికి చేరుకొని గిరిజనుల సమస్యల కోసం వారి చట్టాల కోసం ఏమి మాట్లాడలేదని అల్లూరి జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కార్య దర్శి సభ్యులు బోనంగి చిన్నయ్య పడాల్ అన్నారు. ఏజెన్సీ గిరిజన ప్రజల సమస్యలను ముందుగానే పత్రికల ద్వారా తెలియపరచామని వాటిని వేటిని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్థావనo చేయలేదని ఉన్నారు. హైడ్రో ఫ్లవర్ ప్రాజెక్ట్ కోసం కానీ బోయ వాల్మీకి కోసం కానీ జీవో నెంబర్ 3 కోసం కానీ ఏమి మాట్లాడలేదు. సభా సమావేశానికి రెండు కోట్ల రూపాయల ఖర్చు పెట్టి విద్యార్థులకు ట్యాబ్లు పంచిపెట్టి పుట్టినరోజు వేడుక జరుపుకుని వెళ్లిపోయారని గిరిజన సమస్యల కోసం ఏమాత్రం కూడా మాట్లాడలేదని ఆయన అన్నారు. చింతపల్లిలో సభ సమావేశానికి ఖర్చుపెట్టిన సొమ్మును శ్వేత పత్రo విడుదల చేయాలని అన్నారు. పది రోజులు బట్టి అంగనవాడి కార్యకర్తలు వారి న్యాయమైన సమస్యల కోసం సమ్మె చేస్తుంటే వారి సమస్యలు జగన్మోహన్ రెడ్డికి కనిపించలేదా అని సిపిఎం పార్టీ జిల్లా కార్య దర్శి సభ్యులు బోనంగి చిన్నియ్య పడాల్ సభ్యులు అన్నారు.
కడప జిల్లా… ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడమే గాక, ఇల్లు కట్టించి ఇచ్చే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పారు. ఒక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలోను, మళ్లీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తప్ప మరే ప్రభుత్వంలోనూ నిరుపేదలకు ఈ నియోజకవర్గంలో ఇల్లు మంజూరు కాలేదన్న విషయాన్ని ఎమ్మెల్యే సందర్భంగా గుర్తు చేశారు. తెలుగుదేశం నేతలు కేవలం విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు తప్ప, టిడిపి ప్రభుత్వం ఏ నిరుపేదకు ఏ ఇల్లు ఎక్కడ ఇచ్చిందో చెప్పాలని ఎమ్మెల్యే రాచమల్లు డిమాండ్ చేశారు. ప్రజా నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా సోములవారి పల్లి జగనన్న కాలనీలో నూతన ఇళ్లను ఎమ్మెల్యే రాచమల్లు ప్రారంభించారు. నిరుపేదల సొంత ఇంటి కల నెరవేర్చిన ముఖ్యమంత్రికి నియోజక వర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు చెప్పారు. ఇళ్ళ నిర్మాణం విషయంలో కొంత ఆలస్యమైనా అర్హులకు సిఎం పుట్టిన రోజున వెయ్యి ఇళ్లు పూర్తి చేసి అందిస్తున్నామన్నారు. మీనపురం, బొల్లారం జగనన్న కాలనీలలో కూడా రాబోయే మూడు నాలుగు నెలల్లో 17 వేల ఇళ్లు పూర్తి చేసి ఇస్తామన్నారు. అయితే నియోజక వర్గంలో 24 వేల ఇళ్లు ఇవ్వటమే కాక వాటిని నిర్మించి ఇచ్చే బాధ్యతను తీసుకున్నామన్నారు. సోములవారి పల్లెలోని రామేశ్వరం జగనన్న కాలనీ ఇళ్ళ ప్రారంభోత్సవంలో మున్సిపల్ చైర్ పర్సన్ వీనుపల్లి లక్ష్మీదేవి, ఆప్కాబ్ చైర్మన్ మల్లెల ఝాన్సీ రాణి, పద్మ చెలియా, కార్పొరేషన్ చైర్మన్ జింక విజయలక్ష్మి, వైసిపి నాయకులు నరసింహారెడ్డి, కల్లూరు నాగేంద్ర రెడ్డి, వరుకూటి ఓబుల్ రెడ్డి, పిట్ట బాలాజీ పాతకోట వంశీధర్ రెడ్డి, ఎంపీపీ శేఖర్ యాదవ్ ఇతర నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు..
గుంటూరు తూర్పు నియోజక వర్గంలో వైసీపీ కొత్త పుంతలు తొక్కుతోంది. స్థానిక ఎమ్మెల్యే ముస్తఫా వుండగానే ఎమ్మెల్యే అభ్యర్ధి నూరి ఫాతిమా అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డికు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ గుంటూరు పట్టణం లో హల్ చల్ చేస్తున్నాయి. ఆర్టీసి బస్ స్టాండ్, జిన్నా టవర్, నాజ్ సెంటర్, పొన్నూరు రోడ్డులో అందరినీ హార్డింగ్ లు వెలిశాయి. దీంతో పాటు రోడ్డు ఇరువైపులా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అధిష్టానం ప్రకటన చేయకముందే ఇలా ప్రకటించుకోవడం నగరవాసుల్లో ఆశ్చర్యం కలిగిస్తుంది.
Read Also..
సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేస్తూ సమాన పనికి సమాన వేతనం అందజేయాలంటూ అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టర్ రేట్ కార్యాలయం సమీపంలో రెండురోజులుగా నిరవేదిక సొమ్మె కొనసాగిస్తున్నారు. ఈ సమ్మెలో జిల్లా వ్యాప్తంగా ఉన్న సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులు పాల్గొన్నారు. ఈ సమ్మెకు యస్ టి యు ఉపాధ్యాయ సంఘం, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ వై రవీంద్ర నాగిరెడ్డి తో పాటు ఏపీటీఎఫ్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు హరిబాబు సంఘీభావం తెలుపుతూ ప్రభుత్వం వీరి డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీరు చేస్తున్న న్యాయపరమైన డిమాండ్లకు తమ ఉపాధ్యాయ సంఘం నాయకుల తరుపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని వారు స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన నాడు నేడు నుంచి పిల్లల చదువులకు అవసరమయ్యే అమ్మబడి ట్యాబులు, యూనిఫామ్, బుక్స్, మిడ్డే మిల్స్ తదితర వాటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన సమయాలలో మా వీధులను పూర్తి చేస్తున్నామన్నారు. ప్రధానంగా ఈ సమ్మెబాట పట్టడానికి కారణం సమగ్ర శిక్ష ఉద్యోగుల అందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. అందరికీ మినిమం ఆఫ్ టైం స్కేల్ హెచ్ఆర్ఏడిఏ అమలు చేసి వేతనాలు పెంచాలి. ప్రస్తుతం ఉన్న పార్ట్ టైం విధానాన్ని రద్దుచేసి ఫుల్ టైం కాంట్రాక్టు విధానాన్ని అమలు చేసి వేతనాలు పెంచాలి. ఔట్సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలోని మార్చి మినిమం ఆప్షన్స్ వేతనాలు పెంచాలి. 10 లక్షల రిటర్మెంట్ బెనిఫిట్ గ్రాటివిటీ కల్పించాలి. సామాజిక భద్రత పథకాలు ఈపీఎఫ్ ఈఎస్ఐ కార్డు సదుపాయాన్ని కల్పించాలి. పదవీ విరమణ వయసు 62 వేలకు పెంచాలి.వేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలి. మెరుగైన హెల్త్ స్కీమ్ అమలు చేయాలి. అన్ని సంక్షేమ పథకాల తో పాటు, వడ్డీ లేని బ్యాంకు రుణాలు మంజూరు చేయాలి. మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలి, కారుణ్య నియమాకాలు చేపట్టాలి.మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేరి లీవులు మంజూరు సదుపాయాన్ని కల్పించాలి. ప్రతి నెల ఒకటో తేదీకి వేతనాలు చెల్లించి సంవత్సరానికి సరిపడే బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి తనయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే నిజాయితీగా ఉంటూ, ప్రజల కష్టసుఖాలు తెలిసిన వాళ్లకే వచ్చే ఎన్నికల్లో పట్టం కట్టాలన్నారు. అలా ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఒక్కరే అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎర్రకోట చెన్నకేశవరెడ్డి కచ్చితంగా పోటీ చేస్తారని ఆయన గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ ఎమ్మెల్యే తనయుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.






Total views : 141395