పొత్తులు పెట్టుకొని ఎంత మంది వచ్చిన ప్రజలు మాత్రం సీఎం జగన్ కె పట్టం కడతారని వైసీపీ అభ్యర్థి బుట్ట రేణుక (Butta Renuka) అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎన్నికల ప్రచారం చేపట్టిన వైసీపీ అభ్యర్థి బుట్ట రేణుకకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు మరో సారి ఓటు వేయాలని అభ్యర్థిస్తూ బుట్ట రేణుక ప్రచారం నిర్వహించింది. అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం జగనన్న పాలనలో ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందించామని, ఇవాళ ఆ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తూ, టీడీపీ, జనసేన, బీజేపీ ఇలా అందరు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో నిలబడ్డ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని బుట్టరేణుక అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏలను సెప్టెంబరు నెల జీతంతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. 2025 జనవరి 1 నుంచి 1.82 శాతం…
- ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…