Wednesday, April 15, 2026
News Navigation
Wednesday, April 15, 2026
News Navigation

Breaking

Wednesday, April 15, 2026
Home Latest News తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన మంచు ఫ్యామిలీ వివాదం

తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన మంచు ఫ్యామిలీ వివాదం

by Rama
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన మంచు ఫ్యామిలీ వివాదం

తెలుగు రాష్ట్రాల్లో మంచు ఫ్యామిలీ వివాదం హాట్ టాపిక్ గా మారింది. తండ్రి కొడుకులు మోహన్ బాబు , మనోజ్ లు తమపై దాడి జరిగిందని ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. కాగా ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ నుండి ఫిర్యాదులు స్వీకరించిన పహాడిషరీఫ్‌ పోలీసులు . మంగళవారం.. రెండు కేసులు నమోదు చేశారు. ఇందులో మోహన్‌బాబు ఇచ్చిన ఫిర్యాదుపై.. మనోజ్‌తో పాటు భార్య భూమా మౌనిక పై కేసు నమోదు కాగా.. మంచు మనోజ్‌ ఇచ్చిన ఫిర్యాదుపై..మోహన్‌బాబుకు చెందిన 10 మంది అనుచరులపై కేసు నమోదు చేశారు. అలాగే ఈ ఇష్యూపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తుంది. కాగా మోహన్ బాబు యూనివర్సిటీ లో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని.. వాటిని ప్రశ్నించి బాధితులకు అండగా ఉన్నందుకు తనపై దాడులు చేస్తున్నారని ఈ రోజు ఉదయం.. మంచు మనోజ్ సంచలన ఆరోపణలు చేశారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ..
    ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు సీఎం రేవంత్‌రెడ్డి. డీలిమిటేషన్‍తో సౌత్‌ స్టేట్స్‌తో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఈ నిర్ణయంతో బీజేపీకి తాత్కాలికంగా లాభం జరగవచ్చు కానీ..దీర్ఘకాలంలో దేశానికి నష్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి..ఈ మేరకు డీలిమిటేషన్ విషయంలో…
  • శ్రీశైలం మహాక్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ..
    నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు రావడంతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. ప్రస్తుతం దర్శనానికి సుమారు…
  • భారత భూభాగాలకు చైనా కల్పిత పేర్లు..
    అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు చైనా కల్పిత పేర్లు పెట్టడాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. చైనా చర్య దురుద్దేశపూరితమంటూ మండిపడింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎప్పటికీ భారత్‌లో విడదీయలేని అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. కల్పిత పేర్లు పెట్టడం ద్వారా వాస్తవాలను మార్చలేరని స్పష్టం చేసిన…
  • హైదరాబాద్‌లో అంతులేకుండా పోతున్న రియల్‌ మోసాలు..
    హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ సంస్థల ఆగడాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. చిన్న చితకా సంస్థల నుంచి మొదలుపెట్టి… బడా బడా కన్‌స్ట్రక్షన్‌ కంపెనీల వరకూ అందరూ నిబంధనలను తుంగలో తొక్కేవారే. కొంచెం ఎక్కువ… కొంచం తక్కువ అనే తప్ప… ఉల్లంఘనలకు…
  • పశ్చిమాసియాలో మళ్లీ మొదటికొచ్చిన పరిస్థితి..
    పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పాకిస్థాన్‌ వేదికగా అమెరికా – ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో… మళ్లీ యుద్ధం మొదలయ్యే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ దిశగా ట్రంప్‌ అనేక సూచనలు కూడా ఇచ్చారు. దీంతో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

005710
Total views : 38460

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.