Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Crime జగిత్యాలలో అర్ధరాత్రి చెలరేగిన మంటలు..

జగిత్యాలలో అర్ధరాత్రి చెలరేగిన మంటలు..

by Prakash
fire accident

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని గడి బురుజు వద్ద గల సూపియాన్ కట్టే మిషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంబవించింది. తెల్లవారుజామున ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దుకాణంలో కర్రలు పెద్ద ఎత్తున నిలువ ఉండడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. జనావాసాల మధ్యనే కట్టే మిషన్ దుకాణం ఉండడంతో ఎగిసిపడుతున్న మంటలను చూసి చుట్టుపక్కల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటివరకు ఎగిసిపడిన మంటలు కాస్త తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది .కాలిపోయిన కర్ర విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని స్థానికులు అంటున్నారు.

Advertisements

You may also like

Our Visitor

027092
Total views : 151559

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.