విజయవాడ తూర్పు నియోజకవర్గ ,బీజేపీ,జనసేన బలపరిచిన టిడిపి అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు నామినేషన్ అనంతరం మీడియా సమావేశం
గద్దె రామ్మోహన్ కామెంట్స్ (Gadde Rammohan Comments) :
5 సవంత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏముంది చెప్పుకోవటానికి ఒకసారి ఆలోచించండి.. మధ్య పానం నిషేధించిన తరువాత ఓట్లు అడుగుతాను అన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏమైయ్యారు.. జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో ఐదు లక్షల మంది మద్యం వల్ల చనిపోయారు.. 35 వేల మంది రోగాల బారిన పడ్డారు, 33 వేల మంది బాలికలు అదృశ్యం అయినారు. జగన్మోహన్ రెడ్డి పైన రాయి తగిలితే ఒక బాలుడుకి శిక్ష వేశారు. ముఖ్యమంత్రి చేసే బస్సు యాత్రకు ప్రజలు కరువైనారు. చదువు పూర్తయిన విద్యార్థుల సర్టిఫికెట్లు బీరువాలో దాచిపెట్టారు. 5 సవంత్సరాలలో 25 లక్షల ఉద్యోగాల ఇవ్వడమే లక్ష్యంగా ఈ కూటమి పనిచేస్తుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
జనసేన పార్టీ ఈస్ట్ ఇన్ ఛార్జ్ అమ్మిశెట్టి వాసు కామెంట్స్ (Ammisetty Vasu Comments) :
గద్దె రామ్మోహన్ నామినేషన్ కార్యక్రమానికి వేలమంది అభిమానులు రావడం జరిగింది.. ఇక్కడ గెలుపే కాకుండా భారీ మెజార్టీ తో గెలిపిస్తామని నియోజక వర్గ ప్రజలు అంటున్నారు.. బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మాజీ జడ్పిటిసి గద్దె అనురాధ కామెంట్స్ (Gadde Anuradha Comments) :
అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేశారు, పోలవరం ప్రాజెక్టుని పాడేపెట్టారు. ప్రజలు ఈ రోజున తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు. పరిశ్రమలు లేక అనేక మంది పనులు లేకుండా వాళ్ళు ఇబ్బందులు పాలౌతున్నారు..
- రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ముఖ్యంగా బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాజధానిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం…
- పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని వాడపల్లి…
- ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.ఏపీ హైకోర్టు మాజీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడైన ఐపీఎస్ అధికారి ఎం. సునీల్ కుమార్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను జూలై 3, 2026కి వాయిదా వేసింది. అప్పటివరకు ఆయనకు మధ్యంతర రక్షణ కల్పించిన…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 150894