కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుసృత్తవ్యాఖ్యలు చేసిన రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు ,దత్త పుత్రుడుకు బుద్ధిచెప్పతారు. సుబ్రహ్మణ్యేర స్వామి వారి షష్ఠి మహోత్సవాలకు ప్రారంభించిన
మంత్రి,కోట్టు సత్యనారాయణ. మెపిదేవి దేవి లో కోలువైయిన్న శ్రీ వల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి వారి అంగరంగవైభవంగా ప్రారంభయిన్నాయి. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కోటి సత్యనారాయణకుంటబ సమేతంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ,స్వామిపుట్టలో పాలుపోసి, అనతరం ప్రతేకపూజలు నిర్వహించారు. తొలియత దేవాలయం అధికారులు, అర్చకులు బృందం అలయమర్యదులతో స్వాగతం పలికారు. అనతరం మంత్రి మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై త్రీవరస్థాయిలో మండిపడ్డారు.
political news
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం అంజనాపురం గ్రామ సమీపంలో గోద్రెజ్ పామాయిల్ ఫ్యాక్టరీ కి రైతుల వద్ద తీసుకున్న భూములకు నష్టపరిహారం ఇప్పించాలని రైతులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అంజనాపురం గ్రామం లోని గిరిజన రైతుల వద్ద తీసుకున్న భూములకు 30 లక్షలు ఇస్తామని చెప్పి 20 లక్షల రూపాయలే రైతుల ఎకౌంట్లో జమ చేశారని మిగతా నగదును రైతులకు అందజేయాలని డిమాండ్ చేశారు జిల్లా కలెక్టర్ ఆర్డీవో సైతం రైతులు దగ్గర తీసుకున్న భూములకు న్యాయమైన రేటును ప్రకటిస్తామని చెప్పి ఫ్యాక్టరీ యాజమాన్య వద్ద ఎకరానికి 27 లక్షల రూపాయలు చొప్పున నగదు తీసుకొని రైతుల ఎకౌంట్లో 20 లక్షలు రూపాయలు జమ చేశారని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు మా ప్రాంతంలో ఎకరం 50 లక్షలు వరకు డిమాండ్ ఉందని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తమ భూములను ఇచ్చామని తమకు న్యాయమైన రేటు ఇవ్వకుండా మోసం చేశారని విమర్శించారు తమకు నష్టపరిహారం చెల్లించేంతవరకు ఫ్యాక్టరీ పనులను అడ్డుకుంటామని రైతులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతులు స్థానికులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో వైసీపీ నేతల బరితెగింపు, అధికారాన్ని అడ్డు పెట్టుకుని భూములు ఆక్రమిస్తున్న వైసీపీ నాయకులు. చర్చి భూమిని కాజేసేందుకు యత్నం అడ్డుపడ్డ సంఘస్తుల పై దాడి. రెండు కోట్ల విలువ చేసే భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వైసిపి నాయకులు, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం ఇరికేపల్లి లూధరన్ చర్చి కి సంబంధించిన 2 ఎకరాల70 సెంట్ల భూమి ని వైసీపీ నేత దాచేపల్లి నగర పంచాయతీ కో ఆప్షన్ మెంబర్ అంజమ్మ భర్త వేల్పుల ధర్మదేవ్, అతని అన్న కొడుకు వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జి వేల్పుల కిషోర్ కబ్జా చేసేందుకు ప్రయత్నం చేసారు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి స్థలం లోకి jcb తో అక్రమించగా చర్చి సంఘ పెద్దల ఇదేమిటి ఇది బ్రిటీష్ వారు మా చర్చికి ఇచ్చారు ఇది మా సంఘం కి సంబంధించిన స్థలం మీరెవరూ అని ప్రస్నించగా ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది ఈ నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జి కిషోర్ సంఘ పెద్దల పై దాడి చేసి బలంగా కడుపులో పిడికిలితో గుద్దడంతో సంఘ పెద్దలు అందరూ కలసి దాచేపల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసేందుకు వెళ్లారు కాని పోలీసులు కూడా మీరు ఎందుకు వెళ్లారు మీకు ఏమి సంబందం అని వైసీపీ నేతలకు వత్తాసు పలికారు సదరు విషయం పై సోమవారం జిల్లా కలెక్టర్ కి,యస్పీ కి స్పందనాలో పిర్యాదు చేయాలని సంఘస్తులు నిర్ణయం తీసుకున్నారు.
సత్యవేడు మండలం ఇందిరా నగర్ సమీపంలో ఓ ప్రైవేటు లైసెన్స్ ఎర్రచందనం గోడౌన్ లో తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు ఎర్రచందనం దొంగలు దొంగలించి లారీలో వేసుకొని వెళ్తుండగా సినీ పక్కిలో వారిని వెంబడించి దాడులు నిర్వహించి దాదాపు లారీ తో సహా నాలుగు టన్నుల పైబడి ఎర్రచందనం స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు, సత్యవేడు సిఐ సర్కిల్ కి చెందిన స్థానిక పోలీస్ అధికారులు కూడా ఈ దాడుల్లో పాల్గొన్నట్లు సమాచారం. 16 మంది స్మగ్లర్లను అదుపులో తీసుకున్నట్లు సమాచారం. అందులో తమిళనాడుకు చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నట్లు సమాచారం. ఎర్రచందనం గోడౌన్లో కాపలా దారులను బెదిరించి వారిని కట్టివేసి దొంగతనానికి పాల్పడ్డ ఎర్రచందనం దొంగలు. తమిళనాడుకు చెందిన ఎర్రచందనం దొంగలు ఈ గోడౌన్ పై దాడులు చేస్తారని ఖచ్చితమైన సమాచారంతో వారం రోజులుగా టాస్క్ ఫోర్స్ నిఘా పెట్టినట్లు సమాచారం. ఈ దాడుల్లో దాదాపు 30 మంది టాస్క్ఫోర్స్ అధికారులు పాల్గొన్నట్లు సమాచారం. ఈ కేసును స్థానిక పోలీసులకు అప్పచెప్పినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సింగరేణి ఎన్నికలపై విచారణను హైకోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది సింగరేణి ఎన్నికలపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలను డిసెంబర్ 27 కు బదులు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించాలని రాష్ట్ర ఇంధన శాఖ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన నేపథ్యంలో ఎన్నిక నిర్వహణకు సమయం కావాలని కోర్టును కోరారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా సింగరేణి ఎన్నికలను నిర్వహిస్తామని గతంలో చెప్పారని కోర్టు గుర్తుచేసింది. అయితే సింగరేణి ఎన్నికలు నిర్వహించడానికి సమయం కావాలని కోరడంతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ ఈనెల 21కి వాయిదా వేసింది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు మొదటి నుంచి అవాంతరాలు, ఎన్నికల నేపథ్యంలో నోటిఫికేషన్ ఇచ్చేముందు ఒకసారి గుర్తింపు కార్మిక సంఘం,ఆతర్వాత యాజమాన్యం, మరోసారి రాష్ట్ర ప్రభుత్వం వేరు వేరుగా ఎన్నికలను వాయిదా వేయించాయి. చివరికి అక్టోబర్ లో వచ్చిన సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ కూడా సింగరేణి గుర్తింపు ఎన్నికలకు అడ్డుగా మారాయి. ఈ నెల 21 న కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అనే విషయం సందిగ్ధత నెలకొంది.
నూతన సంవత్సర వేడుకలకు డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్న ముఠా అరెస్ట్. అంతరాష్ట్ర డ్రగ్స్ ను అరెస్ట్ చేసిన రాచకొండ SOT పోలీసులు అరెస్ట్ చేసారు. రాజస్థాన్ నుండి తీసుకుని వచ్చి హైదరాబాద్ లో అమ్మాలని చూస్తున్నారు. ఓపియం డ్రగ్ 3.4 కేజీలు , 45 గ్రాముల పాపి స్ట్రాప్ పౌడర్ ను స్వాదినం చేసుకున్నాం. 2.8 లక్షలు నగదు సీజ్ చేసాం. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన SOT పోలీసులు అరెస్ట్ చేసారు. శశిపాల్ బిష్ నాయ్, మదనలాల్ బిష్ బాయ్ లను అరెస్ట్ చేసాం. శశిపాల్ గతంలో కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. బస్ ద్వారా డ్రగ్స్ ను హైదరాబాద్ కు తెస్తున్నారు. డ్రగ్స్ ను నిర్ములించడానికి స్పెషల్ డ్రైవ్ లు ఏర్పాటు చేస్తున్నాం.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటగా చిట్యాలకు వచ్చిన సినిమాటోగ్రఫీ, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి గజమాలతో ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే వేముల వీరేశం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. చిట్యాల సెంటర్ లో మహనీయుల విగ్రహాలకు పూలమాల వేసిన మంత్రి వెంకట్ రెడ్డి.
మంత్రి వెంకట్ రెడ్డి కామెంట్స్:
- కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో నకిరేకల్ లో గెలిపించి వేరేశం ను ఎమ్మెల్యే గా చేసినందుకు మీకు ధన్యవాదాలు.
- చిట్యాలలో జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణంకి జనవరి 2న టెండర్ స్టార్ట్ చేసి సంక్రాంతికి శంకుస్థాపన చేద్దాం.
- చిట్యాల-భువనగిరి రోడ్డు నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభించి ప్రమాదాలు జరగకుండా చూస్తానని హామీ.
- చిట్యాల మున్సిపాలిటీ కి అధిక నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తా.
- గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు కట్టిన బిల్డింగ్ లే ఉన్నాయి. అప్పుడు ఎలాగైతే రెట్టింపు వేగంతో పనిచేసామ్మో అంతకంటే ఎక్కువ రెట్టింపుతో పని చేసి నకిరేకల్ నియోజకవర్గంని అభివృద్ధి చేసుకుందాం.
తిరుపతి, ఆర్డీవో సుజనా, మున్సిపల్ కమిషనర్ కే ఎల్ ఎన్ రెడ్డిఆధ్వర్యంలో పుత్తూరు పట్టణంలో ఓటు హక్కు పై అవగాహన, ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగిరి ఆర్డీవో సృజన పాల్గొన్నారు.అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. కుల, మత, లింగ, జాతి, భాష, అనే బేధం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాల నిండిన పౌరులందరికీ ఓటు వేసే బాధ్యత, హక్కు,భారత రాజ్యాంగం ఆర్టికల్ 320 ద్వారా కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంలో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జగిత్యాలలో బంధు నిర్వహించి భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులు మాట్లాడుతూ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆటో కార్మికుల జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఆటో కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం చేయూతని ఇవ్వాలని కోరారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంలో వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జగిత్యాల లో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిరసన, మహిళలకు ఉచితం బస్సు ప్రయాణం లో వెంటనే రద్దు చేయాలని డిమాండ్. ఆటో కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసిన ఆటో కార్మికులు.
సింగరేణి సంస్థను ప్రైవేటుపరం కాకుండా చూస్తామని అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అండర్ గ్రౌండ్ మైనింగ్ గనులను ఏర్పాటు చేస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎం ఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా ఓసిపి త్రీ కృషి భవన్ లో ఐఎన్ టియూసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ. కేసీఆర్ ప్రభుత్వం సింగరేణి సంస్థ ను అప్పుల పాలు చేసిందని, రామగుండం ప్రాంతాన్ని బొందల గడ్డగా మార్చారాని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుతో పాటు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అలాగే కార్మికుల సొంతింటి కల అమలు కోసం కృషి చేస్తామని, కోల్ బెల్ట్ ప్రాంతంలో సిమెంట్ కర్మాగారాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తన గెలుపుకు సహకరించిన కార్మిక వర్గానికి నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటానని పేర్కొన్నారు.




Total views : 151842