మహారాష్ట్ర , ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉన్న అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది. గెలుపుపై ఎవరు ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ విజయం సాధిస్తుందనే అంచనాలు హోరెత్తిపోతున్నాయి. మరి ఇంతకు ప్రజల తీర్పు ఎవరిని విజయతీరాలకు చేర్చుతుందనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొన్నది.
మహారాష్ట్ర సమరంలో విజేతలెవరో తేలిపోనుంది. యావత్ దేశం దృష్టినీ తనవైపు తిప్పుకున్న మహారాష్ట్రలో.. బీజేపీ సారథ్యంలో మహాయుతి కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి కూటముల అభ్యర్థులు నువ్వా – నేనా అన్నట్టుగా పోటీ పడ్డారు. వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ లో మహాయుతి కూటమిదే విజయం అని తేలింది. 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీ కూటమి అధికారంలోకి వస్తుందని అంచనాకొచ్చాయి.ప్రతిపక్ష కూటమి అయిన మహావికాస్ అఘాడీ కూడా గెలుపు తమదవుతుందని ధీమా వ్యక్తం చేస్తోంది. హర్యానా, జమ్ము ఎగ్జిట్ పోల్స్ తారుమారవ్వడంతో.. మహావికాస్ అఘాడీ గెలుపు ధీమాలో తప్పులేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మహాయుతి గెలిస్తే.. బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, ఎన్సీపీ నేత అమోల్ మిత్కారీ డిప్యూటీ సీఎంగా ఎన్నికవుతారని అంటున్నారు. ఎన్సీపీనే సీఎం ఎన్నికలో కింగ్ మేకర్ అవుతుందంటున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను ఆనంద డోలికల్లో ముంచాయి. వందలాదిమంది కళాకారులతో పాటు తమ గాన మాధుర్యంతో ప్రఖ్యాత సింగర్లు.. వేలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశారు. ముందుగా మెక్సికో…
- ఇరాన్తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.అమెరికా, ఇరాన్ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక గొప్ప ఒప్పందం కుదిరిందని సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే హర్మూజ్ జలసంధిని తిరిగి…
- ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.…
- చివరి వరకు పోరాడిన శ్రీలంక.. కానీ ఫలితం వెస్టిండీస్దే.ఈ మ్యాచ్ 20వ ఓవర్లో మాత్రమే ముగిసినా, అసలు విజయానికి పునాది శ్రీలంక ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలో మరియు అనంతరం బ్యాటింగ్ పవర్ప్లేలో పడింది. చివరి 5 ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చిన వెస్టిండీస్, తర్వాత తొలి 6…
- పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్లు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పులపాకుల తులసి, కామాక్షి దుర్గాప్రసాద్లను శివాలయం బ్రిడ్జి వద్ద…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 141025