Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh వై కోట గ్రామం దాహం తీర్చిన ముక్కా రూపానందరెడ్డి…

వై కోట గ్రామం దాహం తీర్చిన ముక్కా రూపానందరెడ్డి…

by Prakash
Mukka Rupananda Reddy

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలంలోని వై కోట గ్రామంలో ఈ రోజు నూతన వాటర్ ప్లాంట్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ అధినేత ముక్కారూపానంద రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. ఈ వాటర్ ప్లాంట్ సంబంధించి ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ నుంచి 5 లక్షల రూపాయలు సొంత నిధులతో ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంతో అంగరంగ వైభవంగా వై కోట గ్రామానికి వచ్చి ప్రజలు ఎంతో గొప్పగా ఆయనను స్వాగతించి పూల వర్షం కురిపించారు జనసముద్రం అంతా ఆ గ్రామంలో అక్కడే కనబడింది గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

గ్రామస్తులు మాట్లాడుతూ మేము అడిగిన వెంటనే వాటర్ ప్లాంట్ మాకు తన సొంత నిధులు ఇచ్చి ఈ ప్లాంట్ నిర్వహించినందుకు ముక్కా రూపానంద రెడ్డి కి మా గ్రామం తరపున గ్రామ మహిళల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మేము అడిగిన వెంటనే కాదనకుండా ప్లాంట్ సంబంధించి అమౌంట్ వేసి ప్రారంభించే దానికి ఆయనే రావటం మాకు ఎంతో సంతోషం ఇచ్చిందన్నారు. ఎన్నో వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముక్కా రూపానంద్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి అని ఆ గ్రామం ఎంత మార్మోగింది. ముక్కా రూపానంద్ రెడ్డి మాట్లాడుతూ వైకోట గ్రామానికి సంబంధించి ఎటువంటి కష్టమొచ్చినా ఏ సహాయం కావాలన్నా నా దగ్గరికి రావచ్చు అని ఏదైనా నేను చేసే దానికి సిద్ధమని ఆయన అన్నారు. గ్రామస్తులంతా చప్పట్లు కొడుతూ ఈలలు వేయడం జరిగింది. ఈ గ్రామం నాది ఇక ఈ గ్రామానికి ఏమి కావాలన్నా అందరి కంటే నేను ముందుంటాను ఏమి కావాలన్నా నేను చేస్తానని ఆయన అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

023099
Total views : 140904

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.