Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home TelanganaHyderabad మా నాన్న అంటే నాకు ప్రాణం.. మా నాన్న దేవుడు

మా నాన్న అంటే నాకు ప్రాణం.. మా నాన్న దేవుడు

by Rama
మా నాన్న అంటే నాకు ప్రాణం.. మా నాన్న దేవుడు

మీడియాపై జరిగిన దాడికి తండ్రి తరఫున క్షమాపణలు చెప్పారు మంచు మనోజ్.. మా నాన్న అంటే నాకు ప్రాణం.. మా నాన్న దేవుడు. మా నాన్నను మా అన్న విష్ణు, వినయ్ ట్రాప్ చేశారని ఆరోపించారు. మా నాన్న దృష్టిలో నన్ను శత్రువుగా చిత్రీకరించారని కన్నీటి పర్యంతమయ్యారు. తాను ఏ తప్పు చేయకపోయినా.. తన వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని.. అందులో తప్పేంటని మనోజ్ ప్రశ్నించారు. పదిమంది కోసం నిలబడ్డానని.. అందుకే తాను చెడ్డగా మారానని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను, తన భార్య కలిసి ఒక టాయ్స్ కంపెనీ పెట్టామన్నారు. వాటికి కూడా అడ్డంకులు సృష్టించారని, తనపై దాడులు చేశారని మనోజ్ తీవ్ర ఆరోపణలు చేశారు. తన తండ్రి ముందే తనను కొట్టారని.. తనకు సపోర్ట్ చేస్తున్న అమ్మను కూడా డైవర్ట్ చేశారని మనోజ్ ఆరోపించారు. సాయంత్రం 5 గంటలకు ప్రెస్‌మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తా అన్నారు మంచు మనోజ్.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..
    యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట టెంపుల్‌లో స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా 108 కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాటిలోని పవిత్ర జలాలకు పూజలు చేశారు.పంచామృతం,…
  • కడప జిల్లా పులివెందులలో నీటి సమస్యలపై బి.టెక్ రవి విమర్శలు..
    కడప జిల్లా పులివెందులలో రాజకీయ హీట్ పెరుగుతోంది.ఇద్దరు ముఖ్యమంత్రులను అందించిన ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ తాగునీటి సమస్యలు కొనసాగుతున్నాయని టీడీపీ ఇంచార్జి బి.టెక్ రవి విమర్శించారు.ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పులివెందుల పట్టణంలోని క్రిస్టియన్ వీధిలో పెన్షన్లు ఆయన…
  • అమెరికాలో తెలుగు యువకుడు ఆత్మహత్య..
    ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో అమెరికాకు వెళ్తున్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన యువత. ఐతే అక్కడ ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్లు కొందరైతే..మరికొంత మంది సరైన ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు..ఈ నేపథ్యంలోనే…
  • కలగానే మిగిలిన సొంతింటి కల..
    పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లో పేదల సొంతింటి కల ఇంకా అటకెక్కే ఉంది. గత ప్రభుత్వ హయాంలో పార్వతీపురం మండలం అడ్డాపుశిల, సాలూరు మున్సిపాలిటీ పరిధిలో భారీ ఎత్తున టిడ్కో ఇళ్లను నిర్మించారు. మొత్తం 1,983 మంది లబ్ధిదారులకు…
  • భారీగా పెరిగిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర..
    కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా పెరిగింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై చమురు మార్కెటింగ్ సంస్థలు ఏకంగా రూ.993 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ఈ ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే, గృహ వినియోగదారులకు ఊరట…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

009343
Total views : 61800

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.