Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Devotional అంగరంగ వైభవంగా శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి జాతర మహోత్సవం…

అంగరంగ వైభవంగా శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి జాతర మహోత్సవం…

by Prakash
The district collector visited the temple and paid his respects

రెబ్బెన మండలంలోని గంగాపూర్ లో నిర్వహించే మూడు రోజుల జాతరకు రెండవ రోజు జాతర సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆలయాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతర సందర్భంగా వచ్చిన జిల్లా కలెక్టర్ బర్కడే హేమంత్ సహదేవరావు కు ఆలయ కమిటీ ఈవో ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. ఈ జాతరకు కొమరం భీం జిల్లా నే కాకుండా మహారాష్ట్ర ఇతర జిల్లాల నుండి కూడా దర్శనార్థం భక్తులు వస్తూ ఉంటారు.

కొమురం భీం అసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన గంగాపూర్ శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు జాతర నిర్వహించనున్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు అంగరంగ వైభవంగా ఈ జాతర మహోత్సవం సాగనుంది. రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామ శివారులోని నది ఒడ్డున కొలువైన శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మొదటి రోజు స్వామి వారి కల్యాణం, రెండోరోజు రథోత్సవం, మూడో రోజు భక్తులకు దర్శనం తర్వాత జాతర ముగియనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భక్తులతో పాటు కరీంనగర్, వరంగల్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని జిల్లా పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలాజీ వెంకన్న కొలువైన తీరు గంగాపూర్ శివారులోని గుట్టపై ఉన్న శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి కొలువైన తీరు, ఆలయ నిర్మాణానికి సంబంధించిన చారిత్రాత్మక ఆధారాలు ఇలా ఉన్నాయి.

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 16వ శతాబ్దానికి ముందు ఇదే గ్రామానికి చెందిన ముమ్మడి పోతాజీ అనే భక్తుడు చిన్నతనం నుంచి భక్తిశ్రద్ధలతో స్వామివారిని కొలుస్తూ ఏటా మాఘశుద్ధ పౌర్ణమి రోజున తిరుమల తిరుపతి వరకు కాలినడకన వెళ్లి మొక్కులు చెల్లించుకునేవాడు. కాలక్రమేనా వయస్సు పైబడం తోపాటు ఆరోగ్యం సహకరించక తిరుపతి వరకు వెళ్లలేకపోవడంతో మనోవేదనకు గురవుతాడు. స్వామి వారే పోతాజీ కలలో కనిపించి గ్రామ పొలిమేరలోని గుట్టలో కొలువై ఉన్నానని, ఆలయం నిర్మించాలని కోరినట్లు స్థానికులు చెప్పుకుంటారు. ఏటా మాఘశుద్ధ పౌర్ణమి పర్వదినాన నీకోసం, నీలాంటి భక్తుల కోసం దర్శనం ఇస్తానని చెప్పినట్లు ప్రచారంలో ఉంది. దీంతో గంగాపూర్ వాగులో పుణ్యస్నానమాచరించి గుట్టను తొలగవ స్వామి పట్టెనామాలు దర్శనమిచ్చినట్లు చెబుతుంటారు. నాటి నుంచి నేటి వరకు ప్రతీ మాఘ శుద్ధ పౌర్ణమి పర్వదినాన స్వామివారు ఆలయంలో కొన్ని గడియలు కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తుంటాడని నమ్మకం ఏర్పడింది.

Advertisements

You may also like

Our Visitor

027462
Total views : 152177

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.