పంటలు సాగు చేసేందుకు ఓ యువరైతు వరుసగా నాలుగు బోరు బావులు తవ్వించినా చుక్క నీరు పడకపోవడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించక బలవన్మరణం చెందిన సంఘటన శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండలం మల్లాపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్కసముద్రం ఆంజనేయులు కుమారుడు** అజయ్*” వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. గతేడాది వర్షాభావ పరిస్థితుల వల్ల గతంలో వేసిన బోరు నుంచి నీరు రాకపోవడంతో ఇటీవల వరుసుగా నాలుగు బోరు బావులు తవ్వించాడు. చుక్కనీరు కూడా పడలేదు.సాగుచేసిన వేరుశనగ పంట నిట్ట నిలువునా ఎండిపోవడం చూసి రైతు కలత చెందేవాడు. చేసిన అప్పులు కూడా పెరిగిపోవడంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక మనస్థాపానికి గురై వ్యవసాయ పొలంలోనే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకొని యువ రైతు ఆత్మహత్య…
315
previous post






Total views : 141201