హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టెలమండిలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఆడుకుంటున్న చిన్నారిని ఓ దుండగుడు ఆటోలో ఎక్కించుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. చిన్నారి కిడ్నాప్తో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్లోని బేగంబజార్ ఛత్రి ప్రాంతంలో ప్రియాంక అనే మహిళ తన సోదరుడితో కలిసి నివసిస్తోంది. అయితే శనివారం సాయంత్రం తన సోదరుడి కుమార్తె ప్రగతితో కలిసి కట్టెలమండిలోని తల్లి ఇంటికి వచ్చింది. ప్రియాంక సోదరి కుమారుడు హృతిక్తో ఆడుకునేందుకు బాలిక ఇంటి సమీపంలోని ముత్యాలమ్మ తల్లి గుడికి వెళ్లింది. కాసేపటి తర్వాత హృతిక్ ఒక్కడే ఇంటికి వచ్చాడు. కాని చిన్నారి ప్రగతి ఇంటికి రాకపోవడంతో ప్రగతి కంగారుపడింది. బయటకు వెళ్లి చిన్నారి అత్త ప్రియాంక చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఘటనా ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఆడుకుంటున్న చిన్నారిని ఓ అపరిచిత వ్యక్తి ఆటోలో ఎక్కించుకుని వెళ్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో 5 బృందాలుగా ఏర్పడి అబిడ్స్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు. చిన్నారి ప్రగతిని నిందితులు ఏం చేస్తారోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కిడ్నాప్ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- నల్గొండ జిల్లా ముదిమాణిక్యం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఎదురెదురుగా బలంగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను సైదులు , నరసయ్య గా పోలీసులు…
- వనపర్తి జిల్లా కొత్తకోటలో డ్రగ్స్ నివారణపై అవగాహన ర్యాలీ.డ్రగ్స్ నివారణపై వనపర్తి జిల్లా కొత్తకోటలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, ఎస్పీ సునీత రెడ్డి పాల్గొన్నారు. కొత్తకోట చౌరస్తా నుంచి ATR…
- స్వతంత్ర భారత్లో తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ చేసింది..దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ పార్టీ చేసిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. నాటి ప్రధాని నెహ్రూ విషయంలోనే ఓట్ చోరీ జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే… 12 ఏళ్ల మోదీ పాలనపై చర్చకు…
- ఇవాళ మంచిర్యాలలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు.సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన 36 రోజుల్లోనే గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం గర్వకారణమన్నారు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. ఇవాళ గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ…
- దుబాయి ఎంబసీ అధికారులతో చొప్పదండి ఎమ్మెల్యే భేటీ.దుబాయి ఎంబసి అధికారులతో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమావేశం అయ్యారు. ఇటీవల దుబాయిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చొప్పదండి నియోజకవర్గానికి చెందిన వారు మరణించారు. వారి మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దుబాయికి వెళ్లారు. మృతదేహాల తరలింపు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 141179