తిరుపతి జిల్లా రేణిగుంట, రెండు రోజుల తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం బెంగళూరు నుండి ఇండిగో విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. అనంతరం రోడ్డు మార్గాన తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహానికి బయల్దేరి వెళ్లారు. మధ్యాహ్నం వారు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియం నందు ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ కి తిరుపతిలోని శ్రీ పద్మావతీ అతిధి గృహం వద్ద స్వాగతం పలుకుతున్న నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్.
political news
యాదాద్రి భువన గిరి జిల్లా. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ముఖ్యమైన శాఖలు జిల్లా మంత్రుల దగ్గరే ఉన్నాయి 11 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని మరోసారి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోటగా నిరూపితమైంది. డిసెంబర్ 3న నిజమైన తెలంగాణ సిద్ధించింది. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తాం. నల్గొండ అభివృద్ధి మా లక్ష్యం. ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయము.
నేడు నల్గొండ జిల్లాకు రానున్న రోడ్లు, భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లాకు వస్తున్న మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు. ఉదయం 10.30 కి మర్రి గూడ బై పాస్ నుంచి నల్గొండ లోని మంత్రి నివాసం వరకు భారీ బైక్ ర్యాలీ. నల్గొండ పట్టణంలోని మంత్రి నివాసంలో జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశం, ప్రజలను కలుసుకోనున్న మంత్రి. గత యేడాదిగా కొనసాగుతున్న వరిధాన్యం కొనుగోళ్ల తీరు.. భవిష్యత్ లో అనుసరించాల్సిన విధానం, జిల్లాలోని మున్సిపాలిటీలలో తాగునీటి కల్పన, జిల్లాలో నిరంతర విద్యుత్ సరఫరాలో ఎదరవుతున్న సమస్యలు.. ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు అనుసరించాల్సిన వ్యూహం పై కలెక్టర్ ఆఫీసులో జిల్లా కలెక్టర్ ఇతర విభాగాల అధికారులతో రివ్యూ మీటింగ్. అనంతరం జిల్లా అధికారులతో ఇష్టాగోష్టి.
గుంటూరు. తాడేపల్లి సీఎం కాంపు కార్యాలయం నుంచి ఎమ్మెల్యే మద్దాల గిరి కి పిలుపు. సోమ ,మంగల వారాల్లో మధ్యాహ్నం తరువాత వచ్చి కలవాలని ఆదేశం. ఇటీవల గుంటూరు ప్రశ్చిమ నియోజక వర్గ ఇంచార్జి మార్పు పై ఆర్య వైశ్యులు ఆందోళన చేసిన వైనం. ఇంచార్జి మంత్రి రజినీ నియోజక వర్గంలో పర్యటన చేస్తే అసంతృప్తులు ఉంటాయని అంచనా. ఇప్పటికే మంత్రి రజినీ నియోజక వర్గంలో కీలక వైసీపీ నేతలతో భేటీ, తనకి మద్దతు ఇవ్వాలని కోరిన మంత్రి రజినీ. చిలకలురి పేటలో మంత్రి రజనీ మర్రి రాజశేఖర్ మధ్య విభేదాలు ఉండటంతో గుంటూరు ప్రశ్చిమ నియోజకవర్గం కి మకాం మార్చిన రజినీ అంటున్న వైసీపీ నేతలు. మంత్రి రజినికి మద్దతు ఇవ్వాలని మద్దాల గిరి ని బుజ్జగించే అవకాశం.
దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం సోమవారం నాడు భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్ట దైవమైన రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకొని తరించారు. తొలుత ఆలయ కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి, ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి ప్రవేశించి రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా లఘు దర్శనం అమలు చేయడంతో భక్తులు నందీశ్వరుడి వద్ద నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. కళాభవన్లో శ్రీ స్వామివారి నిత్య కళ్యాణం, సత్యనారాయణ వ్రతం, బాలాత్రిపుర సుందరి దేవి ఆలయంలో కుంకుమ పూజ తదితర ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కును పెద్ద సంఖ్యలో భక్తులు చెల్లించుకున్నారు. అనుబంధాలయమైన బద్దిపోచమ్మ దేవాలయం సైతం భక్తులతో క్రిక్కిరిసిపోయింది. వందలాది మంది భక్తులు బద్దిపోచమ్మవారిని దర్శించుకుని బోనం మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
నంద్యాల మండలం సుగలిమెట్ట వద్ద పోలంలో బయటపడిన అమ్మవారి విగ్రహం. హైదరాబాద్ కు చెందిన వ్యక్తి మహనంది దర్శించడానికి వెళ్తుండగా సదరు వ్యక్తికి ఇక్కడ నేనున్నానని చెవిలో చెప్పిన అమ్మవారు. గత రెండు రోజుల నుండి వెతుకగా సుగాలిమెట్ట వద్ద బయటపడ్డ అమ్మవారి విగ్రహం. అమ్మవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు. అమ్మవారి విగ్రహం బయటపడడంతో కోలాహలంగా మారిన సుగాలిమెట్ట ప్రాంతం. అమ్మవారిని దర్శించుకుని పూజలు టెంకాయలు అర్పిస్తున్న భక్తులు….
సుబ్రహ్మణ్య షష్టి పురస్కరించుకుని ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. శ్రీ మాణిక్యాంబ అమ్మ వారిని, శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు. ఆలయ ప్రాంగణంలో గల శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పువ్వు,పడగలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. తెల్లవారుజామునుంచి భక్తులు ఇక్కడకు చేరుకోవడంతో క్యూలైన్లు అన్నీ బారులు తీరాయి. భక్తులు రద్దీకి తగ్గట్టుగా దేవాదాయ,ధర్మాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు…
సుబ్రహ్మణ్యేశ్వ స్వామి షష్ఠి మహోత్సవాలను సోమవారం కొత్తపేట నియోజకవర్గం లో వాడ వాడలా ఘనంగా నిర్వహించారు.భక్తులు వేకువ జామున నుంచే ఆలయాలకు చేరుకొని స్వామిని దర్శించుకుని పూలు,పడగలు సమర్పించుకున్నారు.పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయాలన్నీ కిటకిటలాడాయి.ముఖ్యంగా కొత్తపేట మండల పరిధిలోని వాడపాలెం లో వేంచేసియున్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారు జామున నుండే స్వామి వారికి ప్రధాన అర్చకులు శ్రీను,మణి,సాయి గార్ల చే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.అత్యధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వచ్చి స్వామి వారిని దర్షించుకున్నారు.అలాగే కొత్తపేటలో పురాణ ప్రసిద్ది చెందిన హరి హర దేవాలయం ప్రాంగణంలో గల వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భక్తులు అత్యధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు.ఆలయాల వద్ద రద్దీ ఎక్కువవడంతో భక్తుల క్యూ లైన్లుతో ఎక్కడికక్కడ బారులు తీరారు.నియోజకవర్గం లోని పలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.మండలం లో ఆయా ఆలయాల వద్ద షష్ఠి తీర్థాలు ఘనంగా నిర్వహించారు.
అమరావతి, ఆరోగ్యశ్రీ లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఇకపై ఆరోగ్యశ్రీ కార్డుదారులకు 25 లక్షల వరకూ ఉచిత వైద్యం. ఉదయం 11 గంటలకు ఆరోగ్యశ్రీ విస్తరణ కార్యక్రమం ప్రారంభించనున్న సీఎం జగన్. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ. కార్డుల పంపిణీలో పాల్గొనాలని ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ఆదేశాలు. కార్డుల పంపిణీ సమయంలో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్ లోడ్ చేసేలా చర్యలు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స ఎలా చేయించుకోవాలో వివరించేలా ప్రత్యేక క్యాంపెయిన్.
పాలు మరియు పసుపు రెండూ భారతీయ సంస్కృతిలో చాలా ముఖ్యమైన ఆహార పదార్థాలు. పాలు ప్రోటీన్, కాల్షియం మరియు ఇతర పోషకాలకు మంచి మూలం. పసుపు యాంటీఆక్సిడెంట్లు మరియు ఇతర ఔషధ గుణాలకు మంచి మూలం.
పాలు మరియు పసుపు రెండూ కలిపి తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి :
- రోగనిరోధక శక్తిని పెంచుతుంది: పసుపులోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇది మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.
- మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది: పసుపులోని కుర్కుమిన్ మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మెమరీ, ఏకాగ్రత మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
- గాయాలను నయం చేస్తుంది: పసుపులోని యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గాయాలను నయం చేయడంలో సహాయపడతాయి. ఇది వాపు మరియు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
- అల్జీమర్స్ మరియు పార్కిన్సన్స్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది: పసుపులోని కుర్కుమిన్ అల్జీమర్స్ మరియు పార్కిన్సన్స్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మెదడు కణాలను రక్షించడంలో మరియు వాటి క్షీణతను నిరోధించడంలో సహాయపడుతుంది.
- క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది: పసుపులోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.






Total views : 151384