పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లో దొంగల హల్చల్, మాచర్ల నెహ్రూ నగర్ 2వ. లైన్ లో నివాసం ఉంటున్న మేకల సురేష్ ఇంట్లో దొంగతనం. శనివారము రెంటచింతలో అత్త రింటికి వెళ్లి ఆదివారం తిరిగి మధ్య హనం ఇంటికి వచ్చి చూసుకునే లోపు దొంగతనం, సుమారు మూడు లక్షల బంగారు ఆభరణాలు, 50000 నగదు దొంగతనం జరిగిందని మాచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కేస్ నమోదు చేసి విచారిస్తున్న పోలిసులు.
political news
రిగేషన్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇరిగేషన్ అధికారులతో ముగిసిన సీఎం సమీక్ష. మేడిగడ్డపై పూర్తి వివరాలివ్వండి అంటూ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం తన నివాసంలో నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలన్నారు. ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు, ముందు ముందు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. యాసంగి పంటలకు నీళ్లిచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. నీటి లభ్యత, ఇతర అంశాలపై పలు సూచనలు చేశారు. అంతర్రాష్ట్ర జలవివాదాలను త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించి వీలైనంత త్వరగా పూర్తి వివరాలను అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఈ సమీక్షా సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈఎన్ సీ మురళీధర్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ సోమవారం కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది క్షేత్రమంత భక్తజనంతో సందడి నెలకొంది భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో పెద్దిరాజు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దర్శనార్థమై క్యూలైన్లు,కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం,పాలు,మంచినీరు అందిస్తున్నారు.
హైదరాబాద్ పబ్బుల్లో సోదాలు చేస్తున్న పోలీసులు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10, 36, 45 లోని పబ్ లో సోదాలు నిర్వహిస్తున్న పోలీసులు. అన్ని పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్న పోలీసులు. నిక్స్. డౌన్ టన్. పబ్బులు స్లీపర్ స్నిపర్ లను తీసుకువెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు. పబ్ లో డ్రగ్స్ , గంజాయి అమ్మకాలపై దృష్టి సారించిన పోలీసులు. మొదటిసారి స్నిపర్ డాగులను వెంటబెట్టుకొని సోదాలు నిర్వహిస్తున్న పోలీసులు.
విజయనగరం జిల్లా, శృంగవరపుకోట, కిల్తంపాలెంలో బాబు ష్యురిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పొల్గొన్న శృంగవరపుకోట నియోజకవర్గ ఇంచార్జి & మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి. శృంగవరపుకోట మండలం, కిల్తంపాలెం పంచాయతీ దెప్పురు & కరక వంజురు గ్రామాల్లో ఏర్పాటు చేసిన బాబు ష్యురిటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. బాబు ష్యురీటి భవిష్యత్తుకు గ్యారెంటీ భాగంగా ఇంటింటికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేస్తూ కరపత్రాలను పంపణీ చేశారు. అనంతరం ప్రజలకు మినీ మేనిఫెస్టో పథకాల గురించి వివరించారు. ప్రతీ క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్ల పరిధిలో ఉన్న ఓటరు జాబితాలను పరిశీలించి దొంగ ఓట్లను గుర్తించాలని, టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తే వాటిని మరల చేర్పించాలని సూచించారు. త్వరగా కొత్త ఓట్లపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు.
ట్రాన్స్జెండర్ వ్యక్తులు తరచుగా ఎదుర్కొనే ప్రత్యేక ఆరోగ్య అవసరాలను ఈ కేంద్రం దృష్టిలో ఉంచుకుని ప్రారంభించబడింది. ఎఎంఆర్ఐ ముకుందాపుర్ ఆస్పత్రిలో ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేక యూనిట్ వైద్య పరీక్షలు, హార్మోన్ థెరపీ, శస్త్రచికిత్సా ప్రక్రియలు వంటి సేవలను అందిస్తుంది.
ట్రాన్స్జెండర్ వ్యక్తుల ఆరోగ్యంపై ప్రత్యేక శిక్షణ పొందిన వైద్య సిబ్బంది ఈ కేంద్రంలో పనిచేస్తారు. ఇది ట్రాన్సజెండర్స్ కు సానుకూల వాతావరణాన్ని అందిస్తుంది. రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచి వైద్య సేవలు అందిస్తుంది.
ట్రాన్స్జెండర్ ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత
ట్రాన్స్జెండర్ వ్యక్తులు సాధారణ జనాభా కంటే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. డిప్రెషన్, ఆందోళన, హై బీపీ మరియు గుండె జబ్బులు వంటి ప్రమాదం వారిలో ఎక్కువగా ఉంటుంది. ఈ కేంద్రం లో వారు ఎదుర్కొనే ఆరొగ్య సమస్యలకు మంచి పరిష్కార మార్గం లభిస్తుంది.
కోల్కతాలోని ఈ కొత్త యూనిట్ ట్రాన్స్జెండర్ వ్యక్తుల ఆరోగ్య సమస్యలు తెలుసుకొని మరియు వారికి మెరుగైన ఆరోగ్య ఫలితాలను సాధించడంలో సహాయపడుతుంది. ఇది ఇతర నగరాలకు ఆదర్శంగా ఉండాలి మరియు భారతదేశంలో ట్రాన్స్జెండర్ ఆరోగ్య సంరక్షణకు నమూనాగా ఉండాలి అని సంకల్పం తో ప్రారంభించారు.
ఈ కొత్త యూనిట్ ప్రారంభం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఒక గొప్ప అవకాశం. ఇది వారి ఆరోగ్య అవసరాలను గుర్తించి, వారి మెరుగైన ఆరోగ్యనికి సహాయపడుతుంది.
ములుగు జిల్లా, మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరను జయప్రదం చేస్తామని సీతక్క అన్నారు , ఫిబ్రవరి 21 నుండి జాతర ప్రారంభం అవుతుంది. ఇప్పటికే 75 కోట్ల నిధులు సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర సైతం మేడారం దేవతల సన్నిధి నుండే ప్రారంభించారు. అడగ్గానే నిధులు కేటాయించారు. అవసరమైన మేరకు మరిన్ని నిధులు ప్రభుత్వాన్ని కోరుతాం. మా ఇంటి ఇలవేల్పు మేడారం తల్లులు. అధికారులకు అన్ని సూచనలు చేశాం. జాతర విజయవంతం కోసం ప్రణాళిక రూపొందించాం. కాంట్రాక్ట్ పనులను అవినీతి లేకుండా పూర్తి చేస్తాం. శాశ్వత ప్రాతిపదికన చేస్తాం. కేంద్రానికి కొన్ని పనులకోసం ప్రతిపాదనలు పంపాము. మేడారం జాతరకు జాతీయ హోదా కోసం రిక్వెస్ట్ పంపుతున్నాము. అందరూ సహకరించి జాతరను విజయవంతం చేయాలి అని ఆమె కోరారు.
అయోధ్య రామ మందిరం నుంచి వచ్చిన కోటి అక్షంతలు ఊరేగింపు కార్యక్రమం మార్కాపురం పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగింది. జనవరి 22న కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా అయోధ్య నుంచి మార్కాపురం పట్టణానికి వచ్చినటువంటి స్వామి వారి తలంబ్రాల అక్షింతలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు మార్కాపురం శాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం వద్ద నుండి డప్పు కోలాట చప్పుళ్ల మధ్య అక్షింతల కలశాలతో శోభాయాత్రను నాలుగు మాడవీధులలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశ్వహిందూ పరిషత్తు అఖిల భారత ప్రధాన కార్యదర్శి యక్కలి రాఘవులు గారు విచ్చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం రామచంద్రుని 600 సంవత్సరాల కల నేటికి తీరిందని ఈ యొక్క పవిత్రమైన అక్షింతలను జనవరి రెండవ తేదీ నుండి పట్టణ మరియు పరిసర ప్రాంతం గ్రామాలలో ప్రతి ఇంటికి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు మరియు స్వామివారి రూపం, ఫోటోలను, ప్రతి గడపకు చేరవేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.. ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని 22వ తేదీ ప్రాణ ప్రతిష్ట రోజున ప్రతి ఒక్కరు తమ ఇళ్లలో దీపాలను వెలిగించి భక్తిని చాటుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు, పలు హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
పెద్దపెల్లి జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు సుల్తానాబాద్ లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. సుల్తానాబాద్ లోని ఆంజనేయస్వామి దేవాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీగా మంత్రి బయలుదేరారు. పెద్దపల్లిలోని కమాన్ చౌరస్తా వద్ద మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ… పెద్దపల్లి జిల్లా పరిధిలో ఉన్న మంథని రామగుండం, పెద్దపల్లి,ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రజలు సంపూర్ణ విశ్వాసం ఉంచి మమ్మల్ని భారీ మెజారిటీలతో గెలిపించారని,ఈ ప్రాంత అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తామని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులలోనే రెండు గ్యారెంటీలను అమలు చేశామని, మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని అన్నారు. పెద్దపల్లిలో భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే పెద్దపల్లి అభివృద్ధిపై చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, గత పది రోజులలో అనేకసార్లు పెద్దపల్లి, సుల్తానాబాద్ కు బైపాస్ రోడ్డు మంజూరు చేయాలని పెద్దపల్లికి ఆర్టీసీ బస్ డిపో మంజూరు చేయాలని కోరారని, తప్పకుండా పెద్దపల్లి జిల్లా అభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి మాట నిలబెడతామని, ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు.
బోరబండ లోని సుల్తాన్ నగర్ లో మూడో తరగతి చదువుతున్న బాలుడి పై కుక్క దాడి తన స్నేహితులతో కలిసి ఆడుతుండగా పక్కన ఇంటి నుంచి వచ్చిన కుక్క ఒకేసారి పిల్లలపై కి రావడంతో పరుగులు తీసిన పిల్లలు హుటాహుటిన ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి బాలుడిని తరలించారు కుక్క ఇంటి యజమానిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన బోరబండ పోలీసులు.




Total views : 150772