Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Andhra Pradesh ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న అమర్నాథ్ రెడ్డి…

ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న అమర్నాథ్ రెడ్డి…

by Prakash
Intinti Telugudesam program, ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం
Intinti Telugudesam program :

గంగవరం మండలంలో ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. గంగవరం మండలంలో పండుగ వాతావరణం నెలకొంది మాజీ మంత్రి అమర్నాథరెడ్డి రాకతో ఇంటింటి దగ్గర హారతులు చేపట్టారు. తమ బాధను కష్టాలను మాజీ మంత్రి అమర్నాథరెడ్డికి ప్రజలు చెప్పుకున్నారు. గంగవరం రైతులు సెరికల్చర్ పైన ఆధారపడి బతికే వాళ్ళు ఉన్నారు అంటూ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులని ఆదుకున్నాడని మీకు గుర్తు చేస్తున్నానని ఆయన అన్నారు. ఈ నాలుగున్నర సంవత్సరంలో సెరికల్చర్ ద్వారా రైతుకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కానీ మేపుకునే దానికి మందులు కానీ బిల్డింగ్స్ గాని ఈ ప్రభుత్వం ఆదుకోలేదని రైతులను చిన్నచూపు చూస్తా ఉందని అన్నారు. సెరికల్చర్ రైతులు డ్రిప్పు పైన ఆధారపడతారు నాలుగు ముఖాల సంవత్సరాలుగా డ్రిప్పు పైపులు ఇవ్వని ఈ ప్రభుత్వం రైతులను ఎలా ఆదుకుంటుందని అన్నారు.

Follow us on : FacebookInstagram & YouTube.

గంగవరం ప్రాంతంలో ఆటోనగర్ కావాలని చిన్న చిన్న ఇండస్ట్రీలు వస్తే ఈ గ్రామ పంచాయతీలో ఉండే యువకులకు ఉపాధి అవకాశాలు వస్తాయని గత ప్రభుత్వంలోనే ఒక సంవత్సరంలోనే చేశాను. ఈరోజు బైపాస్ పక్కలో ఆటోనగర్ ఉంది అక్కడ ఉపాధి అవకాశాలు వస్తున్నాయా లేదా కండ్లకు కట్టినట్లు కనిపిస్తా ఉందని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెదిరించడం భయపెట్టడం కేసులు పెట్టడం తప్పిస్తే ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. మళ్లీ రాష్ట్రానికి యువతల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అధికారాన్ని తీసుకొని రావాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. మీరు ఓట్లు వేసి గెలిపించి అక్కడ చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయాలి ఇక్కడ నన్ను శాసనసభ్యుడుగా గెలిపించాలి అంటూ అమర్నాథరెడ్డి ప్రసంగించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: