Sunday, August 16, 2026
News Navigation
Sunday, August 16, 2026
News Navigation

Breaking

Sunday, August 16, 2026
Home National JEE పరీక్షల షెడ్యూల్ విడుదల ..

JEE పరీక్షల షెడ్యూల్ విడుదల ..

by Rama
JEE పరీక్షల షెడ్యూల్ విడుదల ..

దేశవ్యాప్తంగా ఉన్న NITలు, IIITల్లో Btech, బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) 2025 జవనరి సెషన్‌ కోసం దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అయితే గడువు సమయం ముగిసే నాటికి దరఖాస్తు ప్రక్రియ ఊపందుకుంది. సుమారు 13 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. JEE జనవరి సెషన్‌కు అక్టోబర్‌ 28 నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనా.. మొదటి రెండు వారాల్లో కేవలం 5.10లక్షల మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. దీంతో ఈ సారి JEE మెయిన్‌కు దరఖాస్తుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు. అప్లికేషన్‌లో తీసుకొచ్చిన కొత్త విధానాలు, అర్హత ప్రమాణాలు విద్యార్ధులను గందరగోళానికి గురిచేసింది. ముఖ్యంగా దరఖాస్తు సమయంలో కొన్ని ప్రత్యేక సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాల్సి రావడంతో అప్పటికప్పుడు అవి దొరక్క విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.

నవంబర్‌ 22వ తేదీన గడువు సమయం ముగిసే నాటికి దాదాపు 13.8లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే గత ఏడాదితో పోల్చితే దరఖాస్తులు స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎన్టీఏ ఇంకా ప్రకటించలేదు. కాగా జవనరి 22 నుంచి 31వరకు తొలి సెషన్ పరీక్షలు, ఏప్రిల్‌ 1 నుంచి 8 వరకు రెండో సెషన్‌ పరీక్షలకు ఇప్పటికే NDA షెడ్యూల్‌ ప్రకటించింది. జనవరి 19 నుంచి అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
    ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణాంధ్ర–2047 థీమ్‌తో రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.సీడ్ యాక్సెస్ రోడ్డు…
  • ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.
    దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ చరిత్రలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘వందేమాతరం’ గేయాన్ని పూర్తిస్థాయిలో ఆలపించడం…
  • టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.
    టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యే యాడ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ ఛానెళ్లలో ప్రతి గంటకు గరిష్టంగా 12 నిమిషాల వాణిజ్య ప్రకటనల ప్రసారానికే పరిమితం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం విధించిన నిబంధనను తొలగిస్తూ కేంద్ర…
  • ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.
    ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైందని, ఫ్లోరెస్ ప్రాంతంలోని ఎండే నగరానికి 68 కి.మీ దూరంలో, 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం నమోదైందని అంతర్జాతీయ భూభౌతిక కేంద్రాలు…
  • నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .
    తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు చెప్పింది. పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్ తదితర యూనిఫాం సర్వీసుల ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్ల పాటు పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: