బాపట్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని ఈపురుపాలెంలో తెల్లవారుజామును బహిర్భూమికి వెళ్లిన 21ఏళ్ల సుచరిత అనే యువతిపై గుర్తుతెలియని వ్యక్తులు హత్యాచారం చేశారు. మహిళపై జరిగిన హత్యాచారం ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లాలని హోంమంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో హోంమంత్రి అనిత జిల్లాలోని చీరాల మండలం ఈపురుపాలెంలో హత్య జరిగిన ప్రాంతానికి బయలుదేరి వెళ్లారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి పోలీస్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకొని సుచరిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చి నిందితులను కఠినంగా శిక్షిస్తామని సుచరిత కుటుంబ సభ్యులకు 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు.బాపట్ల జిల్లాలోయువతిపై గుర్తుతెలియని వ్యక్తులు హత్యాచారం.. అనంతరం విలేకరుల సమావేశంలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. గత ప్రభుత్వం తాలూకా గంజాయి మూలాలు ఇంకా ఉన్నాయని వీటిపై ఉక్కు పాదం మోపుతామని నిందితులు ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించి తీరుతామని ఆమె అన్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- దుబాయి ఎంబసీ అధికారులతో చొప్పదండి ఎమ్మెల్యే భేటీ.దుబాయి ఎంబసి అధికారులతో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమావేశం అయ్యారు. ఇటీవల దుబాయిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చొప్పదండి నియోజకవర్గానికి చెందిన వారు మరణించారు. వారి మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దుబాయికి వెళ్లారు. మృతదేహాల తరలింపు…
- నల్గొండ జిల్లా గుడిపల్లిలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన.నల్గొండ జిల్లా గుడిపల్లిలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటించారు. 15 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న సమీకృత కార్యాలయ సముదాయాన్ని ఆయన పరిశీలించారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రెండు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. గుడిపల్లి PACS పరిధిలో 66 శాతం వరి కొనుగోళ్లు…
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేనేత కార్మికుల దీక్ష విరమణ.మంత్రి కొండా సురేఖ హామీ మేరకు నిరసన దీక్షను చేనేత కార్మి్కులు విరమించారు. ప్రభుత్వ శాఖలకు అవసరమైన కార్పెట్లు, బెడ్షీట్ల ఆర్డర్లను టెస్కొ సంస్థకు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ… ఉమ్మడి వరంగల్ జిల్లా చేనేత సహకార సంఘాలు నిరసన చేపట్టాయి. ధర్నా స్థలానికి…
- ములుగులో మెగా సానిటేషన్ డే కార్యక్రమం.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మెగా సానిటేషన్ డే” కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. పాఠశాలలు, హాస్టళ్లు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో బాగంగా ములుగు ఎస్సీ బాలికల వసతి గృహంలో పిచ్చి మొక్కలను తొలగించారు. వసతి గృహన్ని అధికారులతో కలసి శుభ్రం…
- సింగరేణి కార్మికులకు శుభవార్త.సింగరేణి మెడికల్ బోర్డును అత్యంత పారదర్శకంగా, వివాదరహితంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. వివిధ కారణాల వల్ల కొద్దికాలంగా నిలిచిపోయిన ఈ మెడికల్ బోర్డు ప్రక్రియను…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 141165