మహారాష్ట్ర , ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉన్న అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది. గెలుపుపై ఎవరు ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ విజయం సాధిస్తుందనే అంచనాలు హోరెత్తిపోతున్నాయి. మరి ఇంతకు ప్రజల తీర్పు ఎవరిని విజయతీరాలకు చేర్చుతుందనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొన్నది.
మహారాష్ట్ర సమరంలో విజేతలెవరో తేలిపోనుంది. యావత్ దేశం దృష్టినీ తనవైపు తిప్పుకున్న మహారాష్ట్రలో.. బీజేపీ సారథ్యంలో మహాయుతి కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి కూటముల అభ్యర్థులు నువ్వా – నేనా అన్నట్టుగా పోటీ పడ్డారు. వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ లో మహాయుతి కూటమిదే విజయం అని తేలింది. 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీ కూటమి అధికారంలోకి వస్తుందని అంచనాకొచ్చాయి.ప్రతిపక్ష కూటమి అయిన మహావికాస్ అఘాడీ కూడా గెలుపు తమదవుతుందని ధీమా వ్యక్తం చేస్తోంది. హర్యానా, జమ్ము ఎగ్జిట్ పోల్స్ తారుమారవ్వడంతో.. మహావికాస్ అఘాడీ గెలుపు ధీమాలో తప్పులేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మహాయుతి గెలిస్తే.. బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, ఎన్సీపీ నేత అమోల్ మిత్కారీ డిప్యూటీ సీఎంగా ఎన్నికవుతారని అంటున్నారు. ఎన్సీపీనే సీఎం ఎన్నికలో కింగ్ మేకర్ అవుతుందంటున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- లద్దాఖ్లో ఐదు కొత్త జిల్లాలు..కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రకటించారు. వీటి ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్కు ఆమోదం తెలిపినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇదొక చరిత్రాత్మక రోజు…
- ‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!స్టార్ వుడ్ ఎంటర్టైన్మెంట్, రిసిప్ శెట్టి ఫిలిమ్స్, బ్యానర్ లో ఎమ్ అచ్చిబాబు సమర్పణలో ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి హీరోగా రచన ఇందిర్ హీరోయిన్ గా నటించిన సినిమా ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ అన్నీ కార్యక్రమాలు పూర్తి…
- విశాల్ ‘మకుటం’లో హీరోయిన్గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లో 99వ సినిమాగా ఆర్.బి. చౌదరి నిర్మానంలో విశాల్ స్వీయ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘మకుటం’. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్, పోస్టర్లు చూస్తే ఇదొక డిఫరెంట్ యాక్షన్ సినిమా అని అర్థం అవుతోంది. తాజాగా ఈ…
- ఏప్రిల్ 30న రాబోతోన్న ‘కర’ సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో ధనుష్..ధనుష్, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. ఈ మూవీకి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఏప్రిల్ 30న విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో…
- రిజిస్ట్రేషన్లు తగ్గినా…తెలంగాణకు భారీ ఆదాయం..తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుతం విభిన్న దృశ్యం కనిపిస్తోంది. ఒకవైపు ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గుతుండగా… మరోవైపు ప్రభుత్వ ఆదాయం మాత్రం గణనీయంగా పెరుగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12.5 లక్షల డాక్యుమెంట్లు మాత్రమే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Total views : 56943