Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra Pradesh చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం..

చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం..

by Prakash
herd of elephants

చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలంలో ఏనుగులు గుంపు భీభత్సం సృష్టించాయి. వివరాల్లోకి వెళితే కడతట్లపల్లి గ్రామానికి చెందిన మహిళ రైతు వరలక్ష్మి గత 6 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నది. తన మూడు ఎకరాల పొలంలో అరటి తోట వేసి,ప్రకృతిలో దొరికే ఆకుల జీవామృతంతో పిచికారీ చేసి పంట దిగుబడి చేసింది. రెండు రోజుల్లో కోత కోయాల్సిన తరణం అసన్నమైoది.కానీ ప్రకృతి వ్యవసాయ మహిళా రైతు వరలక్ష్మి కి ఆశలు ఆవిరినాయి. ఒక్కసారిగా సోమవారం రాత్రి ఏనుగులు గుంపు అరటి తోటలో పడి భీభత్సం సృష్టించాయి. తెల్లవారి చూసే సరికి నేలమట్టంలో అరటి గెలలు దర్శనం ఇచ్చాయి.సంవత్సర కాల పంటలు సాగుకు ప్రభుత్వం సాయం అందించాలని కోరారు. సంవత్సరాలుగా పంటలు చేస్తున్నాం, కోత దశ వచ్చే సరికి ఏనుగులు చొరబడి నష్టం చేకురుస్తున్నాయి.కానీ 4 సంవత్సరాలుగా నష్ట పరిహారం ఒక్కరూపాయి కూడ చేకూర్చిన దాఖలాలు వైకాపా ప్రభుత్వంలో లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నది. తెదేపా ప్రభుత్వంలో నష్ట పరిహారం అందినది. నాటిని మొలకలకు కూడా 30 వేలు ఆర్థికం అందినదని హర్షం వ్యక్తం చేసింది. వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఒక్క రూపాయి కూడ నష్ట పరిహారం అందలేదు..ఇప్పుడున్న మా పరిస్థితి చూసి మాకు నెలకొన్న సమస్యను చూసి నష్ట పరిహారం ఇవ్వాలని సుమారు రెండు లక్షలు నష్టం చేకూరిందని ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisements

You may also like

Our Visitor

026852
Total views : 151244

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.