Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Telangana నేడు కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ కీలక నేతలు..!

నేడు కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ కీలక నేతలు..!

by Satya
Congress

బీఆర్ఎస్‌(BRS)కి చెందిన కీలక నేతలు కొందరు ఇవాళ కాంగ్రెస్‌(Congress)లో చేరబోతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌తో బీఆర్ఎస్ నేతలు భారీగా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఈ రోజు ఎంపీ కేకే, ఆయన కూతురు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి చేరనున్నారు. అలాగే స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య, ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత పురాణం సతీష్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నివాసానికి కే కేశవరావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కడియం కావ్య, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌లు చేరుకోనున్నారు. రేవంత్ నివాసంలో పార్టీలో చేరనున్న నేతలందరికీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి కండువా కప్పనున్నారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున బరిలో కడియం కావ్య నిలవనున్నారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: కడియం శ్రీహరిపై వినయ్ భాస్కర్ ఫైర్…


ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.
ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు …
కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్ల చరిత్ర.
హైదరాబాద్ నగర చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కాచిగూడ రైల్వే స్టేషన్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. …
కరీంనగర్ నూతన కలెక్టరేట్ పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. భవన …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

023118
Total views : 141007

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.