సత్యసాయి నిగమాగమంలో వీవ్స్ అండ్ క్రాప్ట్స్ హ్యాండ్ లూమ్ వస్త్ర ప్రదర్శన ఆరంభం. హైదరాబాద్ , డిసెంబర్ 2023, శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్య సాయి నిగమాగమంలో ఏర్పాటైన కృతి వీవ్స్ అండ్ క్రాప్ట్స్ హ్యాండ్ లూమ్ వస్త్ర ప్రదర్శన నగర సోషలైట్ డాక్టర్ గూడపాటి విజయలక్ష్మీ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె ఇక్కడి హాలులో కొలువుదీరిన చేనేత కారులు వస్త్రోత్పత్తులు తిలకిస్తూ, చేనేత కారులతో వాటి తయారీ విధానం, ప్రత్యేకత తెలుసుకుంటూ కలవడిగా తిరిగారు. భారతీయ సంస్కృతి లో సిల్క్, హ్యాండ్ లూమ్ వస్త్రో ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని డాక్టర్ గూడపాటి విజయలక్ష్మీ అన్నారు. ఈ ఉత్పత్తులకు నేటికి వన్నె తగ్గలెదన్నారు. నేటి తరం యువతలో కూడా హ్యాండ్ లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారన్నారు. చేనేత అమ్మ చల్లని ఒడిలా ఆమె వర్ణించారు. అయితే హ్యాండ్ లుమ్ ఉత్పత్తుల తయారీకి చేనేత కారులు శ్రమ వెల కట్టలేనిదన్నారు. ప్రతి ఒక్కరూ చేనేత ను ఆదరించాలని, అప్పుడే చేనేత కారుల కష్టానికి తగ్గా ఫలితం పరోక్షంగా ఇవ్వగలమన్నారు. నిర్వాహకులు యలమంచిలి శ్రీలత మాట్లాడుతూ, ఈ నెల 25 వ తేది వరకు కొనసాగుతున్న ప్రదర్శన లో దేశం లోని 14 రాష్ట్రాల నుండి చేనేత కారులు , చేతి పని బృందాలు తమ సిల్క్ హ్యాండ్ లూమ్ చీరలు, డ్రెస్ మెటిరియల్ వంటి 75 వేల రకాల వస్త్రో ఉత్పత్తులను అందుబాటులొ ఉంచారని వివరించారు. ఈ నెల 27వ తేదీ నుండి నిజాంపేటలో కూడా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
political news
రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల నియోజకవర్గం, తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు అయనకు ఘన స్వాగతం పలికారు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటి సారిగా చేవెళ్ల ప్రాంతానికి వచ్చిన అయనకు చేవెళ్ల నియోజకవర్గం లోని 5 మండలాల నాయకులు కార్యకర్తలు అభిమానులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పామేన భీం భరత్, చేవెళ్ల సర్పంచ్ శైలజా ఆగి రెడ్డి డీసీసీ ఛైర్మెన్ వెంకట్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
హైదరాబాద్, నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగమయ్య కుంటలో ఒక వ్యక్తి అనుమానస్పద మృతి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం కొరకు మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ తరలించిన పోలీసులు. ఈమెరకు నల్లకుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో వైసిపి నేతల కబ్జాలకు అంతులేకుండా పోతోందని జనసేన విమర్శించింది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి మరియు అనుచరులు రోజుకూ కోటి రూపాయలు దోచుకుంటన్నారని జనసేన పార్టీ అధికార ప్రతినిధి తాతంశెట్టి నాగేంద్ర ఆరోపించారు. ప్రొద్దుటూరులో సామాన్య ప్రజల జీవితం దిగజారి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో జనసేన – టిడిపి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సుపరిపాలన అందిస్తామని నాగేంద్ర తెలిపారు.
ప్రజలందరి సహకారంతో తెలంగాణా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని ఐటి మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు.
మంథనికి వెళ్తున్న శ్రీధర్ బాబుకు సిద్దిపేటలో కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. కాంగ్రెస్ పాలన పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందని, అంతేగాక ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉంటుందని మంత్రి తెలిపారు. రాబోయే కాలంలో వ్యవసాయ, ఐటీ పరిశ్రమల రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచే కార్యచరణ రూపొందించి అమలు పరుస్తామన్నారు. గత ప్రభుత్వ పాలసీ విధానాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటే… వాటిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని మంత్రి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీ ఇచ్చిన విధంగానే మేనిఫెస్టోలో ఉన్న ఆరు గ్యారెంటీలతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. టిఎస్ పిఎస్సి ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ ను అమలుపరచి.. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ సాగింది. అధికార, విపక్షాల నడుమ వాగ్యుద్ధం జరిగింది. నువ్వెంతా అంటే నువ్వెంతా అనుకున్నారు. తాము చేసిన అభివృద్ధిని సోదాహరణంగా వివరిస్తూనే కాంగ్రెస్ పార్టీని నిశితంగా బీఆర్ఎస్ విమర్శించింది. గత సర్కారు తప్పులను ఎత్తి చూపుతూనే తామేంటో చాటుకున్నారు మంత్రులు. ఏం చేయబోతున్నమో వివరించారు. కేసీఆర్ హయాంనాటి అవకతవకలను తవ్వి తీస్తామని హెచ్చరించారు.
మొదటిసారిగా చేవెళ్ల ప్రాంతానికి వచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలు గడ్డం ప్రసాద్ కుమార్ కు పుష్పగుచ్చం ఇచ్చి, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పామేన భీం భరత్, చేవెళ్ల సర్పంచ్ శైలజా ఆగిరెడ్డి, డిసిసి ఛైర్మన్ వెంకట్ రెడ్డి, అభిమానులు పాల్గొన్నారు. తమ ప్రాంతం నుంచి మొదటిసారిగా స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నిక కావడం గర్వకారణంగా ఉందని నాయకులు తెలిపారు.
Read Also..
Read Also..
అసెంబ్లీలో సభ్యుల సంఖ్య ముఖ్యం కాదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాలని బీఆర్ఎస్ కు సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. కేటీఆర్ విమర్శలపై సీఎం నిశితంగా స్పందించారు. చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడితే అర్థరహితమన్నారు. కొంతమంది ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామిక స్ఫూర్తి తెలియదంటూ తిప్పికొట్టారు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు మొదలు పెడుతోంది.. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనికోసం ఏర్పాట్లను ప్రారంభించనుంది. 2019లో ఏపీ అసెంబ్లీతో పాటు లోక్ సభకు ఎన్నికలు జరిగాయి. వచ్చే ఏడాది జూన్ 10వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంట్లో భాగంగా ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ల జాబితాలు, పోలింగ్ స్టేషన్లు, సిబ్బంది వంటి అంశాలపై చర్చించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు రాష్ట్రానికి రానున్నారు.
తనకు మళ్లీ ఉద్యోగం ఇవ్వాలని భావిస్తున్న సీఎం రేవంత్రెడ్డి ప్రతిపాదనను మాజీ డీఎస్పీ నళిని సున్నితంగా తిరస్కరించారు. తన ప్రశాంతతను భంగం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినికి మళ్లీ ఉద్యోగం చేయాలన్న ఆసక్తి ఉంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తాను ఆదేశించారు. ఆమెకు తిరిగి పోలీస్శాఖలో ఉద్యోగం ఇచ్చేందుకు అవరోధాలు ఉంటే వేరే శాఖలో అదే హోదా కలిగిన ఉద్యోగాన్ని ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. నళినికి న్యాయం జరగలేదని, ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు చాలామంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు ఇచ్చినప్పుడు.. నళినికి ఎందుకు అన్యాయం జరగాలని రేవంత్ ప్రశ్నించారు.





Total views : 150605