చిత్తూరు జిల్లా పలమనేరు, పలమనేరు నియోజకవర్గం లో సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు. గంగవరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నూతన విగ్రహం ప్రారంభోత్సవం చేసిన మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి. సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిప్యూటీ సీఎం అంజద్ భాష మినిస్టర్ గుమ్మనూరు జయరాం నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గంగవరం నుండి పలమనేరు వరకు బస్సు యాత్ర ప్రారంభమైంది ఈ బస్సు యాత్రలో భారీగా తరలివచ్చిన జనం. నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు భార్య రెండు పర్సెంట్ అని చెప్పింది రెండు పర్సెంట్ అంటే 4 వేల కోట్లు రైతు పాలు పిండి చెమటోడ్చి నీ డైరీ కి పాలు పోస్తే రైతులు కూడా నువ్వు మోసం చేశావు అంటూ నెల్లూరు అనిల్ కుమార్ మాట్లాడాడు, అదేవిధంగా ఇంకో మహానుభావుడు ఉండాడు దత్తపుత్రుడు అతను ఈడేం పీకలేడు కానీ పక్క రాష్ట్రంలో పీకుతామని పోయాడో ఆడ ఎనిమిది సీట్లు నిలబడితే 350 ఓట్లు కూడా పడలేదు ఈ దత్తపుత్రుడు మమ్మల్ని ఏమో చేసేస్తాడంట అంటూ స్వెటర్ వెసాడు నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ ప్రజలకు కాసం సేపు ఊపు తెప్పించాడు అనిల్ కుమార్ కూడా కాసేపు దద్దరిలే మాటలు మాట్లాడాడు, డిప్యూటీ సీఎం మాట్లాడుతూ చంద్రబాబు పైన రాధాకృష్ణ పైన దద్దరిలే మాటలు మాట్లాడాడు నీ బిడ్డలు మాత్రము ఫారిన్లో చదువుకోవచ్చు అదే పేద పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో ట్యాబ్ ఇస్తే పిల్లలకు ట్యాబ్ లు ఇచ్చే చెడిపేస్తా ఉండారని లేనిపోని నిందలంతా వేస్తావా అసలు నువ్వు మనిషేనా అంటూ నారాయణస్వామి మాట్లా డి నారు, ఈసారి మీరు వేసే ప్రతి ఓటు జగన్మోహన్ రెడ్డికి చెందుతుంది భవిష్యత్తులో మిమ్మల్ని కాపాడతాడు ప్రతి ఒక్కరు నోటి నుంచి అదే మాట ప్రజలకు చెప్పారు జై జగన్ జై జగన్ ఈసారి ఓటు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సిపి పార్టీకే ఓటు వేయాలని మళ్ళీ మీరు సీఎంగా జగన్మోహన్ రెడ్డిని చూడాలని కోరుకుంటున్నాను అని మీకందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను అంటూ ప్రతి ఒక్క నాయకుడు ప్రజలకి విన్నవించారు.
ysrcp
కాకినాడ, పెద్దాపురం నియోజకవర్గం వైసీపీలో మరోసారి బయట వర్గపోరు. స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నియోజకర్గ వైసీపీ ఇంచార్జ్ దవులూరి దొరబాబుకు వ్యతిరేకంగా సమావేశమైన అసమ్మతి వర్గం. ఈనెల 22వ తేదీన భారీ ఎత్తున సమావేశం ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు. దొరబాబును ఇంచార్జ్ పదవి నుండి తప్పించి మరొకరిని ఇంచార్జ్ ఇవ్వాలనే అజెండాతో ముందుకు వెళ్తున్న అసమ్మతి వర్గం…
తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రేపు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమక్షంలో పార్టీలో చేరనున్నారు. పత్తిపాడు, తాడికొండలో ఎక్కడో ఒకచోట సీటు ఇవ్వాలని చంద్రబాబును అభ్యర్థించారు. శ్రీదేవి భర్త కాపు సామాజిక వర్గం కావడంతో పత్తిపాడులో ఎక్కువగా ఈ సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయని, అందులో సీటు ఇవ్వాలని శ్రీదేవి కోరారు.
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో గౌరిదేవి ఉత్సవాల్లో మహిళలతో బహిరంగంగా రికార్డింగ్ డాన్సులు చేయించారు. అధికార పార్టీ నేతల అండతో గ్రామ సచివాలయం ఎదుటే ఈ డాన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించడంతో పోలీసులు అటువైపు కన్నెత్తి చూసే ప్రయత్నం కూడా చేయలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. గ్రామ సచివాలయనికి అడ్డంగా భారీ స్టేజ్ లు ఏర్పాటు చేసి మహిళలతో డాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టారంటే అధికార పార్టీ నాయకులు ఎంతకు బరి తెగించారో అర్దం చేసుకోవచ్చు. మహిళల నృత్యాలు చూడటానికి సమీప గ్రామాల ప్రజలు తరలవచ్చారు.
ఓటమి భయంతో జగన్ మోహన్ రెడ్డి నియోజకవర్గ ఇంచార్జిలను మారుస్తున్నారు కానీ ప్రజలే జగన్ మోహన్ రెడ్డిని మార్చే రోజులు దెగ్గరలో ఉన్నాయని కొనకళ్ల నారాయణరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని పాయింట్లను చెప్పారు.
1) జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. అందుకే అభ్యర్థులను మార్చుతున్నారు.
2) నిన్న ప్రకటించిన 11 మంది ఇంచార్జుల్లో ఒక్కరూ కూడా గెలిచే పరిస్థితి లేదు.
3) ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి నాయకులను మార్చినంత మాత్రాన జగన్ రెడ్డి తలరాత మారదు.
4) దగాకోరు జగన్ రెడ్డి పాపం పండింది. జగన్ రెడ్డి అవినీతి, అక్రమాల మీద ఇప్పటికే ప్రజలు పీకలు దాకా కోపంతో ఉన్నారు.
5) మన భవిష్యత్తుకు గ్యారెంటీతో వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డిని ప్రజలు ఇంటికి పంపడం కూడా గ్యారెంటీ.
6) వైఎస్సార్సీపీ 11 మంది ఇంచార్జుల్లో ముగ్గురు మంత్రులు ఉన్నారు. స్థానికంగా వారిపైన వ్యతిరేఖత, అవినీతి ఆరోపణలు, ప్రజలతో సత్సంబంధాలు లేకపోవడమే ఇందుకు కారణం.
7) ప్రజలను మరోసారి మోసం చేసేందుకు వైఎస్సార్సీపీ ఇంచార్జుల మార్పుల పేరుతో కొత్త నాటకం ఆడుతోంది.
8) జగన్ రెడ్డి ఇంచార్జులను మార్చుతున్నారు… కానీ ఏపీ ప్రజలు ఏకంగా జగన్ రెడ్డినే మార్చేందుకు సిద్దంగా ఉన్నారు.
9) ఇప్పటి వరకు వైసీపీ నాయకులు చేసినదంతా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను దోచుకోవడం, వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేయడం. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నాటకాలు ఆడిన వైసీపీ ప్రభుత్వం. అభివృద్ధి మాత్రం శూన్యం.
10) మంగళగిరిలో గెలుస్తారని తెలిసినప్పుడు సీటు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చి ఓడిపోతారు అని తెలిసినప్పుడు మాత్రం బీసీ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవికి ఇచ్చారు.
11) బీసీల మీద జగన్ రెడ్డికి ఉన్న కపట ప్రేమకు ఇదే నిదర్శనం.
ఈ కార్యక్రమంలో మోటమర్రి బాబా ప్రసాద్ ,లంకె శేషగిరి ,గోపు సత్యనారాయణ ,బచ్చుల సుబ్రహ్మణ్యం (బోస్),బత్తిన దాస్ ,పీవీ ఫణి కుమార్ ,పామర్తి లక్ష్మణ్, చిల్లిముంత ప్రవీణ్ ,జనసేన నాయకులు భీమవరపు పరమేశ్వర రావు ,ఆళ్ల మాధవ ,బడే రమణ తదితరులు పాల్గొన్నారు.
కందుకూరు పట్టణంలోని 6వ వార్డు కోటకట్ట మసీదు ప్రాంతంలో, బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం ఉదయం నిర్వహించారు. ముందుగా ఆ ప్రాంతంలోని ముస్లింలంతా, పెద్దఎత్తున తరలివచ్చి నాగేశ్వరరావు కి ఘనస్వాగతం పలికారు. నాగేశ్వరరావు పై పూలు చల్లుతూ అభిమానంతో ముంచేత్తారు. గతంలో ఎప్పుడూ గడపదాటని ముస్లిం మహిళలు కూడా నాగేశ్వరరావు ని ప్రతి ఇంటికి తీసుకువెళ్లి, ఆయనను అందరికీ పరిచయం చేస్తూ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా మహిళలంతా జగన్ ప్రభుత్వంపై, స్థానిక వైసీపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కొంతమంది అధికార పార్టీ నేతలు తమకు ప్రభుత్వ పథకాలు అందకుండా అడ్డుపడుతున్నారని, నోరు తెరిచి అడిగితే బెదిరిస్తున్నారని నాగేశ్వరరావుతో చెప్పారు. మేమంతా గతంలో వైసీపీకి ఓట్లు వేశాం. ఈ ప్రభుత్వం మాకేమీ చేయలేదు. సైడు కాలవలు శిధిలమై నీళ్ళు ముందుకు పోక కంపు, దోమలతో అల్లాడిపోతున్నాం. కనీసం అవి బాగు చేయడానికి కూడా వైసిపి నాయకులకు చేతకావడం లేదు. ఎన్నికలకు ముందేమో పట్టాలిచ్చి ఇల్లు కట్టిస్తాం అని చెప్పారు. ఓట్లు వేయించుకున్న తర్వాత, తక్కువమందికి పట్టాలిచ్చి, ఇల్లు మీరే కట్టుకోవాలని చెబుతున్నారు. ఇల్లు కట్టుకోకపోతే పట్టాలు తిరిగి ఇచ్చేయాలని బెదిరిస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమానికి వెళ్ళకూడదంటూ మూడు రోజులుగా తమపై వైసీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని మహిళలు తెలిపారు. ఒకవేళ కార్యక్రమానికి వెళితే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని ఉదయం కూడా తమను బెదిరించారని చెప్పారు. ఈసారి వైసీపీకి ఓటు వేసే ప్రసక్తే లేదని, ఇంటూరి నాగేశ్వరరావుకి మద్దతుగా నిలిచి, ఆయన్ను అధిక మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ, రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో పేదలందరికీ స్థలాలు కేటాయించి, ఇల్లు కట్టించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. అలాగే అర్హులందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు. మీకు ఎలాంటి బెదిరింపులు వచ్చినా తమకు తెలియజేయాలని, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను గమనించి, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని నాగేశ్వరరావు కోరారు. కందుకూరులో అందరికీ ఆమోగ్యమైన పరిపాలన రావాలంటే వైసీపీని ఓడించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, వార్డు అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ బాషా, వార్డు నాయకులు షేక్ ఫిరోజ్, షేక్ మున్నా, షేక్ మియాజాన్, షేక్ దావూద్ బాషా, షేక్ నాయబ్ రసూల్, సయ్యద్ అహ్మద్, షేక్ రియాజ్, షేక్ సలీం, షేక్ అబ్దుల్లా, షేక్ సంధాని, షేక్ జిలాని, షేక్ సుభాని, షేక్ నిషాహీద్ నాయకులు కండ్రా మాల్యాద్రి, చదలవాడ కొండయ్య, చిలకపాటి మధుబాబు, షేక్ రఫీ, వడ్డెళ్ల రవిచంద్ర, బెజవాడ ప్రసాద్, గోచిపాతల మోషే, రాయపాటి శ్రీనివాసరావు, రెబ్బవరపు మాల్యాద్రి, పొడపాటి మహేష్, చుండూరి శీను, షేక్ సలాం, సయ్యద్ జియావుద్దీన్, రూబీ, గౌస్ బాషా, కరిముల్లా, షేక్ ఖలీల్, సవిడిబోయిన వెంకటకృష్ణ, ముచ్చు వేణు పులి నాగరాజు, ఫాజిల్, చంటి, బద్దిపూడి శిఖామణి, మమ్ముషా, వేముల ప్రసాద్, ముప్పవరపు వేణు గుమ్మ శివ, మచ్చ మనోహర్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
జగన్ మోహన్ రెడ్డి మాటలమాత్రం కోటదాటుతున్నాయి. చేతలు మాత్రం గడప దాటడం లేదని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. ఘంటసాల మండలం పూషడంలో మొలకెత్తిన వరి పంటను బుద్ధప్రసాద్, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు పరిశీలించి రైతుల ఆవేదన విన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులకు అపార నష్టం కలిగిందని, ఈ ప్రభుత్వం బీమనది ఛానల్ మురుగు డ్రైనేజీలో తూటికాడ, గుర్రపుడెక్క సకాలంలో తొలగించలేదన్నారు. ఫలితంగా ఈ గ్రామంలో 600 ఎకరాల్లో వరి పంట దారుణంగా మొలకలు వచ్చి పంట దేనికి పనికిరాకుండా పోయిందన్నారు. బీమనది డ్రైనేజీకి రూ.12లక్షలు నిధులు కేటాయించినా పనులు జరగలేదన్నారు. తుఫాన్ ముందు సకాలంలో స్పందించి ముంపు నివారణకు చర్యలు తీసుకుంటే అపార నష్టం తగ్గేదన్నారు. ఈ ప్రాంత రైతులకు కలిగిన నష్టానికి ప్రకృతి కారణం కాదని, పాలకుల నిర్లక్ష్యమే ఈ నష్టానికి కారణమన్నారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు నియోజకవర్గంలో ఒకట్రేండు డ్రైనేజీల దగ్గర ఫోటోలు దిగి మొత్తం పరిష్కారం చేసినట్లు ప్రచారం చేసుకున్నారని, కాని ఆయనకు పూషడం గ్రామ రైతుల సమస్యలు ఎమ్మెల్యేకు పట్టవా అని ప్రశ్నించారు. డ్రైనేజీ శాఖ అధికారులు ఎమ్మెల్యే చెప్పిన పనులే చేస్తారా? ఎక్కడ డ్రైనేజీ సమస్య ఉందో గుర్తించి సమస్య పరిష్కారం చేయాల్సిన బాధ్యత అధికారులపై లేదా? అని ప్రశ్నించారు. డ్రైనేజీ పనులు తీసుకున్న కాంట్రాక్టరుతో పనులు చేయించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకు లేదా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో అత్యధిక నష్టం కలిగిందన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి రైతులను నట్టింట ముంచేశారన్నారు. తక్షణమే సీఎం జగన్ రైతులకు ఏ సహాయం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు పంటల బీమా ఈ ఏడాది రైతులకు వర్తిస్తుందా లేదా ప్రకటించాలని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో రైతులకు బీమా పరిహారం దక్కిన దాఖలాలు లేవన్నారు. కృష్ణాజిల్లా కలెక్టర్ ఇప్పటివరకు మిచౌంగ్ పంట నష్టం పరిశీలించలేదన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ పంట నష్టం పరిశీలించాలని, ఈ పూషడం గ్రామ రైతులను పరామర్శించి, ప్రభుత్వ సహాయంపై స్పష్టత ఇచ్చి ఆదుకుంటామనే భరోసా ఇవ్వాలని కోరారు. తక్షణమే రైతులకు తదుపరి పంటకు ఇన్ పుట్స్ మొత్తం ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పది ఎకరాలు సాగు చేసిన కౌలు రైతు గల్లా వెంకటేశ్వరరావు, 16 ఎకరాలు సాగు చేసిన పీ.సాంబశివరావు, ఏడెకరాలు సాగు చేసిన అంకం నాంచారయ్య తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పంట పూర్తిగా నాశనం అయిపోయిందని కోత కోసినా ప్రయోజనం లేదన్నారు. వరి పంట మొత్తం దున్నేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, జనసేన నాయకులు, జనసేన సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అంగన్వాడీలకు గ్రాడ్యుటి కల్పించాలి. బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖ మాట్లాడుతూ.. ఈరోజు రెండో రోజు సమ్మె కొనసాగుతోంది, ప్రధానంగా అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలని సమ్మె చేస్తున్నాం. పాదయాత్రలో సీఎం హామీలను వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మాకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాం. కనీసం అంగన్వాడి వర్కర్లకు 26,000 జీతం ఇవ్వాలి, ఆయాలకు15000 జీతం ఇవ్వాలి. కర్ణాటకలో, తమిళనాడులో టిఎ డిఏ బిల్లులు వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రధానంగా 2015 నుంచి అంగన్వాడీలకు టిఏ బిల్స్ లేవు, మాకు చాలీచాలని జీతాలు ఇస్తూ ఎట్టి చాకిరి చేయించుకుంటూ కూడా సరైన జీతాలు ఇవ్వటం లేదని, అందుకోసమే విధి లేని పరిస్థితుల్లో ఈరోజు అంగన్వాడి సెంటర్లు మూసివేసి రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది అంగన్వాడి వర్కర్లు ఆయాలతో సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి మాకు న్యాయం చేస్తారని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు ఉద్యమిస్తామని అన్నారు. ఇప్పటికైనా సీఎం గారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని రాబోయే ఎలక్షన్లో అంగన్వాడీల ప్రేమాభిమానాలు పొందాలని అన్నారు. ఇప్పటికైనా అంగన్వాడి సమస్యలు సానుకూలంగా స్పందించి మా డిమాండ్స్ పరిష్కారం చేయాలి, లేని పక్షంలో మా యొక్క నిరవధిక సమ్మె కొనసాగుతుందని అన్నారు.
Read Also….
Read Also…
ఈరోజు మధ్యాహ్నం ఎమ్మార్వో కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జారీ చేసిన 35/2023 చట్టమును అనుసరించి మరియు గ్రామ రెవెన్యూ రికార్డులు ప్రకారం ఆసైన్మెంట్ చేసిన భూమిని అన్యక్రాంతం చేసే హక్కు తో పాటు సంపూర్ణ భూమి హక్కులు కల్పించి అసైన్డ్ భూములు క్రమబద్ధీకరణ చేసి మరియు డీకేటి భూములను శాశ్వత హక్కు పత్రం కల్పిస్తూ తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో నేడు నియోజకవర్గ వ్యాప్తంగా ఐదు మండలాలకు సంబంధించి అసైన్డ్ భూములు 8583 ఎకరాలకు గాను,3783 లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసి అనంతరం ఎమ్మెల్యే ప్రసంగిస్తూ అసైన్డ్ భూముల విషయంలో వాటిని అమ్ముకునే హక్కు కూడా లబ్ధిదారులకు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అని ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ భూ బదలాయింపు చట్టం-1977 ని సవరిస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది. గత మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా ఇప్పుడు ఆర్డినెన్స్ రూపంలో అది అమలులోకి రావడంతో అసైన్డ్ భూమల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అని ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇచ్చే భూముల విషయంలో ఇప్పటి వరకూ కఠిన నిబంధనలు ఉండేవి. ప్రభుత్వం అసైన్ చేసిన భూముల క్రయ విక్రయాలకు అధికారికంగా అవకాశం లేదు. వాటిపై ఎప్పటికైనా వారసులకే హక్కు ఉంటుంది. అందుకే అత్యవసరమైనా వాటిని అమ్ముకోలేరు యజమానులు. ఒకవేళ అమ్మినా, అసైన్డ్ భూములకు రేటు ఉండేది కాదు, న్యాయపరమైన చిక్కులుంటాయనే ఉద్దేశంతో తక్కువ రేటుకే వాటిని కొనేవారు కాదు అని భూములు రిజిస్ట్రేషన్లు కూడా కావు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త చట్టం తెస్తోంది. అందులో భాగంగానే ఆర్డినెన్స్ ని తీసుకొచ్చింది అని ప్రభుత్వం భూములు అసైన్ చేసి 20ఏళ్లు దాటితే వాటిని అమ్ముకునే అవకాశాన్ని యజమానులకు కల్పిస్తూ ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అని ఈ నిర్ణయాన్ని కూడా తాజా ఆర్డినెన్స్ లో పేర్కొంది అని ఇలా చిత్తశుద్ధితో పనిచేసే ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రభుత్వ విప్ శాసనసభ్యుల కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, వైస్ఎంపీపీ ధ్వజా రెడ్డి, ఓబులవారిపల్లి మండల కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి, చిట్వేల్ మండల కన్వినర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బారామరాజు, జిల్లా టూరిజం డైరెక్టర్ సుధాకర్ రాజు, సినియర్ నాయకులు ఎల్వి మోహన్, ప్రతాప్ రెడ్డి, రాజారెడ్డి,రెడ్డి, చిట్వేల్ ఎంపీపీ చంద్ర, మరియు సర్పంచులు, రమణ, వినోద్, పెంచల్ రెడ్డి, శైలజ, మండలాల ఎమ్మార్వోలు, లబ్ధిదారులు తదితరులు భారీగా పాల్గొన్నారు.
సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన ఆరోపణలు చేశారు ఆర్టికల్ 370 పై వచ్చిన తీర్పు చాలా దురదృష్టకరమని అన్నారు. జమ్ము కాశ్మీర్ పైన
370 అర్టికల్ పైన వచ్చిన తీర్పు దురదృష్టకరమని, న్యాయ వ్యవస్థ ఒక పంజరంలోని చిలుకగా మారిపోయింది అని అన్నారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొనని పార్టీలకు దాని ప్రాధాన్యత ఎలా తెలుస్తుందని, అందుకే 370 అర్టికల్ గురించి వారికి తెలియడం లేదని ఆవేదన చెందారు. భారతదేశాన్ని విడగొట్టే రీతిలో బిజెపి పాలన సాగుతోందని,చివరకు నిజాంకు వ్యతిరేకంగా కూడా బిజెపి పోరాడలేదుని ఆరోపించారు. సుప్రీంకోర్టు తప్పు చేసిందని చెబుతున్నా ఇలా అన్నాఅని తనను అరెస్ట్ చేసినా ఫర్వాలేదు అన్నారు.సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ డెకాయిట్లతో సైతము రాజీపడ్డాడు అని ఆరోపించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో వీరుచుకుపడ్డారు నారాయణ… తెలంగాణ ఎన్నికల ఫలితాలే ఎపిలో పునరావృతం కాబోతున్నాయని, వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని, అవినీతికి పాల్పడమని ఎమ్మెల్యేలకు చెప్పిందే జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచేసిన తరువాత ఇన్చార్జ్ లను మార్చినంత మాత్రాన ఉపయోగమేంటి అని ప్రశ్నించారు.ఇన్చార్జ్ లు, ఎమ్మెల్యే అభ్యర్థులు కాదు వైసిపిలో సిఎం అభ్యర్థినే మార్చాలని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం, పాలన చేతకాకపోవడం వలననే వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమికి ప్రధాన కారణాలు అన్నారు. గాల్లో తిరిగే జగన్మోహన్ రెడ్డి అదే గాల్లోనే కలిసిపోతాడు అన్నారు. పొగరు, అవినీతి, అహంకారంకు కేరాఫ్ జగన్మోహన్ రెడ్డి అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. బైజ్యూస్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని, బైజ్యూస్, బజాజ్ కార్యాలయాలను పగులగొట్టండి అని అన్నారు. తుఫాన్ వల్ల తిరుపతి జిల్లాలో 60వేల ఎకరాల్లో వరిపంట నష్టం జరిగిందని, 18లక్షల ఎకరాలలో అన్ని రకాల పంట నష్టం జరిగిందని, మిచౌన్ తుఫాన్ ను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేసారు.




Total views : 141490