Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Telangana మహానగరంలో మరోసారి ఐటీ దాడుల కలకలం

మహానగరంలో మరోసారి ఐటీ దాడుల కలకలం

by Rama
మహానగరంలో మరోసారి ఐటీ దాడుల కలకలం

హైదరాబాద్ మహానగరంలో మరోసారి ఐటీ దాడుల కలకలం రేపుతున్నాయి. ఇవాళ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ స్వస్తిక్ రియల్టర్ కంపెనీలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సంస్థ నిర్వాహకులైన కల్పన రాజేంద్ర, లక్ష్మణ్ నివాసాలతో పాటు షాద్‌నగర్, చేవెళ్ల , బంజారాహిల్స్ కార్యాలయాలతో సహా మొత్తం మూడు చోట్ల ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవలే స్వస్తిక్ గ్రూప్ షాద్‌నగర్ ప్రాంతంలో.. ఓ ఎంఎన్‌సీ కంపెనీకి రూ.300 కోట్ల విలువైన భూమిని అమ్మింది. అయితే, బ్యాలెన్స్ షీట్స్‌ లో భూ విక్రయానికి సంబంధించి లెక్కలు చూపలేదనే ఆరోపణ నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.
    రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ముఖ్యంగా బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాజధానిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం…
  • పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.
    2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని వాడపల్లి…
  • ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.
    ఏపీ హైకోర్టు మాజీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడైన ఐపీఎస్ అధికారి ఎం. సునీల్ కుమార్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను జూలై 3, 2026కి వాయిదా వేసింది. అప్పటివరకు ఆయనకు మధ్యంతర రక్షణ కల్పించిన…
  • లంచగొండి అధికారుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి.
    రైడ్స్ జరగడం… అధికారులు పట్టుబడడం… ఆ తర్వాత కేసులన్నీ నీరుగారిపోవడం… ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ పరిధిలో జరుగుతున్న పరిణామాలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తి ఇది. వ్యవస్థను పట్టిపీడిస్తున్న అవినీతి వైరస్‌కు వ్యాక్సిన్ వేయాల్సిన ఏసీబీ వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.…
  • ఫిన్‌లాండ్‌లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.
    తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి విదేశాల్లో అదృశ్యమై 45 రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఫిన్‌లాండ్‌లో బీటెక్ చదువుతున్న మణిదీప్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడిని క్షేమంగా తిరిగి…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

027348
Total views : 151925

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.