Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra Pradesh దొంగ ఓట్ల నిర్మూలనపై దృష్టి సారించాలి- టీడీపీ కోళ్ల లలిత

దొంగ ఓట్ల నిర్మూలనపై దృష్టి సారించాలి- టీడీపీ కోళ్ల లలిత

by Prakash
tdp incharge kolla lalitha kumari

విజయనగరం జిల్లా, శృంగవరపుకోట, కిల్తంపాలెంలో బాబు ష్యురిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పొల్గొన్న శృంగవరపుకోట నియోజకవర్గ ఇంచార్జి & మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి. శృంగవరపుకోట మండలం, కిల్తంపాలెం పంచాయతీ దెప్పురు & కరక వంజురు గ్రామాల్లో ఏర్పాటు చేసిన బాబు ష్యురిటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. బాబు ష్యురీటి భవిష్యత్తుకు గ్యారెంటీ భాగంగా ఇంటింటికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేస్తూ కరపత్రాలను పంపణీ చేశారు. అనంతరం ప్రజలకు మినీ మేనిఫెస్టో పథకాల గురించి వివరించారు. ప్రతీ క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్ల పరిధిలో ఉన్న ఓటరు జాబితాలను పరిశీలించి దొంగ ఓట్లను గుర్తించాలని, టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తే వాటిని మరల చేర్పించాలని సూచించారు. త్వరగా కొత్త ఓట్లపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు.

Advertisements

You may also like

Our Visitor

026501
Total views : 150551

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.