Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Telangana నా 50 ఏళ్ల జీవితంలో ఇలాంటి దాడులు చూడలే – హనుమంతరావు

నా 50 ఏళ్ల జీవితంలో ఇలాంటి దాడులు చూడలే – హనుమంతరావు

by Satya
Hanumantha Rao

కాంగ్రెస్ నేతలపై కక్ష పూరితంగా ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరుగుతుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ నేతలపై తనిఖీలు చేస్తున్న దర్యాప్తు సంస్థలు బీఆర్ఎస్, బీజేపీ నేతలపై ఎందుకు సోదాలు జరపడంలేదని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలలో డబ్బులు ఉన్నవారు లేరా అని నిలదీశారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఐటీ రైడ్స్ చేయడంతో పాటు వారి ఉద్యోగులపై థర్డ్ డిగ్రీ చేశారని మండిపడ్డారు. నా 50 ఏళ్ల జీవితంలో ఇలాంటి దాడులు చూడలేదన్నారు. అమిత్ షా పనిగట్టుకుని ఈ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. సృజనా చౌదరి, సీఎం రమేష్ లు టీడీపీలో ఉన్నప్పుడు కేసులు వేశారు. వారు బీజేపీలో చేరగానే క్లీన్ చిట్ ఇచ్చారని ధ్వజమెత్తారు. ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్, ఏపీకి స్పెషల్ స్టేటస్ లపై కొట్లాడిన పవన్ కల్యాణ్ తిరిగి బీజేపీ వైపు చేరడంపై పునరాలోచన చేయాలన్నారు. ఇండియా కూటమిలో నితీష్, కుమార్, శరత్ పవార్, మమతా, స్టాలిన్ లు రాహుల్ కు మద్దతుగా ఉన్నారని ఈసారి కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమన్నారు.

Advertisements

You may also like

Our Visitor

027004
Total views : 151449

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.